శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంటోంది.

Updated : 09 Jun 2023 05:34 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంటోంది. గురువారం సాయంత్రానికి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఆళ్వార్‌ట్యాంక్‌ వరకు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 24 గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. బుధవారం శ్రీవారిని 75,229 మంది భక్తులు దర్శించుకోగా.. రూ.3.24 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని