ఆర్టీసీ బస్సులో ప్రసవం

భర్తను కలుసుకునేందుకు కోల్‌కతా నుంచి వచ్చిన నిండు గర్భిణికి బస్సులో ప్రసవం అయిన ఉదంతమిది... వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రి ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 24 Nov 2022 04:14 IST

కోల్‌కతా నుంచి పులివెందుల వస్తుండగా ఘటన
తల్లీబిడ్డ క్షేమం

పులివెందుల, న్యూస్‌టుడే: భర్తను కలుసుకునేందుకు కోల్‌కతా నుంచి వచ్చిన నిండు గర్భిణికి బస్సులో ప్రసవం అయిన ఉదంతమిది... వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రి ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతాకు చెందిన హజరత్‌, ముసీదా భార్యాభర్తలు. ముసీదా నిండు గర్భిణి. హజరత్‌ పులివెందుల వచ్చి గ్రానైట్‌ బండలు పరుస్తూ ఉపాధి పొందుతున్నారు. కోల్‌కతాలో ఉన్న ముసీదా... తన తల్లి రషీదా, చెల్లెలు జమీదాతో కలిసి హజరత్‌ దగ్గరకు బయలుదేరారు. తిరుపతి చేరుకున్నాక పులివెందుల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రయాణం మధ్యలో ముసీదాకు పురిటి నొప్పులొచ్చాయి. బస్సు పులివెందుల ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రి దగ్గరకు చేరుకోగానే ఆమె పండంటి ఆడ శిశువును ప్రసవించారు. ఆసుపత్రి గైనకాలజిస్టు లక్ష్మీప్రియ తన సిబ్బందితో వెళ్లి ప్రథమచికిత్స చేశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని