AP Govt: ఇకపై మంత్రులకే సలహాదారులు
సలహాదారుల నియామకం విషయంలో విధాన రూపకల్పనకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పాలసీని మంత్రివర్గం ముందుంచి ఆమోదం పొందాక జీవో ఇస్తామని తెలిపింది.
ఇప్పటికే ఉన్నవారిని రీడిజిగ్నేట్ చేస్తాం
నియామకాలకు విధానాలు తెస్తున్నాం
మంత్రివర్గం ఆమోదించాక ఉత్తర్వులిస్తాం
సలహాదారులు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి..
హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్
ఈనాడు - అమరావతి
సలహాదారుల నియామకం విషయంలో విధాన రూపకల్పనకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పాలసీని మంత్రివర్గం ముందుంచి ఆమోదం పొందాక జీవో ఇస్తామని తెలిపింది. సలహాదారులు ప్రజా విధులు నిర్వర్తిస్తారని, వారు అవినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్ సర్వెంట్ (ప్రజా సేవకుడు) నిర్వచనం కిందికి వస్తారని తెలిపింది. ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తామని స్పష్టం చేసింది. మార్గదర్శకాల వివరాలను కోర్టు ముందుంచింది. సాధారణ పరిపాలనశాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు హైకోర్టులో తాజాగా ఈ మేరకు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. జ్వాలాపురపు శ్రీకాంత్ను దేవాదాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 630ని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణసేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్కే రాజశేఖరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్.చంద్రశేఖర్రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ విశ్రాంత ఉద్యోగి ఎస్.మునెయ్య హైకోర్టులో మరో పిల్ వేశారు. వీటి విచారణ సందర్భంగా సలహాదారుల నియామకంపై ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. శాఖలకు సలహాదారులేమిటంటూ నిలదీసింది. వారి నియామక నిబంధనలు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. వారి నియామకం సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలనశాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి తాజాగా అదనపు అఫిడవిట్ వేశారు.
అఫిడవిట్లోని వివరాలివి..
* ఆయా సబ్జెక్టులో నైపుణ్యం ఆధారంగా సంబంధిత మంత్రులకు సలహాదారులు/ప్రత్యేక సలహాదారులను నియమిస్తాం.
* సలహాదారులను నియమించుకోవాలని మంత్రులు భావిస్తే ముఖ్యమంత్రి ఆమోదం పొందాలి. సలహాదారుల పదవీ కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది. పనితీరు ఆధారంగా మరో రెండేళ్లు పొడిగించవచ్చు.
* సలహాదారుల నియామకం అవసరం.. తగిన వ్యక్తా? కాదా తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష ఉంటుంది.
* ప్రభుత్వ రహస్యాలను బహిర్గతం చేయబోమని ప్రతి సలహాదారు అఫిడవిట్పై సంతకం చేయాలి. ఎలాంటి వివరాలు గోప్యంగా ఉంచాలో అఫిడవిట్లో ఉంటాయి.
* విధానాల రూపకల్పనలో మంత్రులకు సలహాలివ్వడం వరకే సలహాదారుల పాత్ర పరిమితం. సివిల్ సర్వెంట్ల రోజువారీ కార్యకలాపాల్లో సలహాదారులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.
* 2022లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవో 36కు అనుగుణంగా జీతభత్యాల చెల్లింపు ఉంటుంది.
* సలహాదారుల నియామకం విషయంలో గతంలో మాదిరి కన్సల్టెంట్స్/కన్సల్టింగ్ ఏజెన్సీలను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
* ఇప్పటికే కొనసాగుతున్న సలహాదారులను సంబంధిత మంత్రులకు సలహాదారులుగా రీడిజిగ్నేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* ఇప్పటివరకు ఏ బాధ్యతలు నిర్దేశించని సలహాదారులకు నిర్దుష్ట పాత్ర, బాధ్యతలను రూపొందించే పనిలో ప్రభుత్వముంది.
* ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్నవారికి సైతం ఇవే నియమ నిబంధనలు వర్తిస్తాయి.
* ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని క్యాబినెట్ ముందుంచి ఆమోదం పొందే ప్రక్రియ కొనసాగుతోంది. పాలసీని నోటిఫై చేస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులిస్తుంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులివ్వాలి. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు వచ్చే వారంలో విచారించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి