Fire accident: పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఎంఎస్‌ఎన్‌ రెండో యూనిట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Published : 21 Nov 2023 21:24 IST

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఎంఎస్‌ఎన్‌ రెండో యూనిట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టోరేజీ విభాగంలో రసాయన డ్రమ్ములు నిల్వ ఉంచడంతో అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించింది. రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు దావానంలా వ్యాపించాయి. ఆరు అగ్నిమాపక శకటాలతో మంటలార్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్టోర్‌లో ఎంతమంది కార్మికులు ఉన్నారనేదానిపై ఇంక స్పష్టత రాలేదు. రసాయన డ్రమ్ములు పేలుతుండటంతో మంటలు అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బంది కష్టతరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని