బెంగాల్‌లో భాజపా కార్యకర్తలపై బాంబు దాడి!

బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాంబు దాడి కలకలం సృష్టించింది. గోసబా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ బృందంపై నాటు బాంబు విసిరారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు.

Published : 06 Mar 2021 16:03 IST

 

కోల్‌కతా: బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాంబు దాడి కలకలం సృష్టించింది. గోసబా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ బృందంపై నాటు బాంబు విసిరారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అయితే దాడిలో గాయపడిన వారంతా భాజపా కార్యకర్తలుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. భాజపాకు చెందిన కార్యకర్తలు కొందరు శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిపై నాటు బాంబు విసిరారు. పేలుడు ధాటికి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారే చేశారని క్షతగాత్రుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బెంగాల్‌లో కార్మిక మంత్రి జాకీర్‌ హుస్సేన్‌పైనా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని