Botsa Satyanarayana: మంత్రి బొత్సకు హృద్రోగ సమస్యలు !

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్లు తెలిసింది. గురువారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం కుమారుడు సందీప్‌తో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు.

Updated : 10 Nov 2023 08:18 IST

ఈనాడు, విజయనగరం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు(Botsa Satyanarayana) హృదయ సంబంధ సమస్యలు ఉన్నట్లు తెలిసింది. గురువారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం కుమారుడు సందీప్‌తో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ ఓ హార్ట్‌ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. వైద్య నిపుణుల సూచనల మేరకు గుండెకు స్టెంట్లు వేయాలా.. శస్త్రచికిత్స చేయాలా.. అన్నది నిర్ణయిస్తారని తెలిసింది. ప్రస్తుతానికి మంత్రి ఆరోగ్యంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మంత్రి జ్వరంతో బాధపడుతూనే ఈ నెల 4న ఎస్‌.కోటలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్నారు. 5న శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లారు. మరుసటి రోజు విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో హృదయ సంబంధ సమస్యలు ఉన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని నిపుణులు సూచించారు. దీంతో గురువారం విజయనగరంలో మేనకోడలు వివాహం చూసుకుని ఆయన హైదరాబాద్‌ వెళ్లాలని అనుకున్నా.. కుటుంబ సభ్యుల సూచనలతో ముందుగానే వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని