Crime news: 133 ల్యాప్టాప్లు, 19 ఫోన్లు చోరీ.. మాజీ ఐటీ ఉద్యోగి అరెస్టు!
ఐటీ ఉద్యోగులు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు: ప్రముఖ ఐటీ నగరం బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడుతున్న నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఐటీ ఉద్యోగుల పేయింగ్ గెస్ట్ వసతి గృహాల నుంచి 133 ల్యాప్టాప్లు, 19 మొబైల్ ఫోన్లు, నాలుగు ట్యాబ్లను చోరీ చేసిన కేసులో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అని.. గతంలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసినట్టు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన ఈ ఎలక్ట్రానిక్ పరికరాల విలువ దాదాపు రూ.75లక్షలు ఉంటుందని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద వెల్లడించారు. గతంలో ఓ ఐటీ కంపెనీలో పనిచేసిన ఈ నిందితుడు.. పేయింగ్ గెస్ట్, బ్యాచిలర్ వసతి గృహాలకు తరచూ వెళ్లడం.. అక్కడి నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు మాయం చేసేవాడని తెలిపారు. అతడు చోరీ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లి మార్కెట్లో విక్రయించిన మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు దయానంద తెలిపారు. ఆ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు తెలిపారు. సెంట్రల్ డివిజన్లో ఎనిమిది కేసులు గుర్తించామని.. మిగతా పోలీస్ స్టేషన్లలో ఈ తరహా కేసులను పరిశీలిస్తున్నట్లు దయానంద తెలిపారు.
మరోవైపు, బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెట్టింగ్ రాకెట్ను ఛేదించారు. 11 చోట్ల దాడులు చేసి 13 మందిని అరెస్టు చేశారని దయానంద తెలిపారు. ఈ వ్యవహారంలో 11 కేసులు నమోదు చేసి.. నిందితుల నుంచి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!