Steel: చుక్కల్లోకి ఉక్కు ధరలు!
ఎన్ని కష్టాలు పడినా చిన్న గూడు ఉండాలన్నది సగటు మనిషి కల. పరిస్థితులు అనుకూలించి చిన్న ఇల్లు కట్టుకుందామనో, ఫ్లాట్ కొనుక్కుందామనో అనుకునేసరికి...
సిమెంటు ధరలు కూడా
రెండు వారాల్లోనే రూ.10 వేలకుపైగా పెరిగిన టన్ను ఉక్కు
బస్తాకు రూ.40 నుంచి రూ.60 వరకు పెరిగిన సిమెంటు
గృహనిర్మాణ రంగంపై పెనుభారం
ఈనాడు, అమరావతి: ఎన్ని కష్టాలు పడినా చిన్న గూడు ఉండాలన్నది సగటు మనిషి కల. పరిస్థితులు అనుకూలించి చిన్న ఇల్లు కట్టుకుందామనో, ఫ్లాట్ కొనుక్కుందామనో అనుకునేసరికి... నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం సామాన్యులకు అశనిపాతంలా మారింది. ఉక్కు, సిమెంటు ధరలు రెండు వారాల్లోనే అనూహ్యంగా పెరిగిపోయాయి. ఉక్కు ధర 15 రోజుల్లో టన్నుకు రూ.10-11 వేలకు పైగా పెరిగింది. 50 కిలోల సిమెంటు బస్తా ధర బ్రాండును బట్టి రూ.40-60 వరకు పెంచేశారు. వేసవి మొదలు కానుండటం, మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా అంత ప్రమాదకరంగా లేకపోవడంతో రాష్ట్రంలో చాలాచోట్ల నిర్మాణ రంగంలో కొంత కదలిక మొదలైంది. సొంతిళ్లతో పాటు అపార్టుమెంట్ల నిర్మాణాలూ ప్రారంభమవుతున్నాయి. ఈ డిమాండును సొమ్ము చేసుకునేందుకు ఉక్కు, సిమెంటు ఉత్పత్తిదారులు ధరలు పెంచేస్తున్నారు. దీంతో బడ్జెట్ గాడి తప్పి.. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఉక్కు ధరలు అనూహ్యంగా పెరిగాయి.
విశాఖ ఉక్కు, సింహాద్రి టీఎంటీ సంస్థలు శుక్రవారం నుంచి టన్నుకు మరో రూ.2 వేలు ధర పెంచేశాయి. విశాఖ ఉక్కు తర్వాత అత్యధికంగా అమ్ముడయ్యే సింహాద్రి టీఎంటీ స్టీలు ధర 15రోజుల క్రితం టన్ను రూ.60,180 ఉండేది. ఇప్పుడది రూ.71,390కి చేరింది. ఈ ధరలు విశాఖలోనివి (అసలు ధరకు 18% జీఎస్టీ కలిపి). వీటికి లోడింగ్, బెండింగ్ ఛార్జీలు అదనం. అక్కడి నుంచి విజయవాడ వరకు వచ్చేసరికి టన్నుకి మరో రూ.600-700 వరకు అదనంగా ఖర్చవుతుంది.
* సింహాద్రి టీఎంటీ సంస్థ శుక్రవారం ప్రకటించిన కొత్త ధరల ప్రకారం జీఎస్టీ కలిపి... 8 మి.మీ. ఊచలు టన్ను రూ.71,390,.. 12 మి.మీ.నుంచి 25 మి.మీ. వరకు రూ.69,030,.. 10 మి.మీ., 32 మి.మీ. ఊచల ధరలు టన్ను రూ.70,250 ఉన్నాయి. ఇవి విశాఖలో డీలర్ల ధరలు. ప్రాంతాల్ని బట్టి రవాణా, డీలర్ల లాభాలు అదనం.
* విశాఖ ఉక్కు ఉత్పత్తుల ధర... సింహాద్రి టీఎంటీ కంటే టన్నుకు రూ.4వేల వరకు అదనంగా ఉంటుంది. కృష్ణాజిల్లా గుడివాడలో విశాఖ ఉక్కు టన్ను రూ.77 వేలకు విక్రయిస్తున్నట్టు ఒక డీలర్ తెలిపారు. చివరకు ఊచల్ని కలిపి కట్టేందుకు వాడే బైండింగ్ వైరు కూడా టన్ను రూ.10 వేలు పెరిగింది.
సిమెంటుదీ అదే దారి
* సిమెంటు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన కొత్త ధరలు ప్రకటిస్తాయి. ఫిబ్రవరిలో 1న పెంచి, మళ్లీ రెండు రోజులకే మరోసారి పెంచేశారు. కొన్ని ప్రముఖ బ్రాండ్ల 50కిలోల బస్తా ధరలు రెండు వారాల్లో రూ.40 వరకు పెరిగాయి. బి-కేటగిరీలోకి వచ్చే కంపెనీల సిమెంటు ధరలు బస్తా రూ.60, సి-కేటగిరీవి రూ.30 వరకు పెరిగాయి.
మరింత పెరిగే అవకాశం?
డిమాండు బాగుండటంతో ఉక్కు, సిమెంటు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ రంగాలవారు చెబుతున్నారు. ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్, కోల్ ధరలు పెరగడంతో ఉక్కు ఉత్పత్తుల ధరలు పెరిగాయని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. కానీ డిమాండే అసలు కారణమన్నది నిర్మాణరంగ నిపుణుల మాట. డిమాండు పెరిగినప్పుడల్లా సిమెంటు ఉత్పత్తిదారులు ధరలు పెంచడం పరిపాటిగా మారింది. గతంలో ధరలు పెరగకుండా కొంత ప్రభుత్వ నియంత్రణ ఉండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి