Machilipatnam: మన ఓట్లు కాదా.. బూత్ మార్చేయ్
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డోర్ నం.27/37లో జి.వెంకట కనకరాజు కుటుంబసభ్యులు ఉంటున్నారు. వారి పోలింగ్ బూత్ నం.110. ఆయన పోలింగ్బూత్ను 43కు మార్చేశారు.
చూసుకోరనే ధీమాతో అడ్డగోలు వ్యవహారం
బూత్లు మారిపోయిన వేల ఓట్లు
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డోర్ నం.27/37లో జి.వెంకట కనకరాజు కుటుంబసభ్యులు ఉంటున్నారు. వారి పోలింగ్ బూత్ నం.110. ఆయన పోలింగ్బూత్ను 43కు మార్చేశారు.
- డోర్ నం.18/336లో ఉంటున్న జి.వరలక్ష్మి, వెంకటేశ్వరరావుల పోలింగ్ కేంద్రం 66. వరలక్ష్మి పోలింగ్ కేంద్రాన్ని 44కు మార్చారు.
- డోర్ నం.16/372 చెందిన ఎం.ఆంజనేయులు, అంజలిల పోలింగ్ కేంద్రం 70 కాగా.. ఆంజనేయులు పోలింగ్ కేంద్రాన్ని 46కు బదిలీ చేశారు.
- 9/143లో ఉంటున్న రహమతున్నీసా, సత్తార్షేక్, అన్వర్మొహ్మద్ల పోలింగ్ కేంద్రం 135. రహమతున్సీసాకు 43, అన్వర్మొహ్మద్కు 137 కేటాయించారు.
- డోర్ నం.14/141లో ఉంటున్న యోగనాథశర్మ పోలింగ్ బూత్ 84. ఆయన పేరు 57, 84లో డబుల్ ఎంట్రీగా చూపారు.
- మచిలీపట్నం కలెక్టరేట్, న్యూస్టుడే: కొన్నేళ్లుగా ఓటర్ల జాబితాలను మారుస్తున్న తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఓట్లకు గండికొట్టేందుకు వాలంటీర్ల సారథ్యంలో నయా దందాకు తెరతీశారు. ఎన్నికల జాబితా తయారీలో రూల్ నం.6 అతిక్రమిస్తూ ప్రత్యేకించి విపక్షాలకు చెందిన వేల ఓట్లను గల్లంతు చేస్తున్న తీరు ‘న్యూస్టుడే’ పరిశీలనలో వెల్లడైంది.
అనుమానం రానీయకుండా..
ఓటరు తనకు ఓటు హక్కు ఉందా లేదా అనే అనుమానం వచ్చినప్పుడు జాతీయ ఓటర్ల సర్వీసు పోర్టల్లో చూసుకుంటే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ, తమ బూత్ ఎక్కడనే విషయంపై ఆరా తీయరు. ఎన్నికలప్పుడు ఓటు వేయడానికి దగ్గర్లో ఉండే బూత్కు వెళ్తే అక్కడ ఓటు ఉండదు. ఎక్కడో మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే బూత్లో ఓటు ఉందని తెలిసినా... అందరూ అంతదూరం వెళ్లరు. ఒకవేళ అక్కడికి వెళ్లినా అప్పటికే నకిలీ ఐడీతో ఎవరైనా ఓటు వేస్తే.. ఛాలెంజ్ చేయరు. అంటే బూత్ల మార్పిడిని అడ్డుపెట్టుకుని కొందరిని ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయవచ్చు. ఇలా ప్రతి నియోజకవర్గంలో గెలుపు అవసరాల మేరకు ఓటర్ల బూత్ మార్పిడి చేశారనడానికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గమే ఉదాహరణగా నిలుస్తోంది.
రూల్ నం.6 దుర్వినియోగం చేస్తూ..
ఓటుహక్కు ఉన్నట్లు భ్రమ కల్పించి ఓటు వేసే అవకాశం లేకుండా చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రూల్ నం.6ను దుర్వినియోగం చేస్తున్నారు. జాబితా నుంచి పేర్లు తొలగించినా, ఒకే డోర్ నంబరుపై వందలసంఖ్యలో ఓటర్లున్నా తేలిగ్గా గుర్తించి పరిష్కరించుకోవచ్చు. కానీ, పట్టణ ప్రాంతాలు, మేజర్ పంచాయతీల్లో ఓటర్ల బూత్లను మార్చేస్తే అంతగా గుర్తించే అవకాశం ఉండదు. దాన్ని ఆసరాగా చేసుకొని వేల ఓట్లను ఎన్నికల జాబితా తయారీ (ఎలక్ట్రోరల్ ప్రిపరేషన్ మాన్యువల్) నిబంధనలకు విరుద్ధంగా బూత్లు మార్చేశారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఓటరుకు రెండు కి.మీ. పరిధిలో పోలింగ్ బూత్ ఉండాలి. రూల్ నం.6 ప్రకారం డోర్నంబర్ల ప్రకారం ఓటర్ల జాబితా రూపొందించాలి. అందుకు భిన్నంగా మచిలీపట్నం నియోజకవర్గంలో వేల ఓటర్ల పోలింగ్ బూత్లను 3-5 కి.మీ. దూరానికి మార్చేశారు. ఒకే కుటుంబానికి వేర్వేరు బూత్లు కేటాయించారు. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో 1140 పైగా ఓటర్లను ఏకంగా రెవెన్యూ వార్డులే మార్చేశారు. రెవెన్యూ వార్డు పరిధిలో ఉండే బూత్ల వారీగా రమారమి 10,000 ఓట్ల పోలింగ్ కేంద్రాలను తారుమారు చేశారు. 2022 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత అభ్యంతరాల స్వీకరణ సందర్భంగా.. రూల్ నం.6 అతిక్రమణ గురించి ఎత్తిచూపినా పరిగణనలోకి తీసుకోకుండా 2023 జనవరి 5న అవే తప్పులతో తుది జాబితా విడుదల చేశారు.
వాలంటీర్లను వినియోగించి..
వాలంటీర్లే విపక్ష ఓటర్ల బూత్లను తారుమారు చేశారన్న అభియోగాలున్నాయి. మార్పులు, చేర్పులు చేసినవారి పూర్తి వివరాలతో పాటు అందుకు అనుగుణంగా సిద్ధం చేసుకున్న నకిలీ ఐడీలు వారి చేతుల్లోనే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేసేటప్పుడు చాలావరకు సచివాలయ సిబ్బందే బీఎల్వోలుగా ఉంటున్నారు. వారు అధికారపార్టీ నాయకుల ఆదేశాలే పాటిస్తున్నారన్న అభియోగాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ