APIIC:ఐటీ సెజ్ భూములను కట్టబెట్టేశారు!
అది ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. దానికి నగరానికి దూరంగా ఎక్కడ భూములు ఇచ్చినా సరిపోతుంది. కానీ, కడప నగరానికి ఆనుకుని ఉన్న విలువైన భూములను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక
ఒకే దరఖాస్తు.. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్కు 49.8 ఎకరాలు
మార్కెట్ ధర రూ.150 కోట్లు.. రూ.42.5 కోట్లకే ధారాదత్తం
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-కడప నగరపాలక: అది ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ. దానికి నగరానికి దూరంగా ఎక్కడ భూములు ఇచ్చినా సరిపోతుంది. కానీ, కడప నగరానికి ఆనుకుని ఉన్న విలువైన భూములను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) కట్టబెట్టింది. పరిశ్రమకు కేటాయించిన భూముల చుట్టూ నివాస ప్రాంతాలే ఉన్నాయి. సింగపూర్ టౌన్షిప్, కేంద్రీయ విద్యాలయం, రామకృష్ణ మఠం, ప్రభుత్వాసుపత్రి, ప్రభుత్వం నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లాంటివి సుమారు అర కిలోమీటరు పరిధిలో చుట్టూ ఉన్నాయి. వాటిమధ్యలో పరిశ్రమ ఏర్పాటుకు భూములను కేటాయించటంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే సంస్థకు ఐటీ సెజ్ భూములు
కడప నగరాన్ని అనుకుని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలో సీపీ బ్రౌన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ పేరిట ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిని (ఐటీ సెజ్) 2007లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీనికోసం 52.76 ఎకరాలను పుట్లంపల్లి గ్రామ పరిధిలోని 260, 261, 264, 266, 267/1, 267/2 సర్వే నంబర్లలో ఉన్న భూములను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. ఇందులో 0.31 ఎకరాలను సబ్స్టేషన్ ఏర్పాటుకు దక్షిణప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు ఏపీఐఐసీ గతంలో కేటాయించింది. ఇది పోను ఇంకా 52.45 ఎకరాల భూములను 8 ఐటీ పరిశ్రమలకు కేటాయించేలా ఏపీఐఐసీ డీటీఎల్పీ నెం 9716/110/07/ఎ ద్వారా లే అవుట్ను రూపొందించింది. ఈ మేరకు ప్రతిపాదనను కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఆమోదానికి పంపి.. ఐటీ సెజ్ కింద అప్పటి ప్రభుత్వం నోటిఫై చేసింది.
మూడోవంతు ధరకే...
దాదాపు ఈ సెజ్ భూములన్నింటినీ కడపకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే సంస్థకు ఏపీఐఐసీ కట్టబెట్టింది. బహిరంగ మార్కెట్లో ఎకరా సుమారు రూ.3 కోట్లు ఉంటుంది. అంటే వాటి విలువ సుమారు రూ.150 కోట్లు అవుతుంది. ఈ భూములకు 2021 మార్చి 22న ప్లాట్ ధరను చదరపు కి.మీ. రూ.2,108 వంతున ఏపీఐఐసీ వీసీఎండీ ఫైల్ నెం-1337705 ద్వారా ఖరారు చేశారు. దీని ప్రకారం ఎకరా రూ.85.31 లక్షలు అవుతుంది. ఇవే భూములను ట్రాన్స్ఫార్మర్ల తయారీ పరిశ్రమకు రూ.42.48 కోట్లకు కేటాయిస్తూ 2021 అక్టోబరు 21న ప్రొవిజినల్ అలాట్మెంట్ ఉత్తర్వులను ఏపీఐఐసీ జారీచేసింది.
ఎస్ఐపీసీ పరిధికి రాకుండా..
ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం.. పరిశ్రమల ఏర్పాటుకు 5 ఎకరాల్లోపు ప్లాట్ల కేటాయింపు ప్రతిపాదనలపై జిల్లా స్థాయిలోని పెట్టుబడులు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసిన 60 రోజుల్లో కేటాయించకపోతే మాత్రమే ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలోని రాష్ట్రస్థాయి భూముల కేటాయింపు కమిటీ (ఎస్ఎల్ఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. 5 నుంచి 50 ఎకరాల వరకు ఉన్న కేటాయింపు ప్రతిపాదనలపై ఎస్ఎల్ఏసీ సమావేశంలో సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఎండీ) నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ వీసీఎండీ నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరిగితే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో చర్చించాలి. 50 ఎకరాలకు మించిన ప్రతిపాదనలు ఏవైనా సరే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ), సీఎం ఛైర్మన్గా ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్ఐపీబీ) నిర్ణయం తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకునే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కు భూముల కేటాయింపు విషయంలో అధికారులు జాగ్రత్తపడ్డారు. దీనికోసం సెజ్కు ప్రతిపాదించిన భూముల్లో ఎస్పీడీసీఎల్కు కేటాయించిన 0.31 ఎకరాలు పోను మిగిలిన 52.45 ఎకరాల్లో షిరిడీ సాయి సంస్థకు పూర్తిగా కేటాయించకుండా.. 49.8 ఎకరాలను కేటాయిస్తూ ప్రొవిజినల్ అలాట్మెంట్ను ఏపీఐఐసీ జారీచేసింది. ఈ సంస్థకు డైరెక్టర్గా నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి 11 ఏళ్లుగా వ్యవహరిస్తున్నారు. శరత్చంద్ర కొల్లా, వినోద్, విక్రం రవీంద్ర మామిడిపూడి, కనకధార శ్రీనివాసన్ గత రెండు మూడేళ్లలో డైరెక్టర్లుగా చేరారు. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కు కేటాయించిన ప్లాట్ విస్తీర్ణం పోను మిగిలిన 2.65 ఎకరాలను ఎస్పీడీసీఎల్కు కేటాయించాలని నిర్ణయించినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు.
ఒకే ఒక్క దరఖాస్తు
ఐటీ సెజ్ కింద నోటిఫై చేసిన తర్వాత.. దానికి మళ్లీ కేంద్రం నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు రావాలి. దీనికోసం విశాఖలోని ఐటీ సెజ్ నుంచి ప్రతిపాదన వెళ్లింది. దీని ప్రకారం 2020 నవంబరు 18న కేంద్రం నుంచి డీ నోటిఫై ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటినుంచి ఆ భూములను ఇతర అవసరాలకు వినియోగించుకోటానికి కేటాయించే అధికారం ఏపీఐఐసీకి వస్తుంది. ఈ భూముల కేటాయింపు కోసం షిరిడీ సాయి సంస్థ దరఖాస్తు చేసుకుందని.. ఈ మేరకు ప్రతిపాదన పరిశీలించి లీజు ప్రాతిపదికన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) ఇచ్చామని ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు తెలిపారు. ఈ భూముల కోసం ఒకే సంస్థ దరఖాస్తు చేసుకుందని.. ఎక్కువ దరఖాస్తులు ఉంటే వేలం ద్వారా కేటాయించే వాళ్లమని పేర్కొన్నారు. ఐటీ సెజ్కు కేటాయించిన భూములను డీ నోటిఫై చేసి.. షిరిడీసాయి ఎలక్ట్రికల్స్కు కేటాయించినట్లు కడప ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జయలక్ష్మి ‘ఈనాడు’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు