పశువులూ అల్లాడుతున్నాయ్!
నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి.
వైకాపా పాలనలో.. పడకేసిన పశువైద్యం
రెండు, మూడు ఆసుపత్రులకు ఒక డాక్టర్
3,300 మందికిపైగా వైద్యులు అవసరం
పోస్టుల భర్తీ ఊసెత్తని సీఎం జగన్
ఈనాడు, అమరావతి
నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి. అధికారంలోకి రావడంతోనే పశువైద్యాన్ని జగన్ పక్కన పెట్టేశారు. వైద్యుల కొరత వెంటాడుతున్నా.. చికిత్స అందక మూగజీవులు ప్రాణాల్ని కోల్పోతున్నా.. రైతులు రూ.లక్షల్లో నష్టపోతున్నా.. పట్టించుకోవడమే మానేశారు. ‘పశువుకు ఒక కాంపౌండర్ వైద్యం చేయడం వేరు, ఒక డాక్టర్ వైద్యం చేయడం వేరు’ అని పలికిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చటే మరిచారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేశాం అని చెబుతూ... పశువుల వైద్యానికి మొండిచేయి చూపిస్తున్నారు. పశు గణాంకాల ఆధారంగా రాష్ట్రంలో 3,300 మందికి పైగా వైద్యులు అవసరం. నాలుగున్నరేళ్లలో ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదు. పాలవెల్లువ పేరుతో సహకార పాడిరంగాన్ని అమూల్కు అప్పజెప్పిన జగన్... మరోసారి అధికారంలోకి వస్తే అమూల్కు పాలను ఇచ్చే పశువులకే వైద్యం అంటారేమో? పశుసంవర్థక శాఖనూ ఆ సంస్థకే అప్పగిస్తారేమో?
ఇన్ఛార్జులే దిక్కు..
మేలు జాతి పశువును కొనాలంటే.. రూ.80 వేల నుంచి రూ.1 లక్ష అవుతుంది. ఒక్కో రైతు రెండు, మూడు పాడి పశువుల్ని పోషిస్తుంటారు. వాటికి ఏదైనా అనారోగ్యం వస్తే.. అధికశాతం గ్రామాల్లో వైద్యం అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆర్బీకేల్లోని సహాయక సిబ్బందితో సర్దుకోవాలని సర్కారు చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో.. డెయిరీ యాజమాన్యాలే వైద్యుల్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నాయి. పల్నాడు జిల్లా నూజెండ్ల మండల వైద్యుడికి వినుకొండ మండలం పిట్టంబండ బాధ్యతల్నీ అప్పగించారు. అంటే ఆయన రెండు మండలాలకు పని చేయాలి. శావల్యాపురం వైద్యుడిని కారుమంచి వైద్యశాలకు ఇన్ఛార్జిగా నియమించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాఘంలో పనిచేసే వైద్యుడికి.. అయినవిల్లి, వీరవల్లిపాలెంతోపాటు కొత్తపేట మండలంలోని అవిడి, గంటి ఆసుపత్రుల ఇన్ఛార్జి బాధ్యతల్ని అప్పగించారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ‘రూ.లక్ష విలువైన ఆవు.. దూడ పుట్టాక అనారోగ్యానికి గురైంది. తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోనిది కాదని వైద్యులు పట్టించుకోలేదు. పరిస్థితి విషమించి, ప్రైవేటు వైద్యులతో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది’ అని జిల్లా తనకల్లుకు చెందిన విజయ్కుమార్ ఆవేదన వెలిబుచ్చారు.
2,100 మందికి పైగా అవసరం
రాష్ట్రంలో 1,576 వెటర్నరీ డిస్పెన్సరీలు, 323 పశు వైద్యశాలలు, 12 పాలీ క్లినిక్లు, 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. వెటర్నరీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రతి 5 వేల యూనిట్లకు ఒక వైద్యుడి చొప్పున 3,300 మందికి పైగా పశువైద్యుల్ని నియమించాలి. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేసేది 1,610 మందే. వీరిలోనే ఏడీ, డీడీ, జేడీలు ఉన్నారు. వాస్తవానికి వారు పరిపాలనా పరమైన విధుల్నే నిర్వర్తిస్తారు. క్షేత్రస్థాయిలో వైద్యసేవల్ని అందించే పరిస్థితి లేదు. అయినా వారినీ పశువైద్యుల కిందనే చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 1,610 మందికి పైగా సిబ్బందిలో సుమారు 400 మంది అలాంటి వారే. క్షేత్రస్థాయిలో పశువైద్య సేవలు అందించేది 1,200 మందే. 2,100 మందికిపైగా వైద్యుల పోస్టుల్ని భర్తీ చేయాలి. నియోజకవర్గ స్థాయి పశువ్యాధి నిర్ధరణ కేంద్రాలు 175 ఉన్నా వాటిలో వైద్యుల్ని నియమించలేదు.
పశువైద్య సేవలెలా?
వైకాపా అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి.. అక్కడ గ్రామ పశు సంవర్థక సహాయకుల్ని నియమిస్తూ వస్తోంది. వీరు పాలిటెక్నిక్, వృత్తి విద్యాకోర్సులు పూర్తి చేసినవారే. పశువులకు వైద్యం చేసే స్థాయి వీరికి ఉండదు. వాస్తవానికి డిప్లొమో కోర్సులు చేసిన వారు.. పశువైద్యుని ఆధ్వర్యంలో పనిచేయాలి. స్వతంత్రంగా వైద్యం చేసే దిశగా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. వైద్యుల పోస్టుల భర్తీని పట్టించుకోకుండా తాత్సారం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి