Bengaluru: గోనె సంచిలో మృతదేహం.. అత్యంత అరుదైన రీతిలో మృతి
ఆయనో వృద్ధుడు.. నిర్జన ప్రదేశంలో ఆయన మృతదేహం దొరకడంతో హత్య కావచ్చనుకున్నారు పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరపగా అత్యంత అరుదైన రీతిలో ఆయన కన్నుమూసినట్లు తేలింది.
బెంగళూరు: ఆయనో వృద్ధుడు.. నిర్జన ప్రదేశంలో ఆయన మృతదేహం దొరకడంతో హత్య కావచ్చనుకున్నారు పోలీసులు.. లోతుగా దర్యాప్తు జరపగా అత్యంత అరుదైన రీతిలో ఆయన కన్నుమూసినట్లు తేలింది. పుట్టేనహళ్లి పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు జేపీనగర ప్రాంతంలో ఈ నెల 18న గోనె సంచిలో మూటకట్టి ఉన్న ఒక వృద్ధుడి మృతదేహం లభించింది. ఆరా తీస్తే ఆయన పేరు బాలసుబ్రహ్మణియన్ (67) అని తెలిసింది. వంటిపై గాయాలు లేకపోవడంతో ఎలా చనిపోయారో అర్థం కాలేదు. ప్రత్యర్థులు ఎవరూ లేరని తేలింది. పోలీసులు పట్టువదలకుండా దర్యాప్తు జరపగా అనూహ్యమైన కారణాలు వెలుగుచూశాయి. బాలసుబ్రహ్మణియన్ ఈ నెల 16న సాయంత్రం తన మనవడిని బ్యాడ్మింటన్ తరగతికి తీసుకు వెళ్లారు. సాయంత్రం ఫోన్ చేసి పనిపై బయటకు వెళుతున్నానని, చిన్నారిని ఇంటికి తీసుకు వెళ్లాలని ఇంట్లో వారికి ఫోన్ చేసి చెప్పారు. తర్వాత ఆయన ఆచూకీ తెలీలేదు. కుమారుడు సోమసుందర్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18న మృతదేహం దొరకడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయన కాల్డేటాను పరిశీలించగా, చివరిగా తన ఇంట్లో పని చేస్తున్న మహిళతో మాట్లాడినట్లు తెలిసింది. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తనకూ ఆయనకు వివాహేతర సంబంధం ఉందని అంగీకరించింది. తన భర్తకూ ఆ విషయం తెలుసని చెప్పింది. తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఆయన మరణించడంతో కంగారుపడిన ఆమె సోదరుడికి, భర్తకు ఫోన్ చేసి చెప్పింది. చివరకు మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి, దుప్పటిలో చుట్టి నిర్జన ప్రదేశంలో పడేసినట్లు వెల్లడించింది. విచారణ జరిపిన పోలీసులు ఆయన మృతికి గుండెపోటే కారణమని గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
మైనర్ బాలికతో తనకు జరిగే నిశ్చితార్థాన్ని అధికారులు ఆపారనే క్షణికావేశంలో ఓ యువకుడు ఆ బాలిక తల నరికి హత్య చేశాడు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్ కేసు’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. -
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
NEET exam: నీట్ పరీక్షలో ఓ టీచర్ అవకతవకలకు పాల్పడ్డాడు. అభ్యర్థులకు బదులు పరీక్ష రాసేందుకు వారితో రూ.10లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ఈత సరదా మిగిల్చిన విషాదం
వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు
తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. -
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. -
లారీ క్యాబిన్ ప్రత్యేక అరలో రూ.8.36 కోట్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద జాతీయ రహదారిపై పైపుల లారీలో తరలిస్తున్న రూ.8.36 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ కేసు నమోదు
వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్, 171-జీ, 505(2) రెడ్విత్ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. -
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
కదులుతున్న మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై 28 ఏళ్ల వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురైన ఘటనపై బాలుడు ఎక్స్ వేదికగా పోస్టులు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్