Vijayawada Metro: విజయవాడ మెట్రోకు ఉరి
అది రాజధాని అమరావతి కావొచ్చు... విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కావొచ్చు... రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే మరే ఇతర ప్రాజెక్టయినా కావొచ్చు... గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదిస్తే ఇక అంతే.. దానికి పాతరేసే వరకూ జగన్ ప్రభుత్వం నిద్రపోదు.
భూసేకరణ ప్రతిపాదన రద్దుచేసిన ప్రభుత్వం
ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ప్రాజెక్టు ఇక పూర్తిగా అటకెక్కినట్లే
ఈనాడు - అమరావతి
అది రాజధాని అమరావతి కావొచ్చు... విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కావొచ్చు... రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే మరే ఇతర ప్రాజెక్టయినా కావొచ్చు... గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదిస్తే ఇక అంతే.. దానికి పాతరేసే వరకూ జగన్ ప్రభుత్వం నిద్రపోదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఆపేయడం, మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతీయడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడమే అందుకు తాజా నిదర్శనం. ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం ఈ ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు.
దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి, ఎలా తొక్కిపెట్టాలన్నదానిపైనే మొదటి నుంచీ దృష్టిపెట్టింది. విభజన చట్టం ప్రకారం కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి హక్కుగా సాధించుకోవాల్సిన మెట్రోరైలు ప్రాజెక్టు ప్రతిపాదనలకు అంచెలంచెలుగా తూట్లు పొడుస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం... ఆ ప్రాజెక్టు నిర్మాణానికి విజయవాడ గ్రామీణ మండలంలోని ఎనికేపాడు గ్రామ పరిధిలో 3,272.55 చదరపు గజాల భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఇందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విస్తీర్ణం చూడటానికి చిన్నదిగానే కనిపించినా.. ఈ భూసేకరణ ఇక లేదని చెప్పడం ద్వారా, అసలు మెట్రోరైలు ప్రాజెక్టును చేపట్టకూడదన్న ప్రభుత్వ ఉద్దేశం బయటపడుతోంది. దీంతో విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించినట్టే!
గత ప్రభుత్వం 2017లో మెట్రో రైలు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిలో భాగంగా ఎనికేపాడు పరిధిలోని వివిధ సర్వే నంబర్లలోని 3,272.55 చదరపు గజాల్ని తీసుకోవాలని నిర్ణయించింది. వాటిలో కొంత గ్రామకంఠం భూమితో పాటు, వివిధ వ్యక్తులకు చెందిన ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఆ భూసేకరణ ప్రతిపాదన రద్దుచేస్తూ కలెక్టర్ ఇప్పుడు ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన భూసేకరణ ముసాయిదా నోటిఫికేషన్ గడువు 2019లోనే ముగిసిందని, భవిష్యత్తులో రాష్ట్రప్రభుత్వం మెట్రోరైలు ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే... అప్పుడు మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీచేస్తామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూసేకరణ నోటిఫికేషన్ పరిధిలో ఉండటంతో ఆయా స్థలాల యజమానులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే రద్దు చేశామని తెలిపారు.
నోటిఫికేషన్ రద్దు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ మెట్రోరైలు కార్పొరేషన్ కూడా స్పష్టం చేసినట్టు తెలిపారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం సానుకూల నిర్ణయమేదీ తీసుకునే ఆలోచనలో లేదని దీన్నిబట్టే అర్థమవుతుంది. ఎంతో అధ్యయనం, కసరత్తు చేసి విజయవాడ మెట్రోరైలు మార్గాన్ని గత ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే భూసేకరణకు ప్రతిపాదించింది. ఇప్పుడు ఆ భూమిని భూసేకరణ నుంచి తప్పిస్తే... వాటి యజమానులు అక్కడ భవనాలు నిర్మించుకోవచ్చు. భవిష్యత్తులో మరో ప్రభుత్వం వచ్చి మెట్రోరైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అప్పుడు అక్కడ భూసేకరణ చేయగలదా? ఒకసారి భవనాలు నిర్మించుకున్నాక భూసేకరణ చాలా సంక్లిష్టం అవుతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు?
విజయవాడపై ఎందుకంత కక్ష?
విజయవాడలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది వైకాపా అధికారంలోకి వచ్చాకేనని కొన్ని నెలల క్రితం అసెంబ్లీలో జగన్ అలవోకగా అబద్ధాలు చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో విజయవాడలో చేసిన అభివృద్ధి ఏంటి? మెట్రో ప్రాజెక్టుకు తూట్లు పొడవడమా? ఇప్పటికే విజయవాడలో భాగంగా ఉన్న గొల్లపూడి, పెనమలూరు, గన్నవరం లాంటి ప్రాంతాల్ని కలిపి గ్రేటర్ విజయవాడగా చేయాల్సింది పోయి... నగరంలో భాగంగా ఉన్న ప్రాంతాల్ని ప్రత్యేక మున్సిపాలిటీలుగా చేయడమా? విజయవాడ నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న ప్రాంతాల్ని, విజయవాడకు అత్యంత సమీపంలోని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్ని కలిపితే... జనాభా 25 లక్షలకు పైనే ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాలకు మెట్రో రైలు ప్రాజెక్టు అత్యవసరం. విజయవాడ బెంజి సర్కిల్లో పై వంతెనలు కట్టినా... ఇంకా ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. రాబోయేరోజుల్లో నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరగనున్నందున... ప్రజలు సౌకర్యవంతంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రో రైలు లాంటి మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ తప్పనిసరిగా కావాలి. మెట్రో రైలును కేవలం ప్రజారవాణా సదుపాయంగా మాత్రమే చూడకూడదు.
మెట్రోరైలు లాంటి భారీ ప్రాజెక్టు వస్తే... నిర్మాణ వ్యయంలో సుమారు 38-40% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వెళుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి లభిస్తుంది. ఆ పరిసరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. మెట్రో రైలులో ప్రయాణం అంటే విలాసం కాదు. ఉద్యోగులకో, ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడేదీ కాదు. చిరుద్యోగులు, చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వెళ్లే పేద వర్గాలకూ మెట్రో రైలు ఎంతో ఉపయుక్తం. హైదరాబాద్ విషయంలో ఇది ఇప్పటికే రుజువైంది. విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లేందుకు అక్కడి మెట్రోరైలును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వం పాతరేయడం విజయవాడపై కక్ష కాకపోతే మరేంటి?
31 మంది ఎంపీలుండి... ఏం ఉపయోగం?
రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగా, విజయవాడ, విశాఖల్లో మెట్రోరైళ్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఆ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై విస్తృత కసరత్తు చేసి, కేంద్రానికి నివేదికలు పంపింది. కేంద్ర ప్రభుత్వం 2017 మెట్రోరైలు పాలసీ ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రానికి సూచించింది. దానిపై కసరత్తు జరుగుతుండగానే... వైకాపా అధికారంలోకి వచ్చింది. అక్కడితో విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఉరితాడు బిగించడం మొదలైంది. విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఇంత వరకు కేంద్రానికి ప్రతిపాదన పంపలేదు.
‘‘మెట్రోరైలు ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, సమగ్ర రవాణా ప్రణాళిక, వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) వంటివి సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుకు... కొత్త మెట్రోరైలు పాలసీ-2017 ప్రకారం సవరించిన ప్రతిపాదనలు పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 2017 సెప్టెంబరు 1న కోరాం. ఇంత వరకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదు’’ అని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి 2022 డిసెంబరు 12న రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సహా విభజన హామీలన్నీ సాధిస్తానని జబ్బలు చరిచిన జగన్... ఆయన పార్టీకి లోక్సభ, రాజ్యసభలో కలిపి 31 మంది ఎంపీలున్నా... విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. అసలు ప్రతిపాదన పంపడమే ఇష్టం లేని జగన్ ప్రభుత్వం ఇక ఒత్తిడేం తెస్తుంది.
ఝార్ఖండ్.. ఒడిశా.. ఏపీ..
ఇంతవరకు మెట్రోరైళ్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు, ఈశాన్య రాష్ట్రాలు, ఝార్ఖండ్, ఒడిశా వంటివి కొన్నే ఉన్నాయి. ఈ విషయంలో ఏపీని అత్యంత వెనుకబడిన రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. జమ్ము, శ్రీనగర్, ఠాణె, నాసిక్ లాంటి ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ మెట్రో రైళ్ల ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. గోరఖ్పూర్, దేహ్రాదూన్ లాంటి చిన్న నగరాలూ పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పటికే మెట్రోరైలు ఉన్న నగరాల్లో దాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. దక్షిణాదినే ఉన్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మెట్రోను ఆయా నగరాల్లోని అన్ని ప్రాంతాలకూ మరింత చేరువ చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం వచ్చే మెట్రోకూ మోకాలడ్డుతున్న పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్