Oxygen Mask: ఆక్సిజన్ మాస్క్కు మంటలు.. రోగి మృతి
ఆక్సిజన్ మాస్క్కు మంటలు రావడంతో రోగి మృతి చెందిన ఘటన రాజస్థాన్ కోట పట్టణంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
కోట: ఆక్సిజన్ మాస్క్కు మంటలు రావడంతో రోగి మృతి చెందిన ఘటన రాజస్థాన్ కోట పట్టణంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వైభవ్ శర్మ(23) అనే వ్యక్తి అనారోగ్యంతో న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న అతడికి బుధవారం రాత్రి వైద్యులు డైరెక్ట్ కరెంట్ కార్డియోవెర్షన్ షాక్ ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆక్సిజన్ మాస్క్కు మంటలు వచ్చాయని, దీంతో వైభవ్ మృతి చెందాడని అతడి బంధువులు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. అయితే ఆసుపత్రి అధికారులు దీన్ని ఖండించారు. వైభవ్కు టీబీ ఉందని, ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే అతడు మరణించాడని తెలిపారు. ఆక్సిజన్ మాస్క్కు మంటలు రావడం వాస్తవమే అయినా, అతడి మరణానికి అది కారణం కాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిపుణుల బృందంతో దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!