Kodali Nani: మాకు.. జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం?
‘మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం. నన్ను, వంశీని ఆయన ఎందుకు నియంత్రిస్తారు. మేమేమన్నా ఆయన పార్టీనా? ఆయన సినిమాకు నిర్మాతలమా? లేదా డైరెక్టర్లమా? లేకపోతే ఆయన దగ్గరేమన్నా నటన నేర్చుకున్నామా?
మేం వైకాపాలో ఉన్నాం... జగన్ కోసం ఏమైనా చేస్తాం: మంత్రి కొడాలి నాని
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని. పక్కన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం. నన్ను, వంశీని ఆయన ఎందుకు నియంత్రిస్తారు. మేమేమన్నా ఆయన పార్టీనా? ఆయన సినిమాకు నిర్మాతలమా? లేదా డైరెక్టర్లమా? లేకపోతే ఆయన దగ్గరేమన్నా నటన నేర్చుకున్నామా? ఒకప్పుడు కలిసి ఉన్నాం. విభేదాలు వచ్చి బయటకు వచ్చాం. ఇప్పుడు వైకాపాలో ఉన్నాం. జగన్ మా నాయకుడు. ఆయన చెప్పినా... చెప్పకపోయినా ఆయన కోసం ఏదైనా చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేమెందుకు వింటాం?’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సచివాలయ ఆవరణలో వైకాపాతో సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘చంద్రబాబు శిష్యులు వైకాపా, తెరాసలో ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, వైకాపా ఎమ్మెల్యే రోజా, తెరాస మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చంద్రబాబు శిష్యులే కదా? వారు ఆయన్ని తిడుతున్నారుగా? వారిని చంద్రబాబు నియంత్రించారా?’ అని ప్రశ్నించారు. ‘నందమూరి కుటుంబం అంటే అందరికీ గౌరవం ఉంది. వాళ్లు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నారు. వాళ్లను చూస్తే జాలేస్తుంది. నందమూరి కుటుంబంలో ఒక్కరిని తప్ప చంద్రబాబు మిగతా వారందరినీ మోసం చేయగలరు’ అని పేర్కొన్నారు.
జగన్ ఏమన్నా పైనుంచి నీళ్లు పోశారా?: ‘రెండు టీఎంసీలు పట్టే అన్నమయ్య ప్రాజెక్టులో 6 గంటల వ్యవధిలో 32 టీఎంసీలు వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవరైనా ఆపగలరా? ఇందులో మానవ తప్పిదం ఏముంది? జగన్ ఏమన్నా పైనుంచి నీళ్లు పోశారా?’ అని ప్రశ్నించారు.
సీఎం, పీఎం వెళితే సమస్యలు పరిష్కారమవుతాయా?: ‘సీఎం వెళితే వరద సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని ఇక్కడి నుంచే రోజూ కలెక్టర్లతో సమీక్షిస్తున్నారు. తక్షణ సౌకర్యాలు కల్పించిన తర్వాత పలకరించడమో... పరామర్శించడమో చేస్తారు. అయినా సీఎం, పీఎం వెళితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయా?. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి. సానుభూతి, ఓట్లు పొందాలనుకుంటున్నారు. కడప జిల్లాపై జగన్ కన్నా చంద్రబాబుకు ఎక్కువ ప్రేమ ఉంటుందా?’ అని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు సతీమణి గురించి ఆయనే అల్లరి చేసుకుంటుంటే మేమెందుకు క్షమాపణ చెప్పాలి. మేమన్నా అంటే కదా? ఆమె పేరును అసెంబ్లీ లోపల, బయట ఎక్కడా మేం చెప్పలేదు’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం