Mumbai: 27 అంతస్తుల నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

Published : 24 Jan 2024 21:21 IST

ముంబయి: ముంబయి శివారులోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోరేగావ్‌లోని 27 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగడం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో ఆస్తి నష్టంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అన్‌మోల్‌ ప్రైడ్‌ భవనంలో 27 అంతస్తులు ఉండగా.. 25, 26వ అంతస్తుల్లో  బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు ఎనిమిది ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని