తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

విశాఖపట్నంలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శంకర్రావు బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 11 Apr 2024 11:24 IST

గురుద్వారా: విశాఖపట్నంలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శంకర్రావు బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన పోలవరపు శంకర్రావు ద్వారకానగర్‌లోని జ్యోతి బుక్‌ డిపో సమీపంలోని ఐవోబీ బ్యాంక్‌ వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం ఉదయం 5 గంటలకు విధులకు హాజరయ్యారు. 6 గంటల సమయంలో తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతీపై కాల్చుకున్నారు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో వచ్చిన శబ్దంతో సమీపంలో ఉన్న సిబ్బంది వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. దీంతో వారు ద్వారకా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ద్వారకానగర్‌ ఏసీపీ రాంబాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని