Amaravathi:అమరావతిపై అదే నిర్లక్ష్యం
రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని, మూడు నెలల్లో రైతులకు లేఅవుట్లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలని, మాస్టర్ప్లాన్ ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు
రాజధాని నిర్మాణానికి కేటాయింపులు సున్నా
కోర్టు ఆదేశించినా పెడధోరణే
కేంద్రం నుంచి రూ.800 కోట్లు వస్తుందని మభ్యపెట్టే ప్రయత్నం
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని, మూడు నెలల్లో రైతులకు లేఅవుట్లు అభివృద్ధి చేసి స్థలాలు అప్పగించాలని, మాస్టర్ప్లాన్ ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా... రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదు. హైకోర్టు చెబితే ఏంటి? మా ధోరణి మాదే అన్న వైఖరినే ప్రదర్శిస్తోంది. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి 2022-23 వార్షిక బడ్జెట్లో ఒక్క రూపాయీ కేటాయించకపోవడమే దీనికి నిదర్శనం. ఈ బడ్జెట్లో రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1329.21 కోట్లు కేటాయించినట్లుగా చూపించి అంకెల గారడీ చేసింది. దానిలో రూ.800 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంగా వస్తుందని ఊహించి పెట్టింది. మిగతా మొత్తం గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీలకు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు, భూమి లేని పేద కుటుంబాలకు పింఛను చెల్లించేందుకు కేటాయించింది. అంతే తప్ప రాజధానిలో తక్షణం పనులు చేపట్టే దిశగా ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులూ చేయలేదు.
కేంద్రం ఎందుకు ఇస్తుంది?
రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.800 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించడం రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికేనని వివిధ వర్గాలు విమర్శిస్తున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం.. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.1,500 కోట్లు ఇచ్చింది. మరో రూ.వెయ్యి కోట్లు వరకు ఇస్తామని మౌఖికంగా చెప్పినట్టు సమాచారం. అప్పట్లో తెదేపా ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం కోసం సుమారు రూ.69వేల కోట్లతో నీతిఆయోగ్కి డీపీఆర్లు పంపింది. రాజధానికి నిధులివ్వాలంటూ కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేసేది. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణ పనులు నిలిపివేసింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తేవడానికి ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న గ్యారంటీ లేకపోయినా, బడ్జెట్లలో మాత్రం ప్రతిపాదనలు పెట్టడం, ఖర్చు సున్నా చూపించడం ప్రజల్ని మోసం చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అమరావతి మెట్రోకు రూ.2 కోట్లే!
అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.2 కోట్లే కేటాయించింది. 2021-22లో రూ.3.60 కోట్లు కేటాయించినట్లు చూపినా.. సవరించిన బడ్జెట్లో రూ.2.70 కోట్లుగా పేర్కొంది. తొలి దశలో చేపట్టే 38.74 కి.మీ. పనులకు సంబంధించిన అమరావతి మెట్రో రైలు డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ నిపుణుల పరిశీలనలోనే ఉంది. దీనికి ఒక్క రూపాయీ కేటాయించలేదు.
కేటాయింపులు ఇవే..
* 2022-23 బడ్జెట్ కేటాయింపుల్లో ‘ఏపీసీఆర్డీఏ’కి సాయం పేరుతో రూ.200 కోట్లు కేటాయించింది. అది గతంలో రాజధాని నిర్మాణం కోసం హడ్కో, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఉద్దేశించింది. 2021-22 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం రుణాలపై వడ్డీలు, అసలు చెల్లించేందుకు ఏడాదికి రూ.550 కోట్లు కావాలి. ఈ బడ్జెట్లో రూ.200 కోట్లే చూపించారు.
* ‘రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి’ పేరుతో మరో రూ.121.11 కోట్లు కేటాయించారు. అవి రాజధాని గ్రామాల్లోని భూమిలేని పేదలకు ప్రతి నెలా కౌలు చెల్లించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు చేసిన కేటాయింపులు.
* ‘కొత్త రాజధాని కోసం భూసమీకరణ’ పేరుతో రూ.208.10 కోట్లు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు మొత్తం ఇది.
* ఇవన్నీ తప్పనిసరిగా చెల్లించాల్సినవి కాబట్టి ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
* ‘కొత్త రాజధాని నగరంలో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధి’ పేరుతో రూ.800 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం వచ్చే హెడ్ కింద చూపింది. ఇదే పద్దు కింద 2021-22 బడ్జెట్లోనూ రూ.500 కోట్లు ప్రతిపాదించింది. కానీ 2021-22 సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం చూస్తే... దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు