హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు.
మ్యానిఫెస్టోను బైబిల్తో పోల్చి బీరాలు పలికిన జగన్
క్రైస్తవులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయని వైనం
ఓటు బ్యాంకు అంటూనే పోటు వేసిన దుర్మార్గ ప్రభుత్వమిదీ..
ఐదేళ్లలో 199 మందికి మాత్రమే పెళ్లికానుక
మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేమంటున్న మైనారిటీలు
ఈనాడు, అమరావతి
వారూ వీరూ అనే తేడా లేదు..
వంచనలో ఆయన్ను మించిన వారే లేరు..
హామీల పేరిట అరచేతిలో స్వర్గం చూపించారు..
వాటి అమలులోనూ వారిని ‘మైనారిటీలు’గానే చూశారు..
ఏ రకంగానూ ఆదుకోకుండా మోసం చేశారు..
గతమెంతో ఘనమనుకునేలా పాలన సాగించారు.
పెళ్లికానుక హుళక్కే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఆడపిల్లల వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి తెదేపా ప్రభుత్వం పెళ్లికానుక పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే క్రైస్తవ యువతుల వివాహాలకు కూడా రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. దీనికోసం ప్రత్యేకంగా కల్యాణమిత్రలను నియమించి మరీ.. పాలనా కాలంలో దాదాపు 5 వేల మందికి లబ్ధి చేకూర్చింది. పెళ్లికానుక ఆర్థికసాయాన్ని పెంచుతామని మ్యానిఫెస్టోలో పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక దాన్ని ఎగ్గొంట్టేందుకు ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నింటినీ ప్రయోగించారు.
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. తనకు ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని భావించిన వారి విషయంలోనే ఇంత కర్కశంగా వ్యవహరించారంటే.. ఆయన అసలు నైజం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన హామీల్లో ఏ ఒక్కటీ సరిగ్గా నెరవేర్చకుండానే.. 99 శాతం అమలు చేశామని నిస్సిగ్గుగా చెబుతుండటం జగన్కే చెల్లింది.
పాస్టర్లని బెంబేలెత్తించారు..
ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందంటే ఎవరైనా ముందుకువస్తారు. కానీ, పాస్టర్లకు గౌరవవేతనం ఇస్తామన్నా ‘మాకొద్దు బాబోయ్..’ అని వారితోనే అనిపించిన ఘతన జగన్కే దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మందికిపైగా పాస్టర్లు ఉంటే దరఖాస్తులు 9 వేలకు మించలేదు. గౌరవవేతనం పేరుతో చర్చిలకు సంబంధించిన సమస్త వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానమే దీనికి కారణం. పోనీ దరఖాస్తు చేసుకున్న వారికైనా సక్రమంగా వేతనాన్ని విడుదల చేస్తున్నారా అంటే.. అదీ లేదు.
ఆర్థిక సాయం రెట్టింపు చేస్తామని..
తెదేపా ప్రభుత్వం తొలిసారిగా 2016-17లో జెరూసలెం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించి అమలు చేసింది. ఏటా రూ.5 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయింపులతోపాటు ఖర్చూ చేసింది. అధికారంలోకి వస్తే దీన్ని రెట్టింపు చేసి అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు 2019 నవంబరులో ఉత్తర్వులు ఇచ్చినా కరోనా పేరుతో రెండేళ్లు చిల్లిగవ్వా ఇవ్వలేదు. 2022-23 బడ్జెట్లో రూ.2.50 కోట్లు, 2023-24లో రూ.1.50 కోట్లు ఇచ్చారు. ఆర్థికసాయం పెంచినట్టే పెంచి, యాత్రికులు ఎక్కువగా వెళ్లకుండా నిధులకు కోత పెట్టారన్నమాట.
సాయాన్ని కాదు జాప్యాన్ని పెంచారు..
2019 జూన్లో జగన్ అధికార పీఠంపై ఎక్కిన నాటి నుంచే అధికారులు పెళ్లికానుక ఆర్థికసాయం కోసం క్రైస్తవుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా.. అర్హులకు ఆర్థికసాయం విడుదల చేయలేదు. దాంతో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో 2020 ఏప్రిల్ నుంచి పథకాన్ని అమలు చేస్తామని 2019 సెప్టెంబరులో జీవో విడుదల చేశారు. అధికారులేమో 2020 ఏప్రిల్ వరకు దరఖాస్తులు తీసుకున్నారు. తీరా ఏప్రిల్ వచ్చే నాటికి కరోనా వైరస్ వ్యాప్తి కావడంతో దరఖాస్తులను నిలిపివేశారు. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ప్రభుత్వం పథకాన్ని అమల్లోకి తీసుకురాలేదు. చివరికి కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో సర్కారు మళ్లీ కొత్తగా జీవో ఇచ్చింది. 2022 అక్టోబరు నుంచి అమలు చేస్తామని అందులో ప్రకటించింది. అది కూడా మూడు నెలలకోసారి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి.. ఇప్పటివరకు 199 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చింది. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు రూ.లక్ష కాకుండా.. తెదేపా ప్రభుత్వం ఇచ్చినట్లు రూ.50 వేలతోనే సరిపెట్టింది.
శాశ్వత మ్యారేజ్ లైసెన్స్ విధానమూ రద్దు
క్రైస్తవ వివాహాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం పాస్టర్లకు లైసెన్స్ జారీ చేయాలి. తెదేపా ప్రభుత్వంలో ఒకసారి ఈ లైసెన్స్ తీసుకుంటే శాశ్వతంగా అనుమతి ఉండేది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ లైసెన్స్ చెల్లుబాటును మూడేళ్లకు కుదించారు. దీంతో ప్రతిసారి వారు రెన్యువల్ చేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
బీమా అమలులోనూ కుయుక్తులే..
తెదేపా ప్రభుత్వంలో ఏ వర్గానికైనా బీమా పథకం పక్కాగా అమలయ్యేది. క్రైస్తవ కుటుంబంలో 18ఏళ్లు పైబడిన వారు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.5 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించేవారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు బీమా మిత్రలనూ నియమించారు. జగన్ అధికారంలోకి రాగానే.. కుటుంబంలో ఆదాయం సమకూర్చేవారు ప్రమాదవశాత్తు మరణిస్తేనే ఆర్థికసాయం అందిస్తామని స్పష్టం చేశారు. పాస్టర్లకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చినా.. జగనన్న కాలనీల్లోనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సరిపెట్టారు.
‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’నూ ఎగ్గొట్టారు
చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ప్రహరీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ కింద తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య భారీగా నిధులు కేటాయించింది. గతంలో ఇచ్చే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచింది. ఈ నిధులు విడుదల కావాలంటే ముందస్తుగా లబ్ధిదారు చెల్లించాల్సిన 10 శాతం వాటాను కూడా మినహాయించింది. ఇలా ఐదేళ్ల కాలంలో 337 చర్చిలకు రూ.36 కోట్లు అందించింది. మరో 600 చర్చిలకు అనుమతులిచ్చి.. నిధులనూ కేటాయించింది. జగన్ అధికారంలోకి రాగానే ఆ 600 చర్చిల అనుమతులు రద్దు చేసింది. గత ఐదేళ్లలో పట్టుమని పది ప్రార్థనా మందిరాలకు నిధులు మంజూరు చేయలేదు. దాదాపుగా 350కిపైగా దరఖాస్తులు పెండింగ్లోనే పడి ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!