ఏం చేశారని జిల్లాకొస్తున్నారు?
తెల్లారిలేస్తే 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని సీఎం జగన్ డబ్బా కొట్టుకుంటారు. అయిదేళ్లలో మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటేనే మీ బిడ్డకు మద్దతివ్వండని ముఖంలో అమాయకత్వం ప్రదర్శిస్తూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారు.
తెదేపా ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేశారు..
రూపాయి డబ్బులివ్వకుండా వాటిని పక్కనెట్టేశారు
గత ఎన్నికల్లో నమ్మకంతో గెలిపిస్తే ఇలాగేనా చేసేది?
ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లడుగుతారు?
నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్
అన్నదాతలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుంది. ప్రభుత్వాలు బలంగా ఉంటాయి. రాజశేఖరరెడ్డి బిడ్డ అధికారంలోకి వస్తే తోటపల్లి కుడి, ఎడమ కాలువలు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా
2018లో విజయనగరం జిల్లాలో నిర్వహించిన పాదయాత్రలో జగన్ రైతులకు ఇచ్చిన హామీ ఇది.
ఈనాడు-అమరావతి, విజయనగరం: తెల్లారిలేస్తే 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని సీఎం జగన్ డబ్బా కొట్టుకుంటారు. అయిదేళ్లలో మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటేనే మీ బిడ్డకు మద్దతివ్వండని ముఖంలో అమాయకత్వం ప్రదర్శిస్తూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు పాదయాత్రలో హామీలు కురిపించిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. గత తెదేపా ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేసి హడావుడి చేశారు తప్ప పనుల్లో ముందడుగు లేదు. కీలకమైన తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులు చేస్తామని చెప్పి గత తెదేపా హయాంలో మంజూరు చేసిన పనులే నిలిపేశారు. ‘ఎన్నికలకు ఆర్నెల్ల ముందు టెంకాయ కొడితే మోసమంటారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు’ అంటూ సూక్తిముక్తావళి వినిపించిన జగన్.. నాలుగేళ్లపాటు జాప్యం చేసి ఎన్నికలకు ఏడాది ముందు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు శంకుస్థాపన చేశారు. దీన్ని ఏం చిత్తశుద్ధి అంటారో ఆయనకే తెలియాలి. ఇదీ గత సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టే. ఈపాటికే భవన నిర్మాణం పూర్తి కావలసిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోని వేరొక చోటుకు మార్చేసి భ్రష్టు పట్టించారు. రైతులకు సాగు, విజయనగరం ప్రజలకు తాగునీరు అందించే తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టునూ పాడుబెట్టారు. కీలకమైన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా పక్కనపెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఏం అభివృద్ధి చేశారని చెప్పడానికి జిల్లాకు మళ్లీ వస్తున్నారు? ఏం చెప్పినా తలూపుతూ ప్రజలు వింటారన్న ధీమా? కల్లబొల్లి కబుర్లు చెప్పి మరోసారి మోసం చేయాలనుకుంటున్నారా?
తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి నిధులివ్వకుండా రైతులకు దగా
నాగావళిపై తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రాజెక్టుపై సమీక్షించే తీరిక సీఎంకే కాదు.. జిల్లా మంత్రులకూ లేకపోయింది. ఇప్పటికీ పునరావాస సమస్యలు వెంటాడుతున్నాయి. అసంపూర్తి పనులు వెక్కిరిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నాగావళిపై తోటపల్లి వద్ద జలాశయం నిర్మాణానికి తెదేపా హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీంతోపాటు తోటపల్లి రెగ్యులేటర్ కింద సాగవుతున్న 64 వేల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలోని 132 గ్రామాల పరిధిలో 64,036 ఎకరాలకు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 155 గ్రామాల్లో 67,912 ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా మరో పది వేల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఆ తరువాత వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)లో చేర్చినా పనులు ముందుకెళ్లలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.480 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెరిగింది. 2014-19 మధ్య తెదేపా హయాంలో ప్రాజెక్టు పనులకు రూ.287 కోట్లు వెచ్చించారు. 2019 నుంచి వైకాపా ప్రభుత్వం రూ.465 కోట్లు కేటాయించి రూ.61 కోట్లే వెచ్చించింది.
తారకరామతీర్థసాగర్ను అటకెక్కించారు
తారకరామతీర్థసాగర్ పనులు రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని 2020 డిసెంబరులో సీఎం జగన్ హామీనిచ్చి మాట తప్పారు. పెండింగ్ పనుల పూర్తికి రూ.620 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి అరకొరగా రూ.50 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లో 24,710 ఎకరాలకు సాగు నీరు, విజయనగరానికి తాగునీరు అందించేలా తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టును రూపొందించారు. గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై బ్యారేజీ, కుమిలిలో జలాశయం పనులు పూర్తి కాలేదు. మిగిలిన భూసేకరణ, పునరావాస కార్యకలాపాలపై నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు రెండు వేల మందికిపైగా ఉన్నారు. రైతులతోపాటు ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోయారు. గత ఎన్నికల్లో ప్రస్తుత నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైకాపా అధికారంలోకి వస్తే నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయిస్తానని మోసం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఇటీవల సారిపల్లి వెళ్లిన ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ను నిలదీశారు.
గాల్లోనే భోగాపురం జాతీయ విమానాశ్రయం చక్కర్లు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను జగన్ ప్రభుత్వం నాలుగేళ్లు పక్కనపెట్టి ఎన్నికలకు ఏడాది ముందు హడావుడి చేసింది. విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో పూర్తి చేయాలని తెదేపా హయాంలో నిర్ణయించారు. 2019 ఫిబ్రవరి 14న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైకాపా సర్కారు సుమారు నాలుగేళ్లపాటు దీని ఊసెత్త లేదు. ఎట్టకేలకు గతేడాది మే 3న ముఖ్యమంత్రి జగన్ విమానాశ్రయ పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం సేకరించిన సుమారు 2,700 ఎకరాల్లో 500 ఎకరాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుని మిగిలిన 2,200 ఎకరాలను విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించారు. విమానాశ్రయానికి భూములిస్తే పరిహారంతోపాటు అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయి. నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం కొత్త ఇళ్ల పునాదుల పనులకే సరిపోలేదు. వలస వెళ్లిన వారికి, గ్రామాలు ఖాళీ చేసేనాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కల్పిస్తామనీ మోసం చేశారు.
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి గ్రహణం
విభజన చట్టంలో రాష్ట్రానికి దక్కిన ప్రతిష్ఠాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు సీఎం జగన్ నిర్వాకంతో ఇప్పటికీ పూర్తి కాలేదు. తెదేపా హయాంలో రూపొందించిన ప్రణాళికను యథాతథంగా అమలుచేసి ఉంటే ఈపాటికే భవనం అందుబాటులోకి వచ్చేది. తెదేపా హయాంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లిలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. 526 ఎకరాలు సేకరించి శంకుస్థాపన చేశారు. భూమి చుట్టూ రూ.10 కోట్లతో ప్రహరీ నిర్మించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వర్సిటీ ఏర్పాటు విషయంలో సీఎం జగన్ అక్కసుతో వ్యవహరించారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన చోట కాకుండా గిరిజన ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పి మెంటాడ మండలం కుంటినవలస సమీపంలో గతేడాది ఆగస్టు 25న కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్తో కలిసి శంకుస్థాపన చేశారు. మళ్లీ భూములు సేకరించి రూ.కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో వైకాపా కీలక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై పరిహారం సొమ్ము పక్కదారి పట్టించారు. శంకుస్థాపన జరిగినా పనుల్లో ముందడుగు పడలేదు. తెదేపా హయాంలో రూ.525.08 కోట్లతో వేసిన అంచనా వ్యయం.. పనుల్లో జాప్యంతో రూ.834 కోట్లకు పెరిగింది. కొత్తవలస మండలంలో గుర్తించిన ప్రాంతం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనుకూలమేనని కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ స్థల ఎంపిక కమిటీ చెప్పినా అక్కడినుంచే మార్చేందుకే సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో రెల్లిలో సేకరించిన స్థలంలో ప్రహరీ నిర్మాణానికి వెచ్చించిన రూ.10 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు