ప్రభుత్వం గొప్పలు.. పదిలో తిప్పలు
పదో తరగతి పరీక్షల్లో జిల్లా పరిషత్తు, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత తగ్గింది. సరాసరి ఉత్తీర్ణత 86.69 శాతంగా ఉంటే అత్యధికంగా విద్యార్థులు ఉండే జిల్లా పరిషత్తు బడుల్లో 79.38%మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్ర సరాసరి కంటే జడ్పీ, పురపాలక, ప్రభుత్వ బడుల్లో 8.11% తక్కువ ఉత్తీర్ణత
వీటిల్లో చదివిన 67,393 మంది విద్యార్థులు ఫెయిల్
ఐఎఫ్పీలు, టోఫెల్, బైజూస్ ట్యాబ్లంటూ హడావుడే తప్ప ఫలితాల్లో వెనుకంజే
నంద్యాల జిల్లా చెంచుగూడెం పాఠశాలలో సున్నా ఫలితాలు
చూచిరాతలుగా మారిన పాఠశాల స్థాయి పరీక్షలు.. వెలుగు చూడని అభ్యసన సామర్థ్యాలు
ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో జిల్లా పరిషత్తు, పురపాలక, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత తగ్గింది. సరాసరి ఉత్తీర్ణత 86.69 శాతంగా ఉంటే అత్యధికంగా విద్యార్థులు ఉండే జిల్లా పరిషత్తు బడుల్లో 79.38%మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సరాసరి కంటే ఇది 7.31% ఉత్తీర్ణత తగ్గింది. పురపాలిక బడుల్లో 24.58%, ప్రభుత్వ పాఠశాలల్లో 25.6% మంది ఫెయిల్ అయ్యారు. రాష్ట్రంలో ప్రైవేటు తర్వాత అత్యధికంగా పరీక్షలు రాసే విద్యార్థులు జడ్పీ బడుల్లోనే ఉంటారు. ఈసారి జడ్పీ పాఠశాలల్లో 53,053 మంది ఫెయిల్ అయ్యారు. పురపాలక, ప్రభుత్వ, జడ్పీ బడుల్లో కలిపి 3,14,663 మంది పరీక్షలు రాస్తే వీరిలో 2,47,270 (78.58%)మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో సరాసరి ఉత్తీర్ణత 86.69 శాతం కాగా..పురపాలక, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 78.58గా ఉంది. అంటే ఇది 8.11 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. 67,393 మంది పరీక్షలు తప్పారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు(ఐఎఫ్పీ) ఏర్పాటు చేశాం.. బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు ఇచ్చాం.. టోఫెల్ పెట్టాం.. వచ్చే ఏడాది ఐబీ సిలబస్ తీసుకొస్తున్నామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. పదో తరగతి ఫలితాల్లో పాఠశాలలు వెనుకబడే ఉంటున్నాయి. చాలా చోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఉన్న వారినే సర్దుబాటు చేసింది. ఇది పూర్తి స్థాయిలో కాకపోవడంతో కొన్నిచోట్ల గణితం, సామాన్య శాస్త్రం, జీవశాస్త్రం లాంటి సబ్జెక్టులు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేరు. ఇలాంటి చోట పిల్లలకు నాణ్యమైన చదువు అందడం లేదు. విద్యపై రూ.70 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెబితే సరిపోతుందా? ఉపాధ్యాయులు లేకుండా ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న వినిపిస్తోంది.
పాఠశాల స్థాయిలో ఉత్తుత్తి పరీక్షలే..
విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలను సైతం చూచిరాత పరీక్షలుగా ప్రభుత్వం మార్చేసింది. ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులు లేక వాట్సప్ గ్రూపుల్లో పంపించడం, ముద్రించిన పత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం వైకాపా ప్రభుత్వంలో సాధారణంగా మారిపోయింది. ప్రశ్నపత్రాల లీకేజీని సైతం ప్రభుత్వం సమర్థించుకునే స్థాయికి దిగజారింది. ప్రశ్నపత్రం లీక్ అయినా ఏమీకాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారంటే బడుల్లో పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అనుత్తీర్ణులైన వారికి రీఅడ్మిషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా అభ్యర్థుల నుంచి స్పందన రాలేదు. రీ-అడ్మిషన్లు తీసుకున్న వారు అన్ని సబ్జెక్టులూ రాయాలనే నిబంధన పెట్టడం, తరగతులకు హాజరు కావాలని చెప్పడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రమే ఫీజులు చెల్లించారు. గతంలో ఫెయిల్ అయి ప్రైవేటుగా పరీక్షలు రాసిన 71,500 మందిలో 41.08శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
ఆగని సున్నా ఫలితాలు..
పదోతరగతిలో సున్నా ఫలితాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్కరు కూడా ఉత్తీర్ణులుకాని పాఠశాలల సంఖ్య తగ్గుతున్నా ఇంకా వాటి సంఖ్య కొనసాగుతోంది. గత ఏడాది తొమ్మిది ప్రభుత్వ బడుల్లో ఒక్కరూ పాస్ కాకపోగా.. ఈ ఏడాది ఒక పాఠశాలలో ఎవరూ ఉత్తీర్ణులు కాలేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటీ చెంచుగూడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయగా.. ముగ్గురూ ఫెయిల్ అయ్యారు. చెంచుగూడెంలో అక్షరాస్యత తక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. కానీ, అధికారులు పట్టించుకోకపోవడంతో సున్నా ఫలితాలు వచ్చాయి. మొత్తం ఈ పాఠశాలలో నలుగురు విద్యార్థులు పదిలో ఉండగా.. ఒకరు పరీక్షలకే హాజరు కాలేదు. చెంచుల విద్యపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ఎలా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మరో 3 ఎయిడెడ్ బడుల్లోనూ ఒక్కరూ పాస్ కాలేదు.
గతం కంటే తక్కువే..
రాష్ట్రంలో 2019కి ముందుతో పోలిస్తే పదో తరగతి పరీక్షల ఫలితాలు తగ్గాయి. 2019లో 94.88శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 86.69 శాతం మంది పాస్ అయ్యారు. గత మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతున్నా 2019కు ముందున్న స్థాయిలో విద్యార్థులు పాస్ కావడం లేదు. 2015 నుంచి 2019 వరకు 91 శాతానికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2020, 2021లో కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. అందరినీ పాస్ చేశారు. 2022 నుంచి క్రమంగా పెరుగుతున్నా 2019 ముందు కంటే ఎక్కువ ఉత్తీర్ణత లభించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా