Anantapur: నా చావుకు సీఎం జగనే కారణం.. లేఖ రాసి ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం

సీపీఎస్‌ రద్దు చేయలేదన్న ఆవేదనతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలం వద్ద జరిగింది.

Updated : 10 Dec 2023 17:20 IST

అనంతపురం: సీపీఎస్‌ రద్దు చేయలేదన్న ఆవేదనతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది. ఉరవకొండ మండలం చిన్న ముస్తూరుకు చెందిన ఉపాధ్యాయుడు మల్లేశ్‌  తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఐదు పేజీల లేఖ రాసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. జగన్‌ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. సీపీఎస్‌ రద్దు, 5వ తేదీకల్లా జీతాలివ్వడమే తన చివరి కోరిక అని లేఖలో ప్రస్తావించారు. సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి పెన్నఅహోబిలం ఆలయం పరిసరాల్లో విషపు గుళికలు మింగిన ఉపాధ్యాయుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లేశ్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని