గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు.
విచ్చలవిడిగా ప్రకృతి వనరుల విధ్వంసం
వివాదాల్లో ఉన్న భూములు కనిపిస్తే పాపం..
తట్టెడు మట్టి తవ్వాలన్నా.. ఏ పని చేయాలన్నా ఆయనే..
అనకాపల్లి జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి అరాచక పర్వమిదీ..
ఈనాడు, అమరావతి
ఆయన కొండలకు ‘కన్నా’లు వేసే ‘బాబు’..
అప్పనంగా భూములు దోచేసే ‘రాజు’..
అనుమతి కొంత.. తవ్వేస్తారు గ్రావెల్ అంతా..
సెజ్లోని పరిశ్రమల యజమానులను బెంబేలెత్తించడం..
ఇష్టానుసారం వసూళ్లకు పాల్పడటం..
వారి ఉత్పత్తులను ఆయన గోదాముల్లోనే పెట్టాలని ఆదేశం..
పారిశ్రామిక వ్యర్థాలు విక్రయించాలన్నా అనుమతి అవశ్యం..
కాదంటే గన్ను తీస్తారు.. గురి పెట్టి బెదిరిస్తారు..
ఆయనకు ఆయనే ‘పవర్ఫుల్’ అని ప్రకటించుకుంటారు.
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. అనకాపల్లికి జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ అధికార పార్టీ ప్రజాప్రతినిధి కూడా అదే చెప్పారు. కానీ, గెలిచిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కాకుండా ఆయన దృష్టంతా సొంత ఎదుగుదలపైనే నిలిపారు. ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ.. ‘నియోజకవర్గంలో నేనే పవర్ఫుల్’ అంటూ గల్లా ఎగరేస్తుంటారు. ‘కన్నా’ అని కోరినా.. ‘బాబూ’ అని బతిమిలాడినా వినేది లేదు.. వసూళ్లు ఆపేది లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే బూతుల పురాణం అందుకుంటారు. జిల్లాలో ఈ నాయకుడి దందా ఇంతా అంతా కాదు.
విశాఖ నగరానికి సమీపంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అది. అచ్యుతాపురం సెజ్ అక్కడే ఉంది. ఏటికొప్పాక బొమ్మలకు ప్రసిద్ధి. విస్తృత తీర ప్రాంతమూ ఉంది. ఇంతటి కీలక ప్రాంతంలో వివాదాస్పద భూములపై కన్నేసే ఆయన ఎలాగోలా వాటిని సొంతం చేసుకుంటారు. పారిశ్రామికవాడలో మట్టి పోయాలన్నా, ఇటుక పేర్చాలన్నా, ఆఖరికి పరిశ్రమల వ్యర్థాలు అమ్ముకోవాలన్నా ఈయనకు ముడుపులు చెల్లించాల్సిందే. లేకపోతే ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తారు. అయినా దారికి రాకపోతే అనుచరులతో దాడులు చేయిస్తారు. ప్రతిపక్షాలతో కలిసి సొంత పార్టీ నేతలే అఖిలపక్షం ఏర్పాటు చేసి మరీ ఆయన దందాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
భయపెట్టి భూములు బొక్కేశారు
ఎక్కడ ఏ భూమి వివాదం ఉందంటే అక్కడ వాలిపోతారీ నేత అనుచరులు. ఎవరిని ఎలా భయపెట్టి భూములను సొంతం చేసుకోవచ్చో ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఇటీవల చనిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడికి మొత్తం 40 ఎకరాల భూమి ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను భయపెట్టిన ఈ ప్రజాప్రతినిధి.. కేవలం నాలుగెకరాలు మాత్రమే ఆయన వద్ద ఉంచి, మిగిలినవి ఎకరా రూ.12 లక్షల చొప్పున కుమారుడి పేరిట రాయించుకున్నారు. గతంలో 22ఏ పరిధిలో ఉండేవన్న కారణం చూపి, ఆవసోమవారంలోని 8 ఎకరాలను సైతం తక్కువ ధరకే ఆయన నుంచి తీసేసుకున్నారీ నేత. ప్రస్తుతం ఆ 44 ఎకరాల భూముల విలువ రూ.100 కోట్లకు పైమాటే! అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల భూమినీ ప్రభుత్వానిదంటూ భయపెట్టి తక్కువ ధరకు లాక్కున్నారు. ఇలా ఆ నేత కుమారుడి పేరిట కొనుగోలు చేసిన భూములను ఆనుకొనే మరో 160 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. 22ఏ జాబితాలో ఉన్న వీటిపైనా ఈ నేత కన్నేశారు. రాంబిల్లి మండల పరిధిలో పేదలకు ప్రభుత్వం అందించిన వందల ఎకరాల ఎసైన్మెంట్ భూములకు సంబంధించి రికార్డుల్లో లబ్ధిదారుల పేర్లు ఉన్నా.. సాగులో మాత్రం ఆ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఇందుకు ప్రతిగా ఏటా లబ్ధిదారులకు ఎంతో కొంత ముట్టజెబుతున్నారు.
అక్రమ లేఅవుట్లు.. రూ. కోట్లు
భూములు అన్నా, కంకర అన్నా ఈయనకు ఎంతో ఇష్టం. ఆ మాటలు వినిపిస్తే చాలు గద్దలా వాలిపోతారు. అందిన కాడికి తన్నుకుపోతుంటారు. నియోజకవర్గంలో ఎక్కడ లే అవుట్ వేసినా, కొండల తవ్వకాలు జరిగినా అందులో ఈ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లే. అక్రమ లే అవుట్లు వేసిన వారి దగ్గర్నుంచి రూ.కోట్లలో కమీషన్లు దండుకుంటారు. చాలా ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన.. కన్ను పడితే కొండలు పిండి కావాల్సిందే.. భూములు హాంఫట్ కావాల్సిందే. అందుకు ఎదురుచెప్పేవారిని నయానో, భయానో లొంగదీసుకోవడంలోనూ ఆయనను మించిన ‘రాజు’ లేరు. రాంబిల్లి మండలంలో పెదకలవలాపల్లి, వేల్చూరు, పంచదార్ల, కొత్తూరు గ్రామాల్లో కొండలను గుల్లచేసి భారీగా కంకరను తరలించారు. అక్రమ తవ్వకాలు జరిగాయని నిర్ధారణ చేసిన గనుల శాఖ రూ.14 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించినా, ఒక్క రూపాయీ చెల్లించలేదు. ఆ ప్రాంతంలో ఎవరు గుత్తేదారులుగా ఉన్నా అవసరమైన కంకర ఈయనే సరఫరా చేస్తారు. నునపర్తి, నడింపల్లి గ్రామాలతో పాటు పోలవరం ఎడమ కాల్వ గట్టుపై ఉన్న కంకరను పూర్తిగా కొల్లగొట్టారు. అచ్యుతాపురం సెజ్లో ఓ టైర్ల కంపెనీ కొత్తగా స్థాపించారు. ఆ స్థలాన్ని చదును చేయగా వచ్చిన సుమారు లక్ష క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను ఈ నేతే విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గ్రావెల్ తరలింపునకు వీలుగా.. సెజ్ రక్షణ గోడను పగలగొట్టి మరీ ఈ వ్యాపారం కొనసాగించారు.
సొంత అభివృద్ధికే పరిశ్రమిస్తూ..
అచ్యుతాపురం సెజ్కి ఏ కంపెనీ వచ్చినా, ముందుగా ఈ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. కంపెనీకి అవసరమైన గ్రావెల్, మట్టి, ఇసుక, గోదాం ఇలా అన్ని అవసరాలనూ ఆయనే సమకూరుస్తారు. ట్రాన్స్కో సబ్ స్టేషన్ నిర్మాణ పనులను ఒక మంత్రి అనుచరుడు దక్కించుకోగా.. తన రాజ్యంలో ఆయన పెత్తనం ఏమిటంటూ ఏకంగా పనులనే అడ్డుకున్నారీ నేత. సెజ్లో ప్లైవుడ్ తయారు చేసే ఒక పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించి ఆ ఉత్పత్తులను తన గోదాంలోనే దాచుకోవాలని హుకుం జారీ చేశారు. అసలా గోదామే అక్రమ నిర్మాణమనే ఆరోపణలున్నాయి. అందులో ఆ పరిశ్రమ వారు సరకు దాచుకుని రూ.లక్షల్లో అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఫెర్రో పరిశ్రమ నుంచి వచ్చే ఫ్లైయాష్ (బూడిద) వ్యర్థాల అమ్మకాలూ ఈ నాయకుడి కనుసన్నల్లోనే సాగాలి. ఇటీవల ఈ బూడిద అమ్మకాల వ్యవహారంలో ఓ మంత్రి అనుచరులకు, నేత అనుచరులకు మధ్య బాహాబాహీ జరిగింది. అచ్యుతాపురం సమీపంలో మాజీ సైనికుడి భూమి తక్కువ రేటుకే కొనుగోలు చేశారు. ఆ భూముల చుట్టూ పంచాయతీ నిధుల నుంచి సీసీ రహదారులు నిర్మించి విలువ పెంచుకున్నారు. ఇప్పుడు అదే భూమిని ఆనుకొని జగనన్న స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణం జరిగేలా చూశారు. ఆ భూమి విలువను మరింత కొండెక్కించారు. పరిశ్రమల సీఎస్ఆర్ (సామాజిక బాధ్యత) నిధులను సైతం ఎక్కడ వినియోగించాలో ఈ నాయకుడే చెబుతారు. ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకూ ఈయన అనుచరగణమే గుత్తేదారు అవతారం ఎత్తుతుంది.
గన్నుతో బెదిరింపులు..
ఆ నేతను నమ్మి పారిశ్రామిక వాడకు భూములిచ్చిన వారు ఇంకా పూరి గుడిసెల్లోనే మగ్గుతున్నారు. ఆయన మాత్రం కొండకర్ల ఆవను ఆనుకొని భారీ అతిథిగృహం, విశాఖ నగరంలో దేవాదాయ భూములను ఆక్రమించి విశాలమైన ఇంటిని నిర్మించారని చెబుతుంటారు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని ఇంటికి వెళ్లి అడిగిన సెజ్లోని ఒక గుత్తేదారుడిపై ఏకంగా తుపాకి గురిపెట్టి.. చంపుతానని బెదిరించిన ఘనత ఈయనది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి