ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
జగనన్నా ఇదేనా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం?
నాకేదైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం
ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ కన్నీటి వేదన
ఈనాడు డిజిటల్, ఒంగోలు: ‘ ప్రశ్నించానని పాలు రానీయకుండా చేశారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి నీళ్లు లేకుండా చేశారు. జగనన్నా ఇదేనా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం. ఇలా ఏ ప్రభుత్వంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా జరుగుతుందా. నాకేదైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం...’. అంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత అనే మహిళ కన్నీటి పర్యంతమైన వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది. ఆ వీడియోలో కవిత మాట్లాడుతూ... ‘నెల రోజుల క్రితం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అల్లూరు వచ్చినప్పుడు ఆయనను ప్రశ్నించాను. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఆయన అనుచరులు ఇంటి గేటుకు తాళం వేశారు. రైతు సమస్యలపై ప్రశ్నించినందుకు ఇలా బంధిస్తే ఎలా బతికేది? నాయకులు, పోలీసులు ఆయనకు వంతపాడుతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఆడపిల్లకు భద్రత లేకుంటే ఎక్కడ బతకాలో మీరే చెప్పండి జగనన్నా? నాకేమైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వంద శాతం బాధ్యుడు. ఎన్ని రోజులైనా ఇక్కడే భూస్థాపితం అయిపోతాను...’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు
- నారా లోకేశ్ విమర్శ
ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం సీఎం జగన్ను ఊరికే వదలదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్లో విమర్శించారు. ‘‘వైకాపా నాయకుల పైశాచికత్వానికి రాష్ట్రంలో మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొత్తపట్నం మండలం ఆలూరులో జరిగిన గడపగడపకులో సమస్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించిన కవిత అనే మహిళ ఇంటికి వైకాపా మూకలు తాళాలు వేసి, వేధించడం దారుణం. కనీసం నీళ్లు, పాలు తెచ్చుకునే వీలు లేదంటూ నిర్బంధించడమే... వైకాపా పాలనలో మహిళలకు దక్కిన గౌరవమా? కవితను వేధిస్తున్న బాలినేని అనుచర గణం, వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి...’’ అని డిమాండ్ చేస్తూ లోకేశ్ ఆ వీడియోను పోస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
-
India News
Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
-
Sports News
CWG 2022: మేం రజతం గెలవలేదు.. స్వర్ణం కోల్పోయాం: శ్రీజేశ్
-
Politics News
Rajagopalreddy: మాజీ ఎంపీలతో కలిసి బండి సంజయ్తో రాజగోపాల్ రెడ్డి భేటీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Latestnews News
Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్కి ఇంటర్నెట్ షేక్
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!