Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?
ఎసైన్డ్ వ్యవసాయ భూములపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చే ప్రయత్నాల్లో
లబ్ధిదారులకు కల్పించే యోచన
ఆదాయ మార్గాల్లో భాగంగా ప్రభుత్వ పరిశీలన
ఈనాడు, అమరావతి: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చే ప్రయత్నాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిలో కొందరికి రెండున్నర ఎకరాల మాగాణి, మరికొందరికి అయిదెకరాల మెట్ట భూమిని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో కేటాయిస్తూ వస్తోంది. సొంతంగా భూములను సాగు చేయడం, కౌలుకు ఇవ్వడం ద్వారా లబ్ధిదారు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ భూములను వారసత్వంగా అనుభవించాల్సిందే. క్రయవిక్రయాలకు ఎలాంటి అనుమతి లేదు. ఇదే విషయాన్ని భూ బదలాయింపు నిషేధ చట్టం స్పష్టం చేస్తోంది. అయితే... ఇంటి స్థలాలను ఎసైన్ చేశాక, వాటిలో 12 నెలల్లో ఇళ్లను నిర్మించుకుని పదేళ్ల తర్వాత విక్రయించుకునేలా 2021లో నిబంధనలను సవరించారు. ఇలాంటి చట్ట సవరణ ద్వారానే వ్యవసాయ భూములపై ఎసైన్డ్దారులకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
పరిశీలించాలని రెండు శాఖలకు ఆదేశాలు
రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ఇప్పటివరకు సుమారు 35 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను ఎసైన్ చేసినట్లు అంచనా. వీటికి డి.పట్టా పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలనూ ఇచ్చారు. ఈ భూములు చాలావరకు ఒకప్పుడు పట్టణాలు, నగరాలు, మేజర్ గ్రామ పంచాయతీకు దూరంగా ఉండేవి. పట్టణీకరణ కారణంగా చాలావరకు నగరాలు, పట్టణాల్లో భాగమయ్యాయి. దాంతో వాటికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా కొత్త జిల్లా కేంద్రాలకు సమీపంలోని భూములకు మరింత గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎసైన్డ్ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులను కల్పిస్తే... రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కారాలు ఎలా చూపొచ్పు? అనే వాటిని పరిశీలించాలని రెవెన్యూ, స్టాంపులు/రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. వాస్తవానికి... లబ్ధిదారులకు కేటాయించిన భూముల్లో చాలావరకు చేతులు మారుతున్నాయి. కొన్నిచోట్ల ఆన్లైన్లోనూ పేర్లను అక్రమంగా మార్చారు. ఎసైన్డ్ భూములను విక్రయించినట్లు తెలిస్తే వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు. ఇలా కొన్నిసార్లు చేస్తున్నారు. ఒకవేళ పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తే..ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఉండదు. మరోవైపు చాలాచోట్ల ఈ భూములపై అసలు లబ్ధిదారులు, వారసులు లేరు. ఈ పరిస్థితుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా ప్రయోజనం పొందే నిజమైన లబ్ధిదారులు తక్కువగానే ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు