ఆధిపత్య పోరుతో రచ్చరచ్చ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సెజ్లో 180 వరకు దేశ, విదేశాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు
60:40 వాటాలు.. అయినా తప్పని తలనొప్పులు
సెజ్లో పనులపై అధికార పార్టీ నేతల పట్టుకు ఎత్తులు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సెజ్లో 180 వరకు దేశ, విదేశాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు ఈ సెజ్లో ఏ పని జరగాలన్నా స్థానిక ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు) అనుమతి తప్పనిసరి. గ్రావెల్, ఇసుక, ఇతర మెటీరియల్ను స్థానిక ప్రజాప్రతినిధి ద్వారానే సమకూర్చుకునేవారు. సెజ్లోని చిన్నచిన్న కాంట్రాక్టులను ఎమ్మెల్యే వర్గీయులకు అప్పగించేవారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ నాయకుడు జిల్లా మంత్రిని సెజ్ సెటిల్మెంట్ వ్యవహారాల్లోకి దింపాడు. నేరుగా కంపెనీ ప్రతినిధులతోనే మాట్లాడించి ఇకపై పనులేవైనా తాము సూచించిన వారికి కూడా అప్పగించాలని హుకుం జారీ చేయించాడు. దీంతో ఇప్పటివరకు గుట్టుగా సాగిన కాంట్రాక్టు పనుల వ్యవహారం నేతల మధ్య ఆధిపత్య పోరుతో రచ్చరచ్చవుతోంది. సెజ్లో పనులు చేసే వారు రెండు వర్గాలుగా విడిపోయి తగాదాలు పడుతున్నారు. వీరి పంచాయితీలను తీర్చలేక కంపెనీ ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు.
రోజూ వాదులాటలే..
ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమ నుంచి ఆఖరిగా స్లాగ్ వెలువడుతుంది. దీన్ని అమ్ముకునే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు సూచించిన పార్టీ కార్యకర్తలకు కంపెనీల ప్రతినిధులు అప్పగించారు. దీని నుంచి ప్రతినెలా రూ.4లక్షల వరకు ఆదాయం వస్తుండడంతో ఈ పనులపై మరో నాయకుడి కన్నుపడింది. మంత్రిని రంగంలోకి దించి తమ వారికీ స్లాగ్ రవాణా అప్పగించాలని, లేకుంటే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరికలు పంపించాడు. వారు చెప్పిన వారికీ పనులు కేటాయించారు. ఈ ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య గత కొద్ది రోజులుగా నలిగిపోతున్న కంపెనీ ప్రతినిధులు మధ్యేమార్గంగా స్థానిక ఎమ్మెల్యే వర్గానికి 60శాతం, సదరు మంత్రి సూచించిన వ్యక్తులకు 40 శాతం స్లాగ్ రవాణా బాధ్యతలను అప్పగించి సమస్య పెద్దది కాకుండా జాగ్రత్తపడ్డారు. అయినా రోజూ ఈ రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాదులాటలు జరుగుతూనే ఉన్నాయి. ఎలమంచిలి నియోజకవర్గంలో మూడు సార్లు గెలుపొందిన రమణమూర్తిరాజు (కన్నబాబు) పేరు చెబితే భయపడే సామాన్య కార్యకర్తలు నేడు ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీని వెనుక సదరు మంత్రి అండతో పాటు తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నాయకుల హస్తం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
నలిగిపోతున్న ఇటుకల తయారీదారులు
ఫెర్రో ఎల్లాయిస్ నుంచి వచ్చే స్లాగ్పై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో 210 వరకు ఇటుకల తయారీ యూనిట్లు నడుస్తున్నాయి. గతంలో ఈ స్లాగ్ను ఇటుకల తయారీకి ఉచితంగానే ఇచ్చేవారు. తర్వాత సిమెంట్ కంపెనీల్లోనూ వాడడం మొదలుపెట్టాక ఉచితానికి మంగళం పాడేశారు. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో దీనిపై ప్రజాప్రతినిధుల కన్నుపడింది. వారే కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకు స్లాగ్ను తీసుకుపోయి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ధరలను మూడు నెలలకు ఒకసారి పెంచుతూ దీనిపై ఆధారపడేవారి నడ్డి విరుస్తున్నారు. గతంలో ఉచితంగా ఇచ్చేది ఇప్పుడు డబ్బులిచ్చినా దొరక్కపోవడంతో పలువురు ఇటుకల తయారీదారులు వైకాపా నాయకుల నిలువు దోపిడీని నిరసిస్తూ కంపెనీ ముందు ఆందోళనకు దిగుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో తేటతెల్లమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు