AP News:‘గ్రామ’ ఉద్యోగులకు ఆర్థిక గండం!
ఉద్యోగంలో చేరి రెండేళ్లయినా ప్రొబేషన్ ఖరారవ్వక చాలీచాలని జీతంతో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వీరిలో అత్యధికులు వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తూ
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారులో జాప్యం
అరకొర వేతనాలతో అవస్థలు
ఈనాడు - అమరావతి
ఉద్యోగంలో చేరి రెండేళ్లయినా ప్రొబేషన్ ఖరారవ్వక చాలీచాలని జీతంతో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వీరిలో అత్యధికులు వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తూ పరీక్షలు రాసి ఎంపికైనవారే. సచివాలయాల్లో ప్రస్తుతం వస్తున్న జీతంకంటే ప్రైవేటు సంస్థల్లో రెండింతలు పొందేవారు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో చేరారు. రెండేళ్లు పూర్తయ్యాక ప్రొబేషన్ ఖరారైతే జీతం పెరుగుతుందని ఆశించారు. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియ జూన్30లోగా పూర్తి చేస్తామని సీఎం ఉద్యోగ సంఘాల నాయకులతో తాజాగా శుక్రవారం హామీనిచ్చారన్న సమాచారంతో వారు మరింత ఆవేదనకు గురయ్యారు. ఎన్నాళ్లీ ఆర్థిక కష్టాలని ఆందోళన చెందుతున్నారు.
మొదట కలెక్టరు... ఇప్పుడు ప్రభుత్వం
సచివాలయాల్లో ఉద్యోగుల ప్రొబేషన్ను కలెక్టర్లే ఖరారు చేస్తారని 2021 సెప్టెంబరు29న జారీ చేసిన సర్క్యులర్లో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పేర్కొంది. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసినందున ప్రొబేషన్ ప్రక్రియను కలెక్టర్లు పూర్తి చేస్తారని అధికారులు అప్పట్లో వెల్లడించారు.
2021 డిసెంబరు 17న విడుదలచేసిన మరో సర్క్యులర్లో ప్రొబేషన్ ఖరారు చేయదలచిన ఉద్యోగుల జాబితాలను కలెక్టర్లు సంబంధిత ప్రభుత్వ శాఖల రాష్ట్ర స్థాయి విభాగాధిపతులకు పంపాలని సూచించారు. వీటిని ప్రభుత్వం ఆమోదించాకే ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారైనట్లు భావించి సవరించిన వేతనాలు అమలుచేయాలని వార్డు, సచివాలయాల శాఖ పేర్కొంది. 2నెలల వ్యవధిలో ఇచ్చిన రెండు సర్క్యులర్లతో జిల్లాల్లో ప్రొబేషన్ ప్రక్రియ కొలిక్కి రాలేదు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ దూరం
సచివాలయాల్లో చేరిన వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అనర్హులుగా తేల్చారు. రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులను వారు కోల్పోయారు. అప్పటివరకు పిల్లలకు అందిన జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన రద్దు చేశారు.
ఎందుకీ జాప్యం?
ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేస్తే ప్రభుత్వంపై నెలకు దాదాపు రూ.134 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం నెలకు రూ.15వేల జీతం చొప్పున రాష్ట్రంలోని 1,34,694 మంది సచివాలయ ఉద్యోగులకు రూ.202 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రొబేషన్ ఖరారుచేసి వేతనాలు సవరిస్తే ఒక్కో ఉద్యోగికి నెలకు సుమారు రూ.25వేల జీతం చెల్లించాల్సి ఉంటుందని లెక్కిస్తున్నారు. అంటే నెలకు రూ.336 కోట్లు అవసరవుతాయి. ఆర్థికంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరింత భారమని ప్రొబేషన్ ఖరారులో జాప్యం చేస్తుందా? అనే అనుమానాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
ఒక ప్రైవేటు సంస్థలో నెలకు రూ.30వేల వేతనం వదులుకుని సచివాలయ ఉద్యోగిగా చేరా. రెండేళ్లకుపైగా నెలకు రూ.15వేల జీతానికి పని చేస్తున్నా. ఇంటి అద్దె, రోజువారీ ఖర్చులు, పిల్లల స్కూలు ఫీజులకు నెలకు రూ.25వేలు ఖర్చవుతోంది. చక్కటి ఉద్యోగం వదులుకుని ఎందుకు చేరానా? అని ఒక్కోసారి బాధేస్తోంది.
-గుంటూరు జిల్లాలోని ఒక గ్రామసచివాలయం ఉద్యోగి ఆవేదన
నెలకు రూ.40 వేల జీతం ఇస్తామన్న బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో చేరుదామనేలోగా సచివాలయాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పరీక్ష రాసి ఎంపికయ్యా. గది అద్దె, భోజనం, బండికి పెట్రోల్, ఇతర ఖర్చులకే రూ.15వేల జీతం సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేకపోయా.
-తూర్పుగోదావరి జిల్లాలోని ఒక వార్డు సచివాలయ ఉద్యోగి ఆందోళన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!