Kothagudem: డ్రైనేజీలో జారిపడి మహిళా కానిస్టేబుల్ మృతి
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లిన ఓ మహిళా హెడ్కానిస్టేబుల్ మురుగు కాలువ(డ్రైనేజీ)లో గల్లంతై మృత్యువాతపడ్డారు.
మంత్రి పర్యటన బందోబస్తు నేపథ్యంలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్టుడే: మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లిన ఓ మహిళా హెడ్కానిస్టేబుల్ మురుగు కాలువ(డ్రైనేజీ)లో గల్లంతై మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సారథినగర్కు చెందిన రూపన శ్రీదేవి (49) కొత్తగూడెంలో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీదేవి భద్రాచలంలో బందోబస్తుకు వెళ్లారు. ఆలయ అన్నదాన సత్రం వద్ద విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. వర్షంతో మంత్రి పర్యటన రద్దయింది.
ఈ క్రమంలో సత్రంలోకి వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ మధ్యలోనున్న మురుగు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్మికుడు సునీల్.. ఆమె చేయి పట్టుకుని బయటకులాగే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయారు. అనంతరం సమీప గోదావరి కరకట్ట స్లూయిస్ పైపుల వద్ద శ్రీదేవి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. 1995వ బ్యాచ్కు చెందిన శ్రీదేవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఆమె భర్త రామారావు జిల్లా కేంద్రంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బందోబస్తు విధులకు వెళ్లిన కానిస్టేబుల్ మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!