‘జల్జీవన్ మిషన్’ అమలులో ఏపీకి 13వ ర్యాంకు
జల్జీవన్ మిషన్ పథకం అమలు (ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్)లో ఆంధ్రప్రదేశ్కు 13వ ర్యాంకు దక్కింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడి విజ్ఞాన్భవన్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ల ఆధ్వర్యంలో ఈ పథకం అమలుకు సంబంధించిన 2022 సంవత్సరం నివేదికను విడుదల చేశారు.
గత ఏడాది కంటే మూడు ర్యాంకులు పైకి..
ఈనాడు, దిల్లీ: జల్జీవన్ మిషన్ పథకం అమలు (ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్)లో ఆంధ్రప్రదేశ్కు 13వ ర్యాంకు దక్కింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఇక్కడి విజ్ఞాన్భవన్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ల ఆధ్వర్యంలో ఈ పథకం అమలుకు సంబంధించిన 2022 సంవత్సరం నివేదికను విడుదల చేశారు. 2020-21లో ఓవర్ ఆల్ పనితీరులో 50% మార్కులు సాధించిన ఆంధ్రప్రదేశ్.. 2022లో దాన్ని 68%కి పెంచుకొని మూడు ర్యాంకులు ఎగబాకింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 374 గ్రామాల్లో 8,827 ఇళ్లు, 849 ప్రభుత్వ సంస్థల నుంచి నమూనాలు సేకరించారు. ఇందులో 14% ఎస్సీ, 6% ఎస్టీ, 32% ఓబీసీ, 48% జనరల్ కుటుంబాలున్నాయి. 57% పురుషులు, 43% మహిళలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్ 25 మధ్యకాలంలో 10 బృందాలు 63 రోజులపాటు శ్రమించి ఈ నమూనాలను సేకరించాయి. దేశవ్యాప్తంగా 3,01,389 కుటుంబాల నుంచి నమూనాలు సేకరించగా అందులో 14% కుటుంబాలకు పనిచేసే కుళాయి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కుటుంబాల సంఖ్య 2% ఉంది.
* రాష్ట్రంలో సర్వే చేసిన ఇళ్లలో 92%కి రోజూ తలసరి 50 లీటర్లకుపైన, 3%కి 40 లీటర్లపైన, 5%కి 40లీటర్లలోపు నీరు అందుతోంది.
* పనిచేసే కుళాయిలున్న ఇళ్లు గత ఏడాది 91% ఉండగా, ఈసారి అది 92%కి చేరింది.
* 72% గ్రామాల్లోనే ఓవర్హెడ్ట్యాంక్/సంపులాంటి నీటినిల్వ ఏర్పాట్లు ఉన్నాయి.
* 79% ఇళ్లకు క్రమం తప్పకుండా, 17% ఇళ్లకు పాక్షికంగా క్రమంగా, 4% ఇళ్లకు క్రమం లేకుండా నీళ్లు అందుతున్నాయి.
* క్రమం తప్పకుండా నీరు అందే కుటుంబాల సంఖ్య గత ఏడాదికాలంలో 91% నుంచి 79%కి పడిపోయింది. ఈ విషయంలో ఏపీ ఏడాదిలో 8 స్థానాలు కోల్పోయింది.
* రాష్ట్రంలో 87% ఇళ్లకు రోజుకోసారి, 11% ఇళ్లకు రోజుకు రెండుసార్లు, 2% ఇళ్లకు రోజుకు మూడుసార్లు నీటి సరఫరా జరుగుతోంది.74% ఇళ్లకు వారంలో ఏడు రోజులూ, 8%ఇళ్లకు 5 నుంచి 6 రోజులు, 16% ఇళ్లకు 3 నుంచి 4 రోజులు, 2% ఇళ్లకు 1 నుంచి 2 రోజులు నీరు అందుతోంది.
* 90% ఇళ్లకు సరఫరా అయ్యే నీరు తాగునీటి యోగ్యంగా ఉండగా, 10% తాగు నీటి యోగ్యంగా లేదు.
* రాష్ట్రంలో 33% కుటుంబాలు గత ఏడాదికాలంలో తమ కుళాయి నీటిని పరీక్షించారు.
* రాష్ట్రంలో 75% కుటుంబాలు కుళాయి నీటినే ప్రధానంగా వాడుతున్నాయి. 24% కుటుంబాలు ఇతర మెరుగైన మార్గాల నుంచి తీసుకుంటున్నాయి. 1% మాత్రం ఇతర మార్గాల నుంచి వాడుకుంటున్నాయి.
* 79% కుటుంబాలు తాగడానికి ముందు నీటిని శుద్ధి చేసుకుంటున్నాయి.
* రాష్ట్రంలో 10% కుటుంబాలు నీటి సర్వీస్ ఛార్జీలు చెల్లిస్తున్నాయి.
* 82% కుటుంబాలు కుళాయి నీటిని నిల్వ చేసుకుంటున్నాయి. 18% కుటుంబాలకు అలాంటి సౌకర్యం లేదు.
* కుళాయి నీరు తీసుకోవడానికి 46% కుటుంబాలు బూస్టర్ పంపులు వాడుతున్నాయి. ఈ విషయంలో ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉంది.
* 30% కుటుంబాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు చెప్పాయి. అయితే దాన్ని ఏదో ఒక విధానంలో అధిగమిస్తున్నట్లు పేర్కొన్నాయి.
* 35% గ్రామాలు తమ వద్ద భూగర్భజల వనరులున్నట్లు చెప్పాయి. అయితే 7% గ్రామాల్లోనే భూగర్భ జలవనరుల సంరక్షణ నిర్మాణాలున్నాయి.
* 39% గ్రామాల్లోనే ఫీల్డ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించే నైపుణ్యం ఉన్న వ్యక్తులు 33% గ్రామాల్లోనే ఉన్నారు.
* రాష్ట్రంలో 9% గ్రామాల్లో నీటి నమూనాలను ఏటా మూడుకు మించి, 12% గ్రామాల్లో 1-2వరకు పరీక్షలు చేయిస్తున్నారు. 79% గ్రామాల్లో ఏటా ఒక్క పరీక్ష కూడా చేయించలేదు.
* రాష్ట్రంలో 21% గ్రామాల్లోనే క్లోరినేషన్ యంత్రాంగం ఉంది.
* 16% గ్రామాల్లో ఇళ్లనుంచి నీటి సర్వీసు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
* 32% గ్రామాల్లో మాత్రమే ప్రభుత్వ నీటి పథకాల నిర్వహణకు తగ్గ నైపుణ్య మానవ వనరులున్నాయి. 5% గ్రామాల్లో నిర్వహణ, యాజమాన్య సవాళ్లు ఎదురవుతున్నాయి.
* కుళాయినీరు ఇవ్వడంవల్ల 48రోజుల వార్షిక పనిదినాలు పెరిగినట్లు తేలింది. నీటి కారణంగా వచ్చే వ్యాధులు పూర్తిగా తగ్గాయి.
* ఇంటికి కుళాయినీటి సేకరణకోసం వెచ్చించే సమయం తగ్గినట్లు 85%కుటుంబాలు పేర్కొన్నాయి.
* ప్రాథమికోన్నత పాఠశాలల్లో దీనివల్ల బాలికల హాజరు 16% మెరుగుపడినట్లు తేలింది. 45% కుటుంబాలు తమ ఆదాయం వృద్ధిచెందినట్లు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!