Hyderabad: శౌచాలయంలో బంధించి మూగ మహిళపై అత్యాచారం

నగరంలోని హుమాయున్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. చెవిటి, మూగ మహిళపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.

Updated : 19 Aug 2023 10:22 IST

హైదరాబాద్‌: నగరంలోని హుమాయున్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. చెవిటి, మూగ మహిళపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి ఎదురుగా ఉండే సాయి అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను శౌచాలయంలో బంధించి అత్యాచారం చేశాడు. మహిళ భర్త కూడా దివ్యాంగుడే. తన తల్లిని తీసుకుని అతను బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడిన సాయి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

బాధితురాలు మూగ కావడంతో అరవలేకపోయింది. ఆపై శౌచాలయంలోనే మహిళను ఉంచి గడియపెట్టి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి గమనించిన భర్త.. ఏమైందని అడగడంతో ఆమె జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో హుమాయున్‌ నగర్ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు. గతంలోనూ అతని చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని