రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోంది
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోందని.. తాను బటన్ నొక్కి ఖాతాల్లోకి నగదు పంపే డీబీటీకి.. చంద్రబాబు దోచుకోవడానికి, పంచుకోడానికి.. తినుకోడానికి (డీపీటీ) మధ్య ఆ యుద్ధం ఉంటుందని సీఎం జగన్ అన్నారు.
పేదవాడు వైకాపా వైపు... పెత్తందార్లు మరోవైపు
అన్ని పార్టీల పథకాల కాపీ.. బాబు మేనిఫెస్టో: సీఎం జగన్
కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధుల విడుదల
ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోందని.. తాను బటన్ నొక్కి ఖాతాల్లోకి నగదు పంపే డీబీటీకి.. చంద్రబాబు దోచుకోవడానికి, పంచుకోడానికి.. తినుకోడానికి (డీపీటీ) మధ్య ఆ యుద్ధం ఉంటుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం ‘వై.ఎస్.ఆర్. రైతు భరోసా-పి.ఎం.కిసాన్’ నిధుల విడుదల, ఇన్పుట్ సబ్సిడీ జమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెదేపా సామాజిక అన్యాయానికి.. వైకాపా సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోందని పేర్కొన్నారు. వారి యుద్ధం జగన్తో కాదని. పేదలతో యుద్ధమని గుర్తుంచుకోవాలని చెప్పారు. పేదవాడు వైకాపా వైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉండి యుద్ధం చేస్తున్నారన్నారు. వారిది రాజకీయ పోరాటం కాదని, అధికారం కోసం ఆరాటమని ఎద్దేవా చేశారు. దోచుకోవడానికి, ఆ దోచుకున్నది తినడానికే వారికి అధికారం కావాలన్నారు. రాజమహేంద్రవరంలో ఒక డ్రామా కంపెనీ మాదిరిగా మహానాడు జరిగిందని అన్నారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని గతంలో హామీ ఇచ్చి.. తనకు ఓటేసిన ఓటర్లను నిలువునా ముంచేశారన్నారు. ఎన్నికల ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో విడుదల చేయడం.. ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబునాయుడి రాజకీయ ఫిలాసఫీ అని పేర్కొన్నారు. కర్ణాటకలో వివిధ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కలిపేసి ఆయన మేనిఫెస్టోను తయారు చేశారన్నారు. దీనిని ప్రజలు గమనించాలన్నారు. తెదేపాకు 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు కూడా లేరని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పాలించి.. ప్రస్తుతం మళ్లీ మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఐదో ఏడాది తొలి విడత సాయం..
వరుసగా ఐదో ఏడాది తొలి విడత సాయాన్ని 52,30,939 మంది రైతుల ఖాతాలకు మొత్తం రూ. 3,923 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఏటా రూ. 12,500 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి... దానికన్నా మిన్నగా రూ. 13,500 ఇస్తున్నామని చెప్పారు. ప్రతి రైతన్నకు మొత్తం రూ. 61,500 సాయం అందినట్లవుతుందని తెలిపారు. గురువారం రూ. 5,500, త్వరలో మిగిలిన రూ.2,000 పీఎం కిసాన్ నిధులు జమవుతాయని చెప్పారు. ప్రభుత్వం రైతు భరోసా కోసం మొత్తం రూ. 30,985 కోట్లు వెచ్చించిందని గుర్తుచేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద ఏ సీజన్లో నష్టాన్ని ఆ సీజన్లోనే చెల్లిస్తున్నామని తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వర్షాలకు నష్టపోయిన 51 వేల మంది రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి మరో రూ. 54 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అనంతరం బటన్ నొక్కి రైతు భరోసా సాయం, ఇన్పుట్ సబ్సిడీలను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం
కర్నూలులో రూ. 500 కోట్లతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని.. జులై, ఆగస్టుల్లో శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రూ.వెయ్యి కోట్లతో ఆదోని, నంద్యాలలో వైద్య కళాశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. పత్తికొండలో రూ. 10 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.
ఆర్బీకే స్థాయిలో డ్రోన్లు
2014-19 మధ్య ఆహారధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 153 లక్షల టన్నులుంటే.. 2019-23 మధ్య ఏటా సగటు ఉత్పత్తి 165 లక్షల టన్నులకు పెరిగిందని సీఎం చెప్పారు. ఉద్యాన పంటల దిగుబడి 228 లక్షల టన్నుల నుంచి 332 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. తన నాలుగేళ్ల పాలనలో ఒక్క మండలాన్ని కూడా కరవు ప్రాంతంగా ప్రకటించే పరిస్థితి రాలేదని తెలిపారు. గత సంవత్సరం ఖరీఫ్ బీమా సొమ్మును జులై 8న జమ చేయనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే 3.09 కోట్ల టన్నులు సేకరించిందన్నారు. ధాన్యం సేకరణకు ఇప్పటికే రూ. 60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. నియోజకవర్గ స్థాయిలో 70 ఆర్గానిక్ టెస్టింగ్ ప్రయోగశాలలు ఏర్పాటు కాగా మరో 77 నియోజకవర్గాల్లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు సాగు విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని.. రానున్న రోజుల్లో రైతులు డ్రోన్లతో వ్యవసాయం చేయనున్నారని పేర్కొన్నారు. ఆర్బీకే స్థాయిలో డ్రోన్లు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 1,052 కోట్ల విలువైన యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్కుమార్, మేయర్ బి.వై.రామయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మధ్యలోనే జనం బయటకు..
ఆలూరు గ్రామీణ, ఆస్పరి, న్యూస్టుడే: సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పత్తికొండలోని రహదారులను దిగ్బంధించారు. దుకాణాలన్నీ మూసివేయించారు. సభకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి ప్రసంగం సాగుతుండగానే.. చాలామంది వెనుదిరిగారు. నాయకులు విన్నవిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
సీఎం సభలో మద్యం కిక్కు
సీఎం సభలో మద్యం కిక్కు ఎక్కువైంది. నాయకులు వివిధ గ్రామాల నుంచి వైకాపా కార్యకర్తలను భారీగా తరలించారు. మద్యం తాగేవారికి కొందరు టెట్రా ప్యాకెట్లు అందించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వారు బయటకు వచ్చి మద్యం తాగారు. కొందరు రోడ్లపై తాగడం కనిపించింది. పోలీసులూ ఏం చేయలేకపోయారు. ఒకరిద్దరు తాగి సభలో కింద పడిపోయి కనిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్