కొండారెడ్డి బురుజుపై కూటమి జెండా!
కరవుసీమ కర్నూలులో గత ఎన్నికల్లో వైకాపాకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు.. ఈసారి కూటమి వైపు చూస్తున్నారు. అభివృద్ధి మచ్చుకైనా లేదన్న అసంతృప్తి, రహదారులు అధ్వానంగా ఉన్నాయన్న ఆగ్రహం, గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం కష్టాలు పడాల్సి వస్తోందన్న ఆక్రోశం..
కర్నూలులో తాగు, సాగునీటికి కటకట.. అభివృద్ధి వెలవెల
ప్రభుత్వ పనితీరుపై జనంలో వ్యతిరేకత
పథకాలనే నమ్ముకున్న వైకాపా
ఎమ్మిగనూరు, కర్నూలు స్థానాల్లో తెదేపా దూకుడు
జిల్లాలో బీసీలకు కూటమి పెద్దపీట
కర్నూలు నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
కరవుసీమ కర్నూలులో గత ఎన్నికల్లో వైకాపాకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు.. ఈసారి కూటమి వైపు చూస్తున్నారు. అభివృద్ధి మచ్చుకైనా లేదన్న అసంతృప్తి, రహదారులు అధ్వానంగా ఉన్నాయన్న ఆగ్రహం, గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్ల కోసం కష్టాలు పడాల్సి వస్తోందన్న ఆక్రోశం.. అధిక శాతం మంది ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో కూటమి మంచి ఫలితాలను సాధించే అవకాశం కనిపిస్తోంది. చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమీ లేని వైకాపా.. సంక్షేమ పథకాలనే నమ్ముకొని ప్రచారం సాగిస్తోంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. మూడు పార్టీల శ్రేణులు కలిసికట్టుగా ముందుకెళితే కర్నూలు కొండారెడ్డి బురుజు మీద కూటమి జెండా ఎగరేయవచ్చని భావిస్తున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లతో మాట్లాడినప్పుడు సర్కారు తీరుపై వ్యతిరేకత వ్యక్తమైంది. కర్నూలును న్యాయ రాజధాని అని ఐదేళ్లలో చేసింది శూన్యమని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కనిపించే ఈ జిల్లాలో.. కూటమి బీసీలకు పెద్దపీట వేసింది. తెదేపా కర్నూలు లోక్సభకు కురుబ, మంత్రాలయంలో వాల్మీకి, పత్తికొండలో ఈడిగ సామాజికవర్గాల అభ్యర్థులను బరిలోకి దింపింది. భాజపా ఆదోని నుంచి వాల్మీకి సామాజికవర్గానికి అవకాశమిచ్చింది. వైకాపా మంత్రాలయం, ఆదోనిలో పాత అభ్యర్థులైన రెడ్డి సామాజికవర్గం నేతలు అదీ అన్నదమ్ములనే బరిలోకి దించింది. వైకాపా కర్నూలు లోక్సభ అభ్యర్థితోపాటు ఎమ్మిగనూరు, ఆలూరు అసెంబ్లీ స్థానాలకు బీసీలకు టికెట్లిచ్చింది. కర్నూలు లోక్సభ స్థానంలో ప్రధాన పార్టీల నుంచి రెడ్లు లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.
కర్నూలు.. భరతుడికి పట్టం?
ఐదేళ్లుగా కర్నూలు అభివృద్ధికి నోచుకోలేదు. రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణంలో అధికార పార్టీ వైఫల్యంతో ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. వైకాపా సిటింగ్ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ను పక్కనబెట్టి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్కు టికెట్ ఇచ్చింది. పోయినసారి వైకాపా ఉద్ధృతిలోనూ కేవలం 5,353 ఓట్ల తేడాతో ఓడిన టీజీ భరత్ను మరోసారి తెదేపా బరిలో దింపింది. విద్యావంతుడు, సౌమ్యుడన్న పేరు, సామాజిక సేవా కార్యక్రమాలు భరత్కు ప్రజల్లో ఆదరణ పెంచాయి. నగరాభివృద్ధికి ఆయన ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందించి ప్రచారం చేస్తున్నారు. నగరంలో ముస్లిం ఓటర్లు 80 వేల మంది వరకు ఉన్నారు. భరత్ తండ్రి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్కు ముస్లింలతో ఉన్న విస్తృత పరిచయాలు కలిసొస్తున్నాయి. ఇటీవల ఒక ముస్లిం కార్పొరేటర్ తెదేపాలో చేరారు. మరికొంత మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతియాజ్ స్థానికేతరుడు కావడం, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ను ప్రచారానికి దూరంగా ఉంచుతుండటంతో స్థానిక ముస్లిం నేతలు సహకరించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో 58 శాతం ఓట్లే పోలయ్యాయి. ఈసారి పోలింగ్ శాతం పెంచుకుంటే భరత్ గెలుపు ఖాయమన్న అంచనాలున్నాయి. ‘న్యాయ రాజధాని చేస్తామని ఐదేళ్లు ఒరగబెట్టిందేమీ లేదు.. మళ్లీ జగన్ వస్తే రాష్ట్రం ఇంకా అధ్వానంగా మారుతుంది. మా కర్నూలులో అభివృద్ధి అసలే ఉండదు’ అని ఓ వ్యాపారి వ్యాఖ్యానించారు.
ఆదోని: అరాచకాలు ఘనం.. అభివృద్ధి శూన్యం
కూటమి పొత్తులో భాగంగా ఆదోని టికెట్ అనూహ్యంగా భాజపాకు దక్కింది. గత రెండు ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన సాయిప్రసాద్రెడ్డి మూడోసారి బరిలో దిగారు. భాజపా అభ్యర్థిగా డాక్టర్ పీవీ పార్థసారథి తలపడుతున్నారు. సాయిప్రసాద్రెడ్డి పదేళ్లలో ఆదోనిని ఏమీ అభివృద్ధి చేయలేదని ఓటర్లు మండిపడుతున్నారు. వ్యాపార కేంద్రంగా, చినబొంబాయిగా పేరు తెచ్చుకున్న ఆదోనిలో ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా ఉన్నాయి. ఫ్లైఓవర్లపైనా భారీ గుంతలున్నా పట్టించుకోని జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘రైతులను చాలా చిన్నచూపు చూశారు. ఈసారి జగన్ పార్టీని పాతరేస్తాం’ అని ఆదోని మండలం మదిరె గ్రామానికి చెందిన ఓ రైతు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆదోని మున్సిపాలిటీలోని 70 వేల మంది ఓటర్లలో సుమారు 55 వేల మంది ముస్లింలే. దీంతో ఈ సీటు భాజపాకు కేటాయించగానే గెలుపు తమదేనని వైకాపా నేతలు వ్యాఖ్యానించారు. అయితే సాయిప్రసాద్రెడ్డి దౌర్జన్యాలు, భూకబ్జాలు, సెటిల్మెంట్లపై భాజపా అభ్యర్థి పార్థసారథి తన వాగ్ధాటితో జనాల్లోకి దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలను వేధించి ఆత్మహత్యలకు పాల్పడేలా చేసింది వైకాపానా? భాజపానా? అని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో పట్టున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ముస్లింల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 12 వేలకుపైగా ఓట్లు తెచ్చుకున్న జనసేన బలం కలిసొస్తుందని నమ్ముతున్నారు.
ఎమ్మిగనూరులో ‘జయ’హో!
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి బీవీ మోహన్రెడ్డి అభివృద్ధి మార్కును ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. తెదేపా నుంచి ఆయన తనయుడు బీవీ జయనాగేశ్వర్రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా.. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారన్న భావన ఓటర్లలో వ్యక్తమవుతోంది. ఓడినా గెలిచినా ఎమ్మిగనూరును వదలవద్దని తండ్రి మోహన్రెడ్డి తన వద్ద మాట తీసుకున్నారని, అందుకే సునాయాసంగా గెలిచే స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ కోరినా వెళ్లలేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. ‘గత ఎన్నికల్లో జగన్కు ఓసారి అవకాశమివ్వాలని వైకాపా అభ్యర్థికి ఓటేశాం. ఆయన పాలనలో చేసిందేమీ లేదు. అందుకే ఈసారి జయనాగేశ్వర్రెడ్డిని గెలిపిస్తాం’ అని ఎమ్మిగనూరులో ఎరువుల దుకాణానికి వచ్చిన పలువురు రైతులు తెలిపారు. జయనాగేశ్వర్రెడ్డి గెలవాలని కోరుకుంటున్నామని కొంత మంది యువకులు అభిప్రాయపడ్డారు. ‘ఒకప్పుడు ఎమ్మిగనూరు మున్సిపాలిటీ అంటే శుభ్రతకు మారుపేరు. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే’ అని ఓ దుకాణ యజమాని అసంతృప్తి వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కాదని వైకాపా మాజీ ఎంపీ బుట్టా రేణుకకు టికెటిచ్చింది. ఆమె స్థానికురాలు కాదన్న ప్రచారం, చెన్నకేశవరెడ్డి సహకరించరన్న విశ్లేషణలు వైకాపాను కంగారుపెడుతున్నాయి. రేణుక డబ్బులు వెదజల్లి అయినా గెలవాలని చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
మంత్రాలయం: అభివృద్ధి లేదు.. అరాచకమే
కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లో ఒకటైన మంత్రాలయంలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన బాలనాగిరెడ్డి మరోమారు వైకాపా తరఫున పోటీపడుతున్నారు. తెదేపా వాల్మీకి సామాజికవర్గానికి చెందిన రాఘవేంద్రరెడ్డిని బరిలోకి దింపింది. ఇక్కడ వాల్మీకి సామాజికవర్గ ఓటర్లు దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు. తమ సామాజికవర్గానికి రాకరాక అవకాశం వచ్చిందన్న భావనతో వాల్మీకులు ఏకతాటిపైకి వస్తున్నారు. బాలనాగిరెడ్డిని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా కనీస అభివృద్ధి లేదని, రోడ్లు దారుణంగా ఉన్నాయని, తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉపాధి లేక మంత్రాలయం నియోజకవర్గం నుంచి వేల మంది గుంటూరు, ఇతర జిల్లాలకు వలసపోతున్నారు. ఎమ్మెల్యే తమ అనుచరులతో భూదందాలు చేశారని, 2006లో పేదలకు ఇచ్చిన 9 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ‘ఒకసారి అధికారం పోతే అన్నీ చక్కబడతాయి. ఈసారి మా బీసీలను గెలిపించుకుంటాం’ అని ఎరిగేరి గ్రామానికి చెందిన గొర్రెలకాపరి ఒకరు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పర్యటించినప్పుడు తాము అధికారంలోకి వస్తే కౌతాళంలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం కలిసివస్తాయని తెదేపా ఆశాభావంతో ఉంది.
కోడుమూరు.. ఎవరిదో జోరు?
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన కోడుమూరులో ఈసారి ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ కొత్తవారే. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన సుధాకర్ను కాదని, ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు డాక్టర్ సతీష్ను బరిలో నిలిపింది. తెదేపా బొగ్గుల దస్తగిరికి టికెట్ ఇచ్చింది. ఇక్కడ అభ్యర్థులు ఎవరైనా గెలుపోటములను భుజానికెత్తుకునేది రెడ్డి నేతలే. గత ఐదేళ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదని, ఈసారి మార్పు తప్పదని కోడుమూరుకు చెందిన పీజీ విద్యార్థి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గం గట్టిగా పనిచేస్తే తెదేపా గెలుపు ఖాయమని భావిస్తున్నారు.
పత్తికొండ.. అభివృద్ధి సున్నా
పత్తికొండలో వైకాపా అభ్యర్థి కంగాటి శ్రీదేవి గెలుపొందినా ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. పట్టణంలో 2.5 కిలోమీటర్ల రోడ్ల విస్తరణ హామీని పూర్తి చేయలేకపోవడం, హంద్రీనీవా కాలువ నుంచి పైపులైను వేసి వేసవిలో సమస్య లేకుండా చేస్తానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడం లాంటివి వైకాపా గెలుపునకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్కుమార్ రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి వైకాపాపై వ్యతిరేకత, శ్యామ్కుమార్పై సానుభూతి తెదేపా గెలుపునకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.
ఆలూరు.. కష్టపడితే సైకిల్దే పరుగు
గత ఐదుసార్లుగా ఆలూరు తెదేపాకు అందని ద్రాక్షగా మారింది. వైకాపాను గెలిపించినా సాగునీరే కాదు.. కనీసం తాగునీరూ ఇవ్వలేకపోయారని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సిటింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్ తెదేపాలో చేరి ఈసారి గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నారు. వైకాపా స్థానిక జడ్పీటీసీ సభ్యుడు బి.విరూపాక్షికి, తెదేపా బి.వీరభద్రగౌడ్కు అవకాశమిచ్చాయి. ఈసారి ప్రజలు బలంగా మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో తెదేపా నేతలు కష్టపడితే ఇక్కడ సైకిల్ పరుగు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!