పదిలో.. 86.69% ఉత్తీర్ణత
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,16,615 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు.
బాలికలు 89.17%, బాలురు 84.32% పాస్
ఉత్తీర్ణుల్లో 69.26% మంది ఫస్ట్ క్లాస్లోనే
17 పాఠశాలల్లో సున్నా ఫలితాలు
పార్వతీపురం మన్యం ప్రథమం.. కర్నూలు అధమం
పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన కమిషనర్ సురేశ్కుమార్
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,16,615 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలే మంచి ఫలితాలు సాధించారు. బాలికలు 2,69,307 (89.17%), బాలురు 2,65,267 (84.32%) మంది పాసయ్యారు. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం 14.43% పెరిగినా, కరోనాకు ముందు 2019 ఫలితాలతో పోల్చి చూస్తే 8.19% తగ్గింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డితో కలిసి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ విజయవాడలో సోమవారం విడుదల చేశారు. మార్కుల జాబితాలను నాలుగు రోజుల్లో ఆన్లైన్లో ఉంచనున్నారు. పాఠశాలలు విద్యార్థుల ర్యాంకులను ప్రకటించకూడదని, అందుకోసమే తాము మార్కులు వెల్లడించలేదని స్పష్టంచేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అండగా నిలవాలని, వారిని నిందించొద్దని కోరారు. 13 మంది అంధ విద్యార్థులు ఆన్లైన్లో సహాయకులు లేకుండా పరీక్ష రాశారని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగుస్తుండగా, అంతకంటే ముందుగానే ఫలితాలు ఇవ్వడం ఇదే మొదటిసారని సురేశ్కుమార్ తెలిపారు.
అత్యధికం ఫస్ట్ క్లాస్లోనే!
- ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు మొదటి శ్రేణిలోనే పాసయ్యారు. అంటే 600 మార్కులకు 360కి పైగా సాధించారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 86.69% కాగా, ప్రథమ శ్రేణిలో 69.26%, ద్వితీయ శ్రేణిలో 11.87%, తృతీయ శ్రేణిలో 5.56% మంది చొప్పున పాసయ్యారు.
- తెలుగు మాధ్యమంలో 1,61,881 మంది రాయగా, 1,15,060 (71.08%), ఆంగ్ల మాధ్యమంలో 4,50,304 మందికి 4,15,743 (92.32%) మంది ఉత్తీర్ణులయ్యారు.
- రాష్ట్రవ్యాప్తంగా 2,803 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 17 బడుల్లో సున్నా ఫలితాలొచ్చాయి. ప్రైవేటులో 13, ఎయిడెడ్లో 3, ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక్కరూ పాస్ కాలేదు.
- సబ్జెక్టుల వారీగా చూస్తే తెలుగులో 96.47%, హిందీ-99.24%, ఆంగ్లం-98.52%, గణితం-93.33%, సామాన్యశాస్త్రం-91.29%, సాంఘిక శాస్త్రంలో 95.34% మంది ఉత్తీర్ణులయ్యారు. సామాన్యశాస్త్రంలో ఎక్కువ ఫెయిలయ్యారు.
- ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ విద్యాసంస్థలు, బీసీ సంక్షేమ పాఠశాలలు 98.43% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, ప్రభుత్వ బడులు 74.40%, పురపాలక పాఠశాలలు 75.42%, జిల్లా పరిషత్తు పాఠశాలలు 79.38% ఉత్తీర్ణత నమోదు చేశాయి.
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు నేటి నుంచే
- ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఫీజును విద్యార్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 23 నుంచి 30లోపు చెల్లించాలి. రూ.50 అపరాధ రుసుముతో మే 1 నుంచి 23 వరకు చెల్లించవచ్చు.
- జవాబు పత్రాల రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం ఈనెల 23 నుంచి 30లోపు ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయుడి ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఒక్కో పేపర్ రీ-కౌంటింగ్కు రూ.500, రీ-వెరిఫికేషన్కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి.
- పరీక్ష ఫీజు సమర్పించే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు డిజిటల్ సంతకం చేసిన సర్టిఫికెట్ను పొందేందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలి. వీటిని మరో 4 రోజుల్లో వెబ్సైట్లో ఉంచుతారు.
- పదో తరగతి పరీక్షల ఫలితాల్లో వరుసగా రెండో ఏడాదీ పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి గతేడాది 87.47% విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈసారి 96.37% మంది పాసయ్యారు. ఆ తర్వాత ద్వితీయ, తృతీయ స్థానాల్లో శ్రీకాకుళం (93.35%), వైయస్ఆర్ (92.10%) జిల్లాలు ఉన్నాయి. చివరి మూడు స్థానాల్లో అనంతపురం (80.93%), ఏలూరు (80.08%), కర్నూలు (62.47%) నిలిచాయి. గతేడాది నంద్యాల జిల్లాది అధమ స్థానం కాగా, ఈసారి కర్నూలు జిల్లా వంతైంది. పైగా చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఏలూరు జిల్లాతో పోల్చినప్పుడు కర్నూలు ఉత్తీర్ణత సుమారు 18% తేడా ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు