వైద్యవిద్యనూ అమ్మేశారు!
సీఎం జగన్ ఇటీవల ఏ సభలో మాట్లాడినా తాను పేదల పక్షమని ఊదరగొడుతున్నారు...! దీనజనోద్ధారకుడు అన్నది తన ట్యాగ్లైన్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు...! ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కష్టం కలగకుండా, నష్టం జరగకుండా చూసుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా చెబుతున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు మెడికల్ సీట్లు కొనుక్కోవాల్సిందే
ఎన్ని విమర్శలొచ్చినా జగన్ సర్కారుది అదే విధానం
రూ.90 లక్షలు కట్టి ఎంబీబీఎస్ సీటు ఎవరు కొనగలరు?
ఈనాడు, అమరావతి: సీఎం జగన్ ఇటీవల ఏ సభలో మాట్లాడినా తాను పేదల పక్షమని ఊదరగొడుతున్నారు...! దీనజనోద్ధారకుడు అన్నది తన ట్యాగ్లైన్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు...! ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కష్టం కలగకుండా, నష్టం జరగకుండా చూసుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా చెబుతున్నారు. వారి కోసమే పెత్తందారులపై తన పోరాటమని డాంబికాలు పలుకుతున్నారు. అవన్నీ మాటల వరకే..! చేతలకు వచ్చేసరికి తానే అసలు సిసలు పెత్తందారుననీ, పేదల వ్యతిరేకిననీ మరోసారి చాటుకున్నారు. కొత్తగా వచ్చిన అయిదు వైద్య కళాశాలల్లో సగం సీట్లను నిస్సిగ్గుగా అమ్మేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లను 25 శాతానికే పరిమితం చేస్తూ, వారిపై తనదంతా కల్లబొల్లి ప్రేమేనని మరోసారి నిరూపించారు. జగన్లోని భూస్వామ్య, పెత్తందారీ స్వభావాన్ని... ఆయన ప్రభుత్వ కొత్త విధానం మరోసారి బహిర్గతం చేసింది.
కొత్తగా వచ్చిన అయిదు వైద్య కళాశాలల్లో సగం సీట్లకు ప్రభుత్వం రూ.లక్షల్లో ధరలు నిర్ణయించి, సంతలో సరకులా అమ్మేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని పేదలు కోల్పోతున్న సీట్లు 204. ప్రస్తుత నిబంధనలే అమల్లో ఉంటే, త్వరలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్న 12 కళాశాలలను కలిపి లెక్కిస్తే వారు కోల్పోయే సీట్లు సుమారు 694. ఇవన్నీ ఒక్క ఏడాదిలో కోల్పోయే సీట్లు..! ఈ ప్రకారం రానున్న దశాబ్దాల్లో బడుగు బలహీన వర్గాల వారు కోల్పోయే సీట్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఎంబీబీఎస్లో సీటు రావడమంటే... ఒకవిధంగా యజ్ఞమే. విపరీతమైన పోటీని తట్టుకుని నీట్లో మంచి ర్యాంకు సాధించాలి. మొదటి ప్రయత్నంలో సీటు రాకపోతే... దీర్ఘకాల శిక్షణ తీసుకుంటారు. దానికే రూ.లక్షల్లో ఖర్చవుతుంది. అన్ని కలలుకని, ఒక తపస్సులా శ్రమించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశల్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేయడం, ప్రభుత్వమే ఫక్తు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తూ సీట్లను తెగనమ్ముకోవడమేనా పేదల్ని ఉద్ధరించడమంటే? ప్రతిభ కలిగిన బడుగు, బలహీన వర్గాల పిల్లల కలల్ని కాలరాయడం వారిని ఆదుకోవడం ఎలా అవుతుంది?
బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం
ఈ విద్యాసంవత్సరం నుంచి రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరుల్లో ఏర్పాటైన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 150 చొప్పున 750 సీట్ల భర్తీకి జాతీయ వైద్యకమిషన్ ఆమోదం తెలిపింది. దానిలో జాతీయ కోటా కింద 15% (112) సీట్లు వెళ్లాయి. మిగిలిన 638 సీట్లలో 50% (25% సీట్లు ఓపెన్ కేటగిరీ, 25% సీట్లు రిజర్వేషన్) కన్వీనర్ కోటాలో రాష్ట్రవిద్యార్థులతో భర్తీచేశారు. మిగిలిన 50% సీట్లలో 35% ‘బీ’ కేటగిరీ (సెల్ఫ్ ఫైనాన్స్) కింద, 15% ఎన్నారై కోటా కింద భర్తీచేస్తున్నారు. ఇలా ప్రతి కళాశాలలోనూ 50% సీట్లు అమ్మకానికి పెట్టారు. దీంతో 5 కళాశాలల్లో ఎస్సీ విద్యార్థులు 48 సీట్లు, ఎస్టీ విద్యార్థులు 19 సీట్లు, బీసీ విద్యార్థులు 93 సీట్ల చొప్పున మొత్తం 160 సీట్లు నష్టపోయారు.
ఓపెన్ కేటగిరీలోనూ కోత
ప్రతిభగల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీ సీట్లలోనూ ప్రవేశాలు పొందుతుంటారు. ఇప్పుడు కొత్తవిధానంతో ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎసీ, బీసీ వర్గాలకు వచ్చే సీట్లకూ గండి పడుతోంది. సాధారణంగా ఓపెన్ కేటగిరీ సీట్లలో ప్రతిభగల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సగటున 15% వరకు సీట్లు పొందుతుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఒంగోలు ప్రభుత్వ కళాశాలలో 59 ఓపెన్ కేటగిరీ సీట్లకుగాను... 27 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వచ్చాయి. అంటే దాదాపు సగం సీట్లు వారికి దక్కినట్టు. కొత్తగా వచ్చిన అయిదు వైద్య కళాశాల్లో 319 సీట్లను ప్రభుత్వం అమ్మేయకుండా రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించి భర్తీ చేసి ఉంటే... వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 160 సీట్లతో పాటు, ఓపెన్ కేటగిరీలోను 24 సీట్లు వరకు దక్కేవి. అంటే జగన్ ప్రభుత్వ విధానం వల్ల అయిదు కళాశాలల్లోనే వారు 204 సీట్లు కోల్పోతున్నారు.
రూ.90 లక్షలు పెట్టి సీటు కొనుక్కోగలరా?
కొత్త వైద్య కళాశాలల్లో 50% సీట్లు అమ్మకానికి పెట్టిన జగన్ ప్రభుత్వం... బీ కేటగిరీ (సెల్ఫ్ ఫైనాన్స్) సీటుకి రూ.12 లక్షలు, సీ కేటగిరీ (ఎన్నారై కోటా) సీటుకు రూ.20 లక్షలు ఫీజు నిర్ణయించింది. నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును రూ.90 లక్షలు కట్టి చదివే స్తోమత పేదలైన దళిత, గిరిజన బిడ్డలకు ఉంటుందా? ఇలా సీట్లు తెగనమ్మడం... రాజ్యాంగం ఆయా వర్గాలకు కల్పించిన హక్కును కాలరాయడం కాదా? అయిదు కాలేజీల్లో ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సీట్లలో డబ్బు కట్టి చేరిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 22 మందే. వారిలో 20 మంది ఎస్సీలు. ఇద్దరు ఎస్టీలు. వారు కూడా ధనికులు పిల్లలు, ఆర్థిక స్తోమత ఉన్నవారు. ఆయావర్గాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులు సీట్లు కొనుక్కోలేక ఎంత వేదన పడతారో ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా? ప్రభుత్వం ఉన్నది పేదలకి మేలు చేయడానికా... విద్యా వ్యాపారం చేస్తూ వారి హక్కుల్ని కాలరాయడానికా?
ఈడబ్ల్యూఎస్లను మరచిపోయారా?
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్) వారు ఉన్నారనే విషయాన్ని జగన్ మరచిపోయినట్టున్నారు. ఎంతో కీలకమైన వైద్యవిద్య సీట్ల భర్తీలో వారికి కేటాయింపులు ఉండాలనే విషయాన్ని పరిగణనలోకే తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లను కొత్త వైద్య కళాశాలల్లో అమలుచేస్తున్నా....జగన్ మాత్రం కేంద్రం ఇంకా అనుమతివ్వలేదన్న సాకుతో మిన్నకున్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న విధానాన్ని ఇక్కడా అమలుచేసి ఆ వర్గం విద్యార్థులకు మేలు చేయడానికి ఉన్న అభ్యంతరమేంటి? కేంద్రం అనుమతే కావాలనుకుంటే... తరచూ దిల్లీ వెళ్లి కేంద్రపెద్దలను, అధికారులను కలిసే జగన్...ఈ విషయాన్ని వారివద్ద ప్రస్తావించి ఉండొచ్చు కదా?
భవిష్యత్తులో పీజీ సీట్లకూ ఎసరు?
ప్రభుత్వ సీట్ల అమ్మకం నిర్ణయం ప్రస్తుతానికి ఎంబీబీఎస్ ప్రవేశాలకే అంటున్నా.. భవిష్యత్తులో పీజీ సీట్లకూ వర్తింపజేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...సమ్మె చేస్తామని ప్రకటించారు. కానీ.. వారిపై రాష్ట్రప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. వారిని భయపెట్టి.. ఆందోళన ఉపసంహరించుకునేలా చేసింది. ప్రభుత్వనిర్ణయం వైద్యవిద్య చదవాలనుకునేవారి ఆశలను ఆడియాసలు చేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ