అక్రమార్కుల బరితెగింపు!
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటలో అధికార పార్టీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.
సొంత లేఅవుట్ రోడ్డుకు 10 ఎకరాల ఆక్రమణ
అధికారులు పాతిన హెచ్చరిక బోర్డుల తొలగింపు
రైతులను బెదిరించి ఎసైన్డ్ భూముల కొనుగోళ్లు
విస్సన్నపేటలో వైకాపా నేతల ఇష్టారాజ్యం
ఈనాడు డిజిటల్, అనకాపల్లి -న్యూస్టుడే, కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం విస్సన్నపేటలో అధికార పార్టీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. తమ సొంత లేఅవుట్కు రోడ్డు విస్తరించుకునేందుకు రూ.కోట్ల విలువైన సుమారు పదెకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. వీటిపై ఏడాది క్రితమే స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు అక్రమాలను గుర్తించి ఇటీవల ఆయా భూముల్లో హెచ్చరిక బోర్డులను పాతారు. అయితే ఆక్రమణదారులు ఆ బోర్టులను పీకేశారు. వాటిపై రాయించిన ఆక్రమణల వివరాలనూ చెరిపేశారు. బోర్డులను ఆక్రమిత స్థలాల్లో కాకుండా వేరేచోట పాతిపెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు అటుగా కన్నెత్తి చూడటంలేదు.
తోటలను తొలగించి... కొండలను కరిగించి...
బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 195/2లో సుమారు 600 ఎకరాల భూములను ఏడాది కిందట అధికార పార్టీ పెద్దలు కొనుగోలు చేశారు. వాటిలో ఉన్న తోటలను తొలగించి, కొండలను కరిగించి ఒకే కమతంగా మార్చేశారు. ఈ భూముల లావాదేవీలన్నీ వైకాపాకు చెందిన గవర కార్పొరేషన్ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాద్ చూస్తున్నారు. ఈయన ఎంపీ విజయసాయిరెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అత్యంత సన్నిహితుడు. విశాఖలోని దసపల్లా భూముల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్న ఎష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్ గోపీనాథ్రెడ్డి ఇక్కడ 6.56 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇటీవలే మౌంట్ విల్లాస్ పేరిట ఒక బ్రోచర్ విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ లేఅవుట్లోకి వెళ్లే మార్గం కేవలం అడుగుల వెడల్పు మాత్రమే ఉండేది. ఈ దారిని చూపించి స్థలాల అమ్మకం కష్టమని వైకాపా పెద్దలు భావించారు. లేఅవుట్ నిర్మాణానికి ముందుగానే ఆ దారికి ఒకవైపు ప్రభుత్వ, ఎసైన్డ్ భూములను ఆక్రమించేశారు. మరోవైపు అల్లిమెట్ట కొండను చాలావరకు తొలిచేశారు. ఒకప్పుడు ఎడ్లబండి నడిచే దారిని నేడు వంద అడుగులకుపైగా విస్తరించారు. ఈ రోడ్డు నిర్మాణంలోనే... సర్వే నంబరు 624లోని గెడ్డపోరంబోకు స్థలంలో 83 సెంట్లు, సర్వే నంబరు 2లోని 4.87 ఎకరాలు, సర్వే నంబరు 108లోని 4.23 ఎకరాలు ఆక్రమించి చదును చేసేశారు. మొత్తంగా 9.93 ఎకరాలను ఆక్రమించి రోడ్డు వేశారు. ఈ ఆక్రమణలపై స్థానికుల ఒత్తిడితో అధికారులు హెచ్చరిక బోర్డులు పాతారు. బోర్డులుంటే తమ లేఅవుట్కు ఇబ్బందని ఆక్రమణదారులు వాటిని తొలగించేశారు.
ఎసైన్డ్ భూములపై కన్ను
నేతల లేఅవుట్ను ఆనుకుని ఎసైన్డ్ భూములున్నాయి. గతంలో దళితులు, మాజీ సైనికులకు ఇక్కడ భూములిచ్చారు. వారంతా జీడి తోటలు వేసుకున్నారు. ఈ భూములపై ఇప్పుడు నేతల కన్నుపడింది. ఇప్పటికే కొందరి భూములను తమ చేతుల్లోకి తీసుకుని, తోటలను తొలగించారు. మిగతా రైతులతో బేరసారాలు నడుపుతున్నారు. ఎసైన్డ్ భూములు కొనడం నేరమని తెలిసినా వైకాపా అండతో బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా సర్వే నంబరు 108లో ఓ మాజీ సైనికుడి భూమిని ఎలాంటి ఎన్వోసీ లేకుండానే దక్కించుకున్నట్లు సమాచారం. ఈ విషయమై తహసీల్దారు సుధాకర్ వద్ద ప్రస్తావించగా... బోర్డులు తొలగించిన విషయం తెలియదని, వెంటనే వాటిని పునరుద్ధరిస్తామన్నారు. మళ్లీ ఎవరైనా తొలగించడానికి ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టిస్తామని, ఎసైన్డ్ భూములు చేతులు మారినా చర్యలు తీసుకుంటామని తెలిపారు.విలువైన సుమారు పదెకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. వీటిపై ఏడాది క్రితమే స్థానికులు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!