తిరుమలలో దర్శనానికి 30 గంటలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి గురువారం భక్తులు భారీగా తరలివచ్చారు.  పెరటాసిమాసం మూడో శనివారంతోపాటు వరుస సెలవులు రావడంతో తమిళనాడునుంచి భక్తుల రద్దీ పెరిగింది.

Published : 07 Oct 2022 03:18 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి గురువారం భక్తులు భారీగా తరలివచ్చారు.  పెరటాసిమాసం మూడో శనివారంతోపాటు వరుస సెలవులు రావడంతో తమిళనాడునుంచి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం దాటి క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. అనూహ్యంగా రద్దీ పెరిగి క్యూలైన్‌లోని భక్తులు రింగ్‌రోడ్డులోని శిలాతోరణం వరకు వేచి ఉండడంతో ఆ ప్రాంతాన్ని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, పరిశీలించారు. బుధవారం శ్రీవారిని 63,579 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు లభించగా 34,524 మంది తలనీలాలు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని