అరచేతిలో ప్రాణం.. పెద్దేరులో ప్రయాణం
ఏరు దాటాలంటే వంతెన మీదుగా వెళ్తాం. లేకపోతే పడవలు, తెప్పలను ఆశ్రయిస్తాం. కానీ ఇక్కడ వంతెన అంశాన్ని పాలకులు ప్రతిసారి ఎన్నికల హామీగా మలుచుకుంటున్నారు.
ఏరు దాటాలంటే వంతెన మీదుగా వెళ్తాం. లేకపోతే పడవలు, తెప్పలను ఆశ్రయిస్తాం. కానీ ఇక్కడ వంతెన అంశాన్ని పాలకులు ప్రతిసారి ఎన్నికల హామీగా మలుచుకుంటున్నారు. పడవలు ఆ ప్రజలకు అందుబాటులో లేవు. అందుకే.. బెల్లం తయారీకి వాడే పాత్రను తెప్పగా చేసుకొని ఏరు దాటుతున్నారు. ఇదీ అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో పలు గ్రామాల రైతుల పరిస్థితి. ఈ మండలం మీదుగా పెద్దేరు ప్రవహిస్తుంది. ఏడాది పొడవునా నిండుగా పారుతుంది. చాకిపల్లి, రామజోగిపాలెం, జన్నవరం గ్రామాల రైతుల భూములు పెద్దేరుకు అవతలి వైపు ఉన్నాయి. పొలాలకు వెళ్లాలంటే బెల్లం తయారీకి వాడే పాత్ర(పెనం)ను తెప్పగా చేసుకుంటున్నారు. ఆ పాత్ర ఇనుముతో చేసింది కావడంతో బరువు ఎక్కువగా ఉంటోంది. పొరపాటున ఒక వైపు బరువు ఎక్కువైతే మునిగిపోతుంది. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. పెద్దేరును దాటుతున్నారు. రామజోగిపాలెం గ్రామానికి చెందిన తల్లీకుమార్తె పెద్దేరు దాటుతున్న దృశ్యమిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. -
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీకి మద్దతుగా 22,559 మంది సంతకాలు
జగన్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు, వేధింపులకు బలైపోయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ‘ఛేంజ్.ఓఆర్జీ’లో ఉద్యమం కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు