Summer: ఈసారి.. మండే కాలం?
వరుస ఎన్నికలతో దేశంలో పెరుగుతున్న రాజకీయ వేడికి ఈసారి వాతావరణం కూడా తోడయ్యేలా ఉంది.
2023లో ఎల్ నినో వస్తోందంటున్న శాస్త్రవేత్తలు
భారత్లో రుతుపవనాలపై ప్రభావం చూపేనా?
వరుస ఎన్నికలతో దేశంలో పెరుగుతున్న రాజకీయ వేడికి ఈసారి వాతావరణం కూడా తోడయ్యేలా ఉంది. 2023లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కారణం- ఎల్ నినో! గత రెండున్నరేళ్లుగా సాగుతున్న లా నినా పోయి... మళ్లీ ఎల్ నినో ఈఏడాది రాబోతుండటమే ఇందుకు కారణం.
వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలే ఈ ఎల్ నినో, లా నినా! ఇవి రెండూ స్పానిష్పేర్లు. భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా... చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. ఈ పరిణామాలను ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ సిస్టమ్ (ఇఎన్ఎస్ఓ) అంటుంటారు. ఈ ఇఎన్ఎస్ఓ పరిస్థితులు... ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలను, వర్షపాతాలను ప్రభావితం చేస్తాయి. ఎల్ నినో అయితే విపరీతమైన వేడి, తక్కువ వర్షపాతం నమోదవుతుంటుంది. లా నినాలో వర్షాలు విపరీతంగా ఉంటాయి. ఈ రెండు పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటిగా... ప్రతి నాలుగైదేళ్ల భ్రమణంలో సంభవిస్తుంటాయి. సాధారణంగా ఎల్ నినో ఎక్కువగా సంభవిస్తుంటుంది. అయితే అందుకు భిన్నంగా గత మూడేళ్లుగా లా నినా ప్రభావం ఎక్కువ కనిపించింది. లా నినా ఇంత సుదీర్ఘంగా కొనసాగటం ఈ వందేళ్లలో ఇదే తొలిసారి అంటున్నారు శాస్త్రవేత్తలు! ఇప్పటికే పెరుగుతున్న భూతాపం, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న సముద్ర ఉపరితలాన్ని ఈసారి ఎల్ నినో సంకేతాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్ధానికి దీని ప్రభావం ఉంటుందని అంచనా.
భారత్లో ఎలా?: ద్వితీయార్ధానికి ఎల్ నినో అంటే... భారత్లో నైరుతి రుతుపవనాలపై ప్రభావం పడొచ్చన్నది అంచనా. గతంలో ఎల్ నినో కాలంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 80శాతం ఎల్ నినో పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంకంటే తక్కువ నమోదై అనేక చోట్ల కరవు పరిస్థితులు తలెత్తాయి. 2009లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు, మధ్య, ఉత్తర భారత్ల్లో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరవు పరిస్థితులు తలెత్తాయి. అయితే భారతీయ వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఈసారి ఎల్ నినో ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమంటున్నారు. ‘కొన్ని పద్ధతుల ఆధారంగా ఈ ఏడాది ఎల్ నినో వస్తుందని అనుకుంటున్నారు. కానీ భారత్లో రుతుపవనాలపై దాని ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. ఇంత ముందుగా వేసే అంచనాలు గురి తప్పే అవకాశాలే ఎక్కువ. అయితే గతంలో ఎల్ నినో వచ్చిన సందర్భాల్లో చాలామటుకు భారత రుతుపవనాలపై ప్రభావం చూపింది. ఈసారి ఎలాంటి ప్రభావం ఉంటుందనేది మార్చినాటికి స్పష్టత రావొచ్చు’ అని భారత వాతావరణ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఎల్ నినో కారణంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా సంభవించొచ్చని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఎల్ నినో విషయంలో అన్ని రాష్ట్రాలూ దీర్ఘ, స్వల్పకాల ప్రణాళికలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు నొక్కిచెబుతున్నారు.
ఆ 1.5 దాటేస్తామా?
ప్రపంచ దేశాలన్నీ ప్రతిన పూనిన ‘1.5 డిగ్రీల సెల్సియస్ గీత’ కూడా ఈసారి దాటి పోతామేమోననే ఆందోళనా వ్యక్తమవుతోంది. పారిశ్రామిక విప్లవం నాటితో పోలిస్తే ఇప్పటికి భూతాపం ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది. కాలుష్యం, ప్రమాదకర ఉద్గారాలు ఇందుకు కారణం. ఈ మాత్రం దానికే అనేక పర్యావరణ దుష్ఫలితాలను ప్రపంచం చవిచూస్తోంది. ధ్రువాల వద్ద మంచు కరుగుతోంది, సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్కు చేరుకోకుండా, 1.5 దగ్గరే ఆపాలన్నది ప్రపంచ దేశాలన్నీ కలసి తీసుకున్న నిర్ణయం. ఆ దిశగా కర్బన ఉద్గారాలు తగ్గించాలని తీర్మానించాయి కూడా. కానీ ఆచరణలో అది నత్తనడకన సాగుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంజేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఈసారే 1.5 లక్ష్మణరేఖను దాటినా దాటొచ్చనే వాదన వినిపిస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక