బియ్యం కొనేట్టు లేదు
విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధించడంతో.. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం ధరలైతే కాస్త తగ్గించారు. బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు సరికదా.. రెండు నెలల క్రితంతో పోలిస్తే పెరిగాయి.
సన్నబియ్యం కిలో రూ.60పైనే
2018 నాటితో పోలిస్తే 30% పెరిగిన ధర
కందిపప్పు కిలో రూ.160 పైనే
ఈనాడు, అమరావతి: విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధించడంతో.. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం ధరలైతే కాస్త తగ్గించారు. బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు సరికదా.. రెండు నెలల క్రితంతో పోలిస్తే పెరిగాయి. సన్న బియ్యం ధర కిలో రూ.60 నుంచి రూ.63 మధ్యకు చేరింది. మధ్యరకం బియ్యం ధర కూడా కిలో రూ.50 పైనే ఉంది. బియ్యంతోపాటు పప్పుధాన్యాల ధరలు కూడా ఆకాశం వైపు చూస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో బియ్యం ధరలు దిగి రావడం లేదు. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో ఇష్టానుసారం విక్రయిస్తున్నారు. నాణ్యమైన కందిపప్పు కొనాలంటే కిలో రూ.160 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. 2018 ఆగస్టు నాటితో పోలిస్తే బియ్యం ధర 30% పెరగ్గా.. కందిపప్పు 146% హెచ్చింది. మినపగుళ్ల ధర కూడా గతంతో పోలిస్తే కిలోకు రూ.20 వరకు పెరిగింది. నెల నెలా పెరుగుతున్న ధరలతో..పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం మరింత పెరుగుతోంది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా రాయితీ కందిపప్పు కూడా ఇవ్వడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో కొనాల్సి వస్తోంది.
ధాన్యం ధర తగ్గినా...
ధాన్యం బస్తా (75కిలోలు) ధర రెండు నెలల కిందటితో పోలిస్తే రూ.100 వరకు తగ్గింది. రైతుల నుంచి రూ.1,800 నుంచి రూ.2,100 వరకు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన రకాలైతే రూ.2,450 వరకు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఇక పెరిగే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా బియ్యం ధరలు కూడా కిలోకు రూ.3 వరకు తగ్గాల్సి ఉంది. అయితే ఎక్కడా ఆ పరిస్థితే కన్పించడం లేదు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంతోపాటు నెల్లూరు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల సన్నబియ్యం కిలో రూ.63 వరకు విక్రయిస్తున్నారు. పట్టణాల్లో బ్రాండెడ్ రకాల బియ్యం ధర కిలో రూ.60 వరకు ఉంది. 26 కిలోల బస్తా రెండు నెలల కిందట రూ.1,350 నుంచి రూ.1,400 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.1,600 వరకు అమ్ముతున్నారు. సన్నబియ్యంలోనే తెలుపు, మసర తదితర రకాలున్నాయి. పాలిష్ బియ్యంతో పోలిస్తే ఇవి కిలోకు రూ.3 నుంచి రూ.4 వరకు తక్కువగా ఉంటాయి. పెరిగిన ధరల నేపథ్యంలో ఇవి కూడా కిలో రూ.50 నుంచి రూ.54 మధ్యకు చేరాయి.
కందిపప్పు అంతకంతకు పెరుగుతూ..
కందిపప్పు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.160 నుంచి రూ.170 మధ్య విక్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటితో పోలిస్తే కిలోకు రూ.50 పైగా పెరిగింది. మధ్యరకం కందిపప్పు కూడా కిలో రూ.150 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. రాష్ట్రంలో కంది సాధారణ విస్తీర్ణం 6.30 లక్షల ఎకరాలు కాగా.. 2.57లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. ధరలు పెరగడానికి ఇదీ ఒక కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
చేతులెత్తేసిన ప్రభుత్వం
రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీపై ప్రభుత్వం చేతులెత్తేసింది. కిలో కూడా ఇవ్వడం మా వల్ల కాదని చెప్పకనే చెబుతోంది. 2018లో కిలో కందిపప్పు రాయితీపై రూ.40 చొప్పున కార్డుకు 2 కిలోలు ఇవ్వగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక కిలో ధర రూ.67 చేసి కార్డుకు కిలో చొప్పునే ఇవ్వాలని నిర్ణయించింది. మూడు నెలలుగా అదీ ఇవ్వడం లేదు. జూన్, జులైలో ఇవ్వాల్సిన కందిపప్పు కూడా కలిపి ఒక్కో కార్డుపై రెండు కిలోలు ఇస్తామన్న మంత్రి నాగేశ్వరరావు మాటలు.. డొల్ల చందమే అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ