రాష్ట్రపతి రాకకు ముందు ఒరిగిన స్వాగత ద్వారం

రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజిల్లా పోరంకి ఎం.రిసార్ట్‌లో ఆదివారం పౌరసన్మానం ఏర్పాటు చేసింది.

Published : 05 Dec 2022 04:35 IST

రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజిల్లా పోరంకి ఎం.రిసార్ట్‌లో ఆదివారం పౌరసన్మానం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి కాన్వాయ్‌ రావడానికి 5 నిమిషాల ముందు రిసార్టు ఎదుట ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం ఒరిగి పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దానిని నిలబెట్టి పడిపోకుండా నిలువరించారు. రాష్ట్రపతి వచ్చి వెళ్లేంతవరకూ ఆ స్వాగత ద్వారం పడిపోకుండా పట్టుకునే ఉన్నారు. ఆమె వెళ్లిన అనంతరం ఊపిరిపీల్చుకున్నారు.   

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని