నర్సీపట్నాన్నే జిల్లా కేంద్రం చేయాలి
జిల్లా కేంద్రంగా నర్సీపట్నాన్నే చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ మల్లికార్జునకు లేఖలు అందజేశారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు
వైకాపా ఎమ్మెల్యే గణేష్
న్యూస్టుడే బృందం: జిల్లా కేంద్రంగా నర్సీపట్నాన్నే చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ మల్లికార్జునకు లేఖలు అందజేశారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు నర్సీపట్నం కేంద్రంగానే పాలించారని, అల్లూరి సీతారామరాజు పోరాట స్మృతులు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయని లేఖల్లో ప్రస్తావించారు. ఇక్కడున్న వసతులు, భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు నర్సీపట్నం అందుబాటును వివరించారు.
* నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు.
* రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుచేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణదొర, మొడియం శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆదివాసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అద్దంకిని ప్రకాశంలోనే కొనసాగించాలి
- శాప్ నెట్ ఛైర్మన్ కృష్ణచైతన్య
అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లా పరిధిలోనే కొనసాగించాలని వైకాపా అద్దంకి నియోజకవర్గ కన్వీనర్, శాప్ నెట్ ఛైర్మన్ బాచిన కృష్ణచైతన్య కోరారు. దగ్గరలో ఉన్న ఒంగోలును కాదని వంద కి.మీ.దూరంలోని బాపట్లలో కలపడాన్ని నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. సాంకేతికంగా కుదరని పక్షంలో స్థానికంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయాలన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జి మంత్రి విశ్వరూప్ తదితరులకు సమస్యను వివరించనున్నట్లు తెలిపారు.
* కోనసీమ జిల్లాగా ప్రకటించిన అమలాపురం డివిజన్కు అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు.
ఉదయగిరి జిల్లా సాధిద్దాం
నెల్లూరు జిల్లా ఉదయగిరిని జిల్లా కేంద్రం చేయాలనే ఎజెండాతో మేధావులు, నాయకులు, ప్రజలు పార్టీలకతీతంగా ఉద్యమించాలని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు డాక్టరు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఉదయగిరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడలిలో నిరసన నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయగిరి జిల్లా సాధన సమితి నాయకులు డి.రమేష్, చంద్రశేర్రెడ్డి, తెదేపా, భాజపా మండల కన్వీనర్లు, విశాంత్ర ఉద్యోగులు పాల్గొన్నారు.
* కర్నూలు జిల్లాలో వెనకబడిన ఆదోని ప్రాంత అభివృద్ధికి ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాయలసీమ సమన్వయ కమిటీ, సీమ విద్యార్థి సంఘం ఆందోళన నిర్వహించింది. ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
* చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని నియోజకవర్గ తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్ డిమాండ్ చేశారు. నియోజకవర్గం తిరుపతి తుడా పరిధిలో ఉందని గుర్తుచేశారు.
ఎస్.కోటను విశాఖ జిల్లాలో కలపాలి
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలంటూ వైకాపా నేతలు, ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండు చేశారు. వైకాపా నాయకులు గొర్లె రవికుమార్, పినిశెట్టి వెంకటరమణ, ఎల్.కోట ఎంపీపీ శ్రీను, డీసీసీబీ ఛైర్మన్ చినరామునాయుడు, జడ్పీటీసీ సభ్యుడు అప్పారావు, ఎస్.కోట సర్పంచి సంతోషికుమారిలు ఎస్.కోటలోని దేవిగుడి కూడలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎస్.కోటను విజయనగరం జిల్లాలోనే ఉంచడం దారుణమని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ అన్నారు. పట్టణంతోపాటు, వేపాడలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఇదే డిమాండ్తో వేపాడ భాజపా మండలాధ్యక్షుడు గోకేడ మహేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన