Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
ఐస్క్రీం కావాలని మారాం చేసి తండ్రిని షాపింగ్ మాల్కు తీసుకెళ్లిన చిన్నారి అక్కడి ఫ్రిజ్ను తాకి విద్యుదాఘాతంతో మరణించిన విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్లో సోమవారం చోటు చేసుకుంది.
ఆర్మూర్, న్యూస్టుడే: ఐస్క్రీం కావాలని మారాం చేసి తండ్రిని షాపింగ్ మాల్కు తీసుకెళ్లిన చిన్నారి అక్కడి ఫ్రిజ్ను తాకి విద్యుదాఘాతంతో మరణించిన విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ నియోజకవర్గం నవీపేటకు చెందిన గూడురు రాజశేఖర్ ఆదివారం తన కుటుంబంతో కలిసి నందిపేట్లోని అత్తారింటికి వచ్చారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఊరికెళ్తుండగా.. కుమార్తె రిషిత(4) ఐస్క్రీం కావాలని కోరింది. దీంతో నందిపేట్లోని ఎన్మార్ట్ మాల్కు తీసుకెళ్లారు. తండ్రి ఒక ఫ్రిజ్లో వస్తువులు చూస్తుండగా.. పక్కనున్న మరో ఫ్రిజ్ను తెరిచేందుకు రిషిత దాని డోర్ను పట్టుకుంది. విద్యుదాఘాతానికి గురై అలానే బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి గమనించిన తండ్రి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పసిపాప బలైందని కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహంతో మాల్ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Vizag: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి
విశాఖ నగరం మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. -
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. -
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి మెసేజ్ పెట్టి యువకుడి ఆత్మహత్య
ఒక పక్క ప్రైవేట్ ఆర్థిక సంస్థ ఒత్తిళ్లు.. మరో పక్క ఇష్టపడిన యువతి నుంచి స్పందన తక్కువగా ఉండటం.. వీటితో మానసిక ఒత్తిడి గురైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీ దహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఓ లారీని దహనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మండలంలోని పూసుగుప్పలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. -
కోటాలో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం మరో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
గ్లాస్ డోర్ మీదపడి చిన్నారి మృతి
పంజాబ్లోని లుధియానా షోరూంలో గ్లాస్ డోర్తో ఆడుకొంటున్న మూడేళ్ల చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. నగరంలోని ఘుమార్ మండీ వస్త్రదుకాణంలో ఈ దుర్ఘటన జరిగింది. -
యూపీలో అపహరణ.. హైదరాబాద్లో అత్యాచారం
ఉత్తర్ప్రదేశ్కు చెందిన 13 ఏళ్ల బాలికను అపహరించిన ఓ వ్యక్తి హైదరాబాద్లో ఆమెపై వారం రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
విశ్రాంత ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.25 కోట్లు మాయం
ఓ విశ్రాంత ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.25 కోట్లు మాయమవ్వడంతో కోరుట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
కాల్పులకు తెగబడిన దుండగులను చీపురు కర్రతోనే తరిమికొట్టిందో మహిళ. హరియాణాలో ఈ ఘటన ఇది వెలుగుచూసింది.


తాజా వార్తలు (Latest News)
-
Rushikonda: రుషికొండ తవ్వకాలపై పిల్.. హైకోర్టులో విచారణ
-
BCCI: వీడిన ఉత్కంఠ.. భారత ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగింపు
-
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం.. ఇది రష్యా కుట్రేనా..?
-
నిర్మాత వ్యాఖ్యలపై కోలీవుడ్ డైరెక్టర్స్ ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన జ్ఞానవేల్ రాజా
-
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటన.. ‘రో-కో’ జోడీ అన్ని సిరీస్లకు అందుబాటులో ఉండదా..?
-
H-1B visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్!