నటశేఖరుడికి కన్నీటి వీడ్కోలు
తెలుగు చలనచిత్ర సూపర్స్టార్.. నటశేఖర కృష్ణకు కుటుంబసభ్యులు.. ఆప్తులు.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు.
నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై, ఏపీ సీఎం జగన్
పద్మాలయ స్టూడియోకు వేల మంది అభిమానులు
ప్రభుత్వ లాంఛనాల మధ్య సూపర్స్టార్ కృష్ణ అంత్యక్రియలు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, రాయదుర్గం: తెలుగు చలనచిత్ర సూపర్స్టార్.. నటశేఖర కృష్ణకు కుటుంబసభ్యులు.. ఆప్తులు.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కళారంగానికి చిరస్మరణీయ సేవలందించిన కృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించి ఘన నివాళి అర్పించింది. అంతకుముందు ఉదయం 7 గంటలకు కృష్ణ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం నానక్రాంగూడ నుంచి జూబ్లీహిల్స్లోని పద్మాలయ స్టూడియోకు తరలించారు. ఉదయం నుంచే వేలాది అభిమానులు.. ప్రముఖులు ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు అనుకున్న అంతిమయాత్ర అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరగడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైంది. మహాప్రస్థానంలోని మోక్షస్థల్ కలప దహన వాటికలో హిందూ సంప్రదాయ పద్ధతిలో కృష్ణ అంత్యక్రియలను ఆయన కుమారుడు మహేశ్బాబు నిర్వహించారు. అంతకుముందు పోలీసులు కృష్ణ భౌతికకాయానికి గౌరవ వందనం చేసి నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మహా ప్రస్థానం వెలుపల ఆయన అభిమానులు కృష్ణ అమర్ రహే, జోహార్ కృష్ణ అంటూ నినాదాలు చేశారు. అంత్యక్రియల అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులు, ప్రముఖులు వెళ్లిపోయాక పోలీసులు అభిమానులను మహాప్రస్థానంలోకి అనుమతించారు. వారు చితిని సందర్శించి కంటతడి పెట్టారు.
ప్రముఖుల నివాళులు
పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించి.. మహేశ్బాబును ఓదార్చారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ పర్యాటక మంత్రి రోజా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వసుంధర, నారా బ్రాహ్మణి, మోహన్బాబు, అల్లు అరవింద్, నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, అశ్వనీదత్, మలినేని గోపీచంద్, సి.కళ్యాణ్, మెహర్ రమేష్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కీరవాణి, కొరటాల శివ, బి.గోపాల్, జయప్రద, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు, మణిశర్మ, శేఖర్ కమ్ముల, కె.ఎస్.రామారావు తదితరులు కూడా నివాళులు అర్పించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఏపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, గల్లా అరుణ, ప్రజా గాయకుడు గద్దర్, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ సుజనాచౌదరి తదితరులు మహేశ్బాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పద్మాలయ స్టూడియోలో కృష్ణ అంత్యక్రియల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యవేక్షించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య కృష్ణ భౌతిక కాయాన్ని ప్రత్యేక పూల రథంలో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానానికి తరలించడం నుంచి అంతిమ సంస్కారాల ప్రక్రియ వరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి చూసుకున్నారు.
బాలకృష్ణను పలకరించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమరావతి నుంచి హైదరాబాద్కు వచ్చి.. పద్మాలయ స్టూడియోలో కృష్ణకు పుష్పాంజలి ఘటించారు. మహేశ్బాబును ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కృష్ణ అల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతి, మంజుల, సంజయ్ స్వరూప్, సుధీర్బాబు, ప్రియదర్శిని, నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితారలను ఆయన పేరుపేరునా పలకరించారు. అక్కడే ఉన్న నందమూరి బాలకృష్ణను కూడా జగన్ పలకరించారు. ఇద్దరూ పరస్పరం అభివాదం చేసుకున్నారు.
సాహసానికి మారుపేరు ఆయనే: బాలకృష్ణ
సాహసానికి మారుపేరు సూపర్స్టార్ కృష్ణ. డ్యాషింగ్, డేరింగ్, డైనమిక్ హీరో కృష్ణ మన మధ్య లేరన్నది నమ్మలేని నిజం. ఆయన సినిమాలు సాహసాలకు, ప్రయోగాలకు మారుపేరుగా నిలిచాయి. కొత్త నిర్మాతలు, దర్శకులను పరిచయం చేసింది నాన్న ఎన్టీఆర్, కృష్ణ. ఆయన అందగాడు అంటూ నాన్న పదే పదే గుర్తు చేసేవారు. కళామతల్లికి ఆయన చేసిన సేవలు, తీసిన సినిమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
అందరూ ఇష్టపడే ఏకైక హీరో: రోజా
తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ ఇష్టపడే ఒకే ఒక్క హీరో కృష్ణ. ఆయన లేరంటే జీర్ణించుకోలేకపోతున్నాం. పరిశ్రమకు పెద్ద దిక్కయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, కృష్ణలను భగవంతుడు తనకు కావాలని తీసుకుపోయాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు పెద్ద అభిమానిని. ఆయనతో కథానాయికగా పనిచేయడం నా అదృష్ణం. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్నివ్వాలి.
నాటకరంగం నుంచి చివరి సినిమా వరకు..
కృష్ణకు ఆయన వ్యక్తిగత మేకప్మేన్ మాధవరావు నివాళులు అర్పించారు. నాటక రంగంలో ఉన్నప్పటి నుంచే ఆయనకు మేకప్ వేసేవాడినని, ‘సాక్షి’ సినిమా నుంచి ఆయన చివరి సినిమా వరకు కలిసి పనిచేశానని, కృష్ణ జీవితం ఒక పుస్తకంలాంటిదని, ఆయనను చూసి యువ కథానాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గాంధీభవన్లో నేతల నివాళి
మాజీ ఎంపీ, సినీ నటుడు సూపర్స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు బుధవారం గాంధీభవన్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, నాయకులు టి.కుమార్రావు, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
అభిమానం కిక్కిరిసింది
కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మాలయ స్టూడియో వద్దకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ పర్యవేక్షించినా.. బ్యారికేడ్లను తోసుకుంటూ వచ్చేశారు. వారిని అడ్డుకోవడం ఒక దశలో పోలీసుల తరం కాలేదు. పలుమార్లు లోపలికి దూసుకొచ్చారు. దీంతో వారు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఒకరిద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వేలాది మంది యువకులతో పాటు 50 ఏళ్లకు పైబడిన చాలా మంది అభిమానులు కృష్ణ భౌతికకాయాన్ని కడసారి చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. వేలాది మందితో జూబ్లీహిల్స్ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వచ్చిన అభిమానులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు