హాజరు వేయగానే.. వెళ్లిపోయారు
ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు అధికారులు, నాయకులు అత్యుత్సాహంతో భారీగా జనసమీకరణ చేశారు.
సీఎం ప్రసంగిస్తుండగా వెనుదిరిగిన మహిళలు
ఈనాడు డిజిటల్, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు అధికారులు, నాయకులు అత్యుత్సాహంతో భారీగా జనసమీకరణ చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50- 100 బస్సుల్లో పొదుపు సంఘాల మహిళలను తీసుకొచ్చారు. సభకు రాకపోతే రుణాలు, పథకాల విషయంలో ఇబ్బందులు పడతారని వారిని అధికారులు హెచ్చరించారు. గ్రూపుల వివరాలు, సభ్యుల పేర్లున్న రిజిస్టర్లు తీసుకొచ్చి అందరూ వచ్చారా లేదా అని సభా ప్రాంగణం దగ్గర హాజరు వేశారు. సభా ప్రాంగణ సామర్థ్యం 10 వేలు ఉంటే దాదాపు 50 వేల మందిని తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు అన్ని కలిపి వెయ్యి వరకు పార్కింగ్ స్థలంలో దర్శనమిచ్చాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో మహిళలు ఉక్కిరిబిక్కిరయ్యారు. లోపలికి వెళ్లే వీలులేక మండుటెండలో నేలపై కూర్చున్నారు. హాజరు వేసేవరకూ ఓపిక పట్టి, ఆ వెంటనే తిరుగుప్రయాణమయ్యారు. దీంతో సీఎం సభా ప్రాంగణానికి రాక ముందే సగం మంది వెళ్లిపోయారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడూ జనాలు భారీగా బయటికి వచ్చేశారు. పోలీసులు అడ్డగించినా బారికేడ్లలో నుంచి దూరి వెళ్లిపోయారు. మొదట జనంతో కిక్కిరిసిన సభా ప్రాంగణం తర్వాత ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలను తరలించేందుకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పాఠశాలల బస్సులను కేటాయించారు. పాఠశాలలను తెరిచే ఉంచి విద్యార్థులు రాలేదన్నట్లు హాజరు పట్టికల్లో నమోదు చేశారు. బస్సు రాకుండా విద్యార్థులు బడికెలా వెళ్తారని తల్లిదండ్రులు వాపోయారు. ఏలూరు, పశ్చిమ, కృష్ణా జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను సభకు తీసుకురావడంతో ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నరసాపురం, నూజివీడు తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు సకాలంలో బస్సులు రాక ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనాలవారు ధరలు పెంచి వసూలు చేశారు. సీఎం పర్యటన ముగిసేవరకూ దెందులూరులో దుకాణాలను మూయించారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలకు శుక్రవారం నుంచే సెలవులు ప్రకటించారు.
నిర్బంధాలు.. అడ్డగింతలు
ఆశ్రం కళాశాల కూడలిలో పనిచేసే 70 మంది హమాలీలు సభకు వచ్చారు. వీరు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉండటంతో లోపలికి వెళ్లేందుకు వీల్లేదంటూ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం ఉన్నా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీని పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్