పెన్నాను పంచేసుకున్నారు
ఎవరైనా ఇంటికి ప్రహరీ కట్టుకుంటారు.. పొలానికి కంచె వేసుకుంటారు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు ఏకంగా పెన్నా నదిని వాటాలు వేసి పంచేసుకున్నారు.
ఇసుక కోసం వాటాలేసుకున్న వైకాపా నాయకులు
నదికి వెళ్లే దారిలో అడ్డుగా గేట్ల ఏర్పాటు
తాడిపత్రిలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా
స్థానిక ప్రజాప్రతినిధికి కప్పం కట్టి దందా!
ఈనాడు డిజిటల్- అనంతపురం, న్యూస్టుడే- పెద్దపప్పూరు: ఎవరైనా ఇంటికి ప్రహరీ కట్టుకుంటారు.. పొలానికి కంచె వేసుకుంటారు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు ఏకంగా పెన్నా నదిని వాటాలు వేసి పంచేసుకున్నారు. అక్కడికి వెళ్లే దారులను మూసేసి గేట్లు పెట్టుకుని, తాళాలేసుకున్నారు. హద్దులు ఏర్పాటు చేసుకుని ‘పద్ధతిగా’ ఇసుక దోచుకుంటున్నారు. నాయకులకు కప్పం కట్టిన ఇసుక ట్రాక్టర్లనే నదిలోకి అనుమతిస్తున్నారు. ఒకరి పరిధిలోకి మరొకరు రావడానికి వీలులేదు. ఈ తతంగం ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందనుకుంటే పొరపాటే. తాడిపత్రి పట్టణానికి ఆనుకుని బహిరంగంగానే సాగుతున్న ఈ అక్రమ రవాణాను పోలీసులుగానీ, ఇసుక అక్రమాలను అరికట్టాల్సిన సెబ్ అధికారులుగానీ కన్నెత్తి చూడటం లేదు.
తాడిపత్రి సమీపంలోని పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా వెనుక మొత్తం 10 మంది వైకాపా నాయకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నదిలో నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను 10 భాగాలుగా విభజించి పంచుకున్నారు. నదిలోకి వెళ్లడానికి గ్రానైట్ వ్యర్థాలతో ప్రత్యేక దారులు వేసుకున్నారు. చెక్పోస్టు తరహాలో ఇనుప గేట్లు పెట్టి, తాళాలు వేస్తున్నారు. తమ పేర్లతోనే రీచులు ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక నాణ్యతను బట్టి ఒక్కో రీచులో ఒక్కో ధర నిర్ణయించారు. కొన్ని నెలలుగా నిత్యం వందల ట్రాక్టర్లలో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. అలా తవ్వగా ఏర్పడిన గుంతలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఒక్కో గుంత 20 అడుగుల లోతున, కనీసం 100 అడుగుల వెడల్పున ఉన్నాయంటే అక్రమ రవాణా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఉదయం 6 నుంచి 11 వరకు..
కొన్ని నెలలుగా రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తారు. ఇసుక నింపడానికి బయట కూలీలనే రప్పించుకుంటున్నారు. కూలీలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతోపాటు రూ.వెయ్యి చెల్లిస్తారు. 11 గంటల తర్వాత ఎవరి గేట్లకు వారు తాళాలు వేసుకుని వెళ్లిపోతారు. ఇలా రోజుకు ఒక్కో ప్రాంతంలో 50 - 100 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. తాడిపత్రి పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు అయితే ట్రాక్టరుకు రూ.2 వేల నుంచి 4 వేల వరకు ధర నిర్ణయించారు. కొందరు నంద్యాల జిల్లాలోని అవుకు, బనగానపల్లికి ట్రాక్టరు ఇసుక రూ.10 వేల చొప్పున తరలిస్తున్నారు.
భూగర్భ జలాలపై ప్రభావం
ఆక్రమణలతో పెన్నా నది ఇప్పటికే చిక్కిపోయింది. విచ్చలవిడిగా ఇసుకను తరలించడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి నదీ స్వరూపం కోల్పోయింది. ఇది భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీకి పెన్నా నదిలోని బోర్ల ద్వారానే తాగునీరు సరఫరా చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాడిపత్రి పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నదిలో 20 అడుగుల లోతున తవ్వడంతో సమాచార వ్యవస్థకు సంబంధించిన కేబుళ్లు, తాగునీటి పైపులైన్లు ధ్వంసమవుతున్నాయి.
నెలకు రూ.3 లక్షల ముడుపు
ఈ దందాకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో ఇసుక తవ్వుకునే 10 మంది వైకాపా నాయకులు ఒక్కొక్కరూ నెలకు రూ.3 లక్షల కప్పం కడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రి గ్రామీణ పోలీసులకు అందరూ కలిపి నెలకు రూ.10 లక్షలు ముడుపులు సమర్పించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదులు వచ్చినప్పుడు కొన్ని ట్రాక్టర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించి, నిమిషాల్లోనే విడిచిపెట్టేస్తున్నారని.. ఆ డివిజన్లోని ఓ ఉన్నతాధికారి అండతోనే ఇసుక దందా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
కేసులు నమోదు చేస్తున్నాం
- రామ్మోహన్రావు, సెబ్ అదనపు ఎస్పీ
అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారనడం అవాస్తవం. తాడిపత్రి పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. తరచూ తనిఖీలు చేస్తుండటంతో అక్రమ రవాణా చాలావరకు తగ్గింది. ఇటీవలే కొన్ని ట్రాక్టర్లను పట్టుకుని రూ.2.50 లక్షల జరిమానా విధించాం. పెన్నా నదిలో గేట్లు పెట్టినట్లు మా దృష్టికి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!