Maharashtra: ప్రేమ కోసం ప్రియుడి మాటలు నమ్మి.. లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి!
ప్రేమ కోసం ఏకంగా లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తిని ప్రియుడు మోసం చేసిన సంఘటన ముంబయిలో వెలుగుచూసింది. నగరానికి చెందిన జమాల్ షేక్(31) అనే వ్యక్తి.. ఫుర్ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించాడు.
ముంబయి: ప్రేమ కోసం ఏకంగా లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తిని ప్రియుడు మోసం చేసిన ఘటన ముంబయిలో వెలుగుచూసింది. నగరానికి చెందిన జమాల్ షేక్(31) అనే వ్యక్తి.. ఫుర్ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించాడు. ప్రేమ కోసం, ప్రియుడి కోరిక మేరకు జమాల్.. లింగమార్పిడి చేసేకొని శిల్పగా మారాడు. 16 ఏళ్ల క్రితం కోల్కతా నుంచి ముంబయికి వచ్చి స్థిరపడిన జమాల్.. ఏడాదిన్నర క్రితం ఫుర్ఖాన్తో ప్రేమలో పడ్డాడు. లింగ మార్పిడి చేసుకుంటే.. ఎంతో ప్రేమగా చూసుకుంటానని ఫుర్ఖాన్.. జమాల్ను నమ్మించాడు. ఆ మాటలను నమ్మిన జమాల్.. రూ.2 లక్షలు వెచ్చించి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే ఫుర్ఖాన్ తనను మోసగించి దిల్లీకి పారిపోయాడని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. అతడికి అవసరమున్న ప్రతిసారి డబ్బు ఇచ్చినట్టు తెలిపాడు. ఫుర్ఖాన్కు ఇంతకుముందే వివాహం జరిగినా.. తనను ప్రేమించానని చెప్పడంతో నమ్మి మోసపోయినట్టు జమాల్ తెలిపాడు. తల్లిదండ్రులు కూడా తనను స్వీకరించలేకపోతున్నారని వివరించాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా.. కేసు నమోదు చేయడం లేదని జమాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
గుజరాత్లోని దాహోద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
కేరళలో ఏనుగు దాడి.. కెమెరామన్ దుర్మరణం
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్గా, కాలమిస్ట్గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
-
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..