Uttarakhand Election Results 2022: ఉత్తరాఖండ్లో భాజపా విజయఢంకా
ఉత్తరాఖండ్లో పోరు హోరాహోరీగా ఉంటుందన్న అంచనాలు తారుమారయ్యాయి. ఈ పర్వత రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఘనవిజయం నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికార పగ్గాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్లో పోరు హోరాహోరీగా ఉంటుందన్న అంచనాలు తారుమారయ్యాయి. ఈ పర్వత రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఘనవిజయం నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికార పగ్గాలను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. 70 స్థానాల శాసనసభలో 47 సీట్లతో జయకేతనం ఎగరవేసింది. 21 ఏళ్ల ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలో అధికార పార్టీ మళ్లీ పీఠం దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ పరాజయం పాలయ్యారు. దేవభూమిగా పరిగణించే ఉత్తరాఖండ్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ సీఎంలు గెలిచిన చరిత్ర లేదు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ధామీ.. తన సొంత నియోజకవర్గం ఖటీమాలో 6,951 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి భువనచంద్ర కాప్రీ చేతిలో ఓడిపోయారు. ఉత్తరాఖండ్లో పాగా వేస్తామనుకున్న కాంగ్రెస్ ఘోరంగా చతికిల పడింది. ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను భాజపా మార్చిందంటూ ఆ పార్టీ చేసిన ప్రచారం ఓటర్లపై ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో విజయం సాధించింది. బహుజన్ సమాజ్ పార్టీకి రెండు, స్వతంత్రులకు రెండు దక్కాయి. పలు ఉచిత హామీలతో ఉత్తరాఖండ్ ఎన్నికల బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటూ దక్కలేదు. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతానన్న ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్కూ ఓటమి ఎదురైంది. లాల్కువా నియోజకవర్గంలో 17,359 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆప్ సీఎం అభ్యర్థి అజయ్ కోటియాల్కు గంగోత్రి నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ధరావతు కూడా దక్కకపోవడం విశేషం. ఈ సీటును భాజపా కైవసం చేసుకుంది.
* నిజానికి ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చడం భాజపాకు ప్రతికూలంగా మారుతుందని పార్గీ వర్గాలు భయపడ్డాయి. ప్రతిపక్షాలూ దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. పైగా గత ఏడాది జులైలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఇంత తక్కువ వ్యవధిలో పార్టీ యంత్రాంగాన్ని ధామీ ఎలా సన్నద్ధత చేస్తారన్న విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు భాజపాను విజయ తీరాలకు చేర్చాయని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరదాయినికి జగన్ శాపం
ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారో మంత్రి... ‘పర్సంటా అరపర్సంటా..’ అంటూ ఊగిపోయారు ఇంకో మంత్రి... 2021 జూన్ నాటికే అందుబాటులోకి తెస్తామన్నారు ముఖ్యమంత్రి... మార్చి పోతే సెప్టెంబరు తరహాలో.. ఆరు నెలలు, ఏడాది కాదు.. ఐదేళ్లు గడిచినా... పోలవరాన్ని పూర్తి చేయకపోగా నష్టం చేకూర్చారు! -
రైతన్న నెత్తిన శని.. జగనన్న!
రైతు భరోసా లేదు.. పంట బీమా లేదు.. మద్దతు ధరల్లేవు... కరవు సాయం లేదు.. ఉన్నదల్లా ఒక్కటే... మీ బిడ్డనంటూ ఊకదంపుడు.. నోరు తెరిస్తే... అబద్ధాలు దంచుడు! -
పంచాయతీల్లో పందేరానికి.. ‘నరేగా’ నిధులు
పోలింగ్కు తొమ్మిది రోజుల ముందు అస్మదీయులైన సర్పంచులకు జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ‘మెటీరియల్’ నిధులు గుమ్మరిస్తోంది. -
ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు?
దేశంలోని ఏ రాష్ట్రం ఇంతవరకూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు ఈ తరహా చట్టాన్ని చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా, పౌరుల స్థిరాస్తి హక్కులకు భంగం కలుగుతుందన్న అనుమానంతో విరమించాయి. -
1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలన అంతమై.. ఆంధ్రుల స్వర్ణాంధ్ర కల సాకారమవ్వాలని రాజధాని రైతులు ఆకాంక్షించారు. గడిచిన ఐదేళ్లలో అమరావతితో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదీ సంగతి!