ప్రజల మాటలు వింటే సీఎం గుండె ఆగుతుంది
ముఖ్యమంత్రి తన ఇంట్లో కూర్చొని సొంత పత్రిక చదవడం మానేసి మారు వేషంలో ప్రజల్లో తిరిగినా.. ఇంటెలిజెన్స్ నుంచి వాస్తవాలు తెలుసుకున్నా... సామాజిక మాధ్యమాల్లో తిట్టే తిట్లు చూసుకున్నా ఆయన గుండె ఆగిపోతుందని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి, బొత్సలను మారిస్తే పార్టీకి సమస్యలు
సీఎంను చీవాట్లు పెట్టడానికే దిల్లీ పిలుపు
వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు
ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి తన ఇంట్లో కూర్చొని సొంత పత్రిక చదవడం మానేసి మారు వేషంలో ప్రజల్లో తిరిగినా.. ఇంటెలిజెన్స్ నుంచి వాస్తవాలు తెలుసుకున్నా... సామాజిక మాధ్యమాల్లో తిట్టే తిట్లు చూసుకున్నా ఆయన గుండె ఆగిపోతుందని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కోతలంటే ఊరుకునేదే లేదన్న అధికారి దిల్లీకి మారిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందని... రాష్ట్రంలో చేతకాని, దద్దమ్మ, అసమర్థ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తమను చూసి ప్రతిపక్షాలు, పత్రికలు ఏడుస్తున్నాయని ముఖ్యమంత్రి అంటున్నారని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇస్తున్నందుకా.. మరెందుకు వాళ్లు ఏడుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థే దరిద్రమంటే... వాళ్లకు సేవారత్న, సేవావజ్ర అంటూ రూ.కోట్లతో అవార్డులు, రివార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పింఛన్ల డబ్బు తీసుకొని ప్రియరాలితో వాలంటీరు వెళ్లిపోయాడనే వార్తలు వస్తున్నాయన్నారు. చిన్న పిల్లలు ఏడిస్తే బలమనే నానుడి ఒకటి ఉందని.. దానికోసం జగన్మోహన్రెడ్డి కరెంటు కోతలు పెట్టి పిల్లలను ఏడిపిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొంటున్నారని... దానికి జగనన్న బాలదీవెన అని పేరు పెట్టాలని ఆయన సూచించారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే విద్యుత్ సమస్యలు వచ్చాయని.. దిల్లీ వచ్చినప్పుడు బొగ్గుశాఖ మంత్రిని కలిశారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల తప్పులు.. కార్పొరేషన్ల పేరుతో దొంగ రుణాలు తీసుకుంటున్న తీరుపై తాను ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థికమంత్రికి లేఖలు రాసి కాగ్ నివేదికలు జతచేసి పంపడంతో ముఖ్యమంత్రిని ప్రధాని దిల్లీ పిలిపించారని ఆయన తెలిపారు. లేకుంటే అప్పుల కోసం ముఖ్యమంత్రి చెప్పే సోది కోసం నెల రోజుల్లోనే ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వరన్నారు. దిల్లీకి పిలిచి ముఖ్యమంత్రికి చీవాట్లు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి పదే పదే ప్రతిపక్ష నేతలను తిట్టి వారిద్దరినీ దగ్గర చేస్తున్నారని తమ పార్టీ వాళ్లు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్తో మనకు గొడవ ఎందుకని ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. ఏ కులం వారిని ఆ కులం వారితో తిట్టించాలనే విచిత్రమైన భావన ముఖ్యమంత్రికి ఉందని.. అందులో భాగంగా పేర్ని నానితో పవన్ కల్యాణ్ని తిట్టిస్తారని తెలిపారు. త్రీ ఇడియట్స్ సినిమాలో టార్చ్లైట్తో ఆమిర్ఖాన్ ఆపరేషన్ చేశారని.. అలాగే మన దగ్గర ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా లేక కొవ్వొత్తులు, టార్చ్లైట్తో ప్రసవాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో ఆక్వా పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటోందన్నారు. వైద్యులు వేరే ఆసుపత్రుల్లో పని చేయకూడదనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ వ్యాపారాలు చేయకూడదని.. మారుపేర్లతో మీరు వ్యాపారాలు చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
వెంట్రుకలు కాదు.. మనల్ని పీకేస్తారు
తన వెంట్రుక కూడా పీకలేరని ముఖ్యమంత్రి అంటున్నారని, ఆయన వెంట్రుకలతో ఎవరికి ఏం పని అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజలు ఆగ్రహిస్తే మనల్ని పీకేస్తారని తెలిపారు. వెంట్రుకలు పరిరక్షించుకోవాలంటే ముఖ్యమంత్రి తన బాధ్యతలను తాత్కాలికంగా పెద్దిరెడ్డికి అప్పగించాలని సూచించారు. మంత్రులుగా పెద్దిరెడ్డి, కొడాలి, బొత్సలను మంత్రివర్గం నుంచి తొలగించినా మళ్లీ తీసుకుంటారని.. వారిని తొలగిస్తే పార్టీకి సమస్యలు ఎదురవుతాయన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ, బీసీలకు పదవులు అంటూనే ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన రవిచంద్రారెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని ఆయన విమర్శించారు. తిరుపతి జిల్లాలో అన్ని పదవుల్లో ముఖ్యమంత్రి సామాజికవర్గం వారే ఉన్నారంటూ వారి పేర్లు చదివి వినిపించారు. సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా ఇవ్వాలని ఆయన జగన్మోహన్రెడ్డికి సూచించారు.
రఘురామ అరెస్టు కేసులో కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు.. తదనంతర పరిణామాలపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తన తండ్రి రఘురామకృష్ణరాజు అరెస్టు.. కస్టడీలో ఆయనకు గాయాలైన తీరుపై సీబీఐ లేదా మరో స్వతంత్ర విచారణ సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆయన కుమారుడు భరత్ గతేడాది మే నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది మే 21, 25వ తేదీల్లో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. నాటి నుంచి కేసు విచారణకు రాకపోవడంతో ఈ నెల 1న పిటిషనర్ తరఫు న్యాయవాది బైరపునేని సుయోధన్ కేసు విషయాన్ని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ పిటిషన్ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జె.కె.మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేసుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ, కేంద్రం తరపు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక