45 డిగ్రీలకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. మంగళవారం అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 45, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Published : 07 Jun 2023 03:16 IST

నేడు 12 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. మంగళవారం అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 45, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కృష్ణా, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, గుంటూరు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 44 డిగ్రీలకు పైనే ఉన్నాయి. బుధవారం 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, 218 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ఠంగా 45నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని