కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది.
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధమైన గంటల్లోనే బెట్టు సడలింపు
హమాస్ ప్రతిపాదన మా డిమాండ్లకుఅనుగుణంగా లేదు
రఫాపై సైనిక చర్య కొనసాగుతుంది
టెల్అవీవ్ ప్రకటన
జెరూసలెం: ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. ఈజిప్టు, ఖతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే హమాస్ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, రఫా ఆపరేషన్ కొనసాగుతుందని ఇజ్రాయెల్ ఉద్ఘాటించింది. ‘‘హమాస్పై సైనిక ఒత్తిడి పెంచడానికి, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడానికి, ఇతరత్రా యుద్ధ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సైనిక చర్య తప్పదు. ఇజ్రాయెల్ డిమాండ్లకు అనుగుణంగా ఒప్పందం ఖరారుకోసం మా ప్రతినిధుల్ని చర్చలకు పంపుతాం’’ అని ప్రధాని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అంతకుముందు రఫా నగరాన్ని వీడి వెళ్లాల్సిందిగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ హెచ్చరించింది. వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన అల్-మవాసీ వైపునకు తరలివెళ్లడం కూడా ప్రారంభించారు. ఏ క్షణమైనా రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతుందన్న సంకేతాలూ వెలువడ్డాయి. గాజాలో సైరన్లు మోగాయి. ఇక దాడే తరువాయి అన్న పరిస్థితుల్లో కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిందన్న ప్రకటనతో గాజాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి.
షరతులపై అయోమయం
ఏ ఒప్పందానికి హమాస్ అంగీకరించిందన్న విషయంపైనా స్పష్టత రాలేదు. 40 రోజుల కాల్పుల విరమణ.. 33 మంది బందీల విడుదల.. ప్రతిగా భారీస్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే ఇప్పుడు హమాస్ అంగీకరించిన విరమణకు ఇజ్రాయెల్ సమ్మతించడం లేదు. తాము తెలిపిన ప్రతిపాదన ఇది కాదని మాత్రం స్పష్టంచేస్తోంది.
కాల్పుల విరమణకు తమ నేత ఇస్మాయిల్ హనియా అంగీకరించినట్లు హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఆయన ఖతార్ ప్రధానికి, ఈజిప్టు ఇంటెలిజెన్స్ మంత్రికి కూడా ఫోన్ చేసి చెప్పినట్లు పేర్కొంది. తొలి నుంచి హమాస్ శాశ్వత కాల్పుల విరమణను కోరుతోంది. అయితే తాత్కాలిక విరమణకు మాత్రమే అంగీకరిస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. మరిప్పుడు ఏ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించిందన్న విషయంపై స్పష్టత రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
పంచన్ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. -
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ భారీ ఉల్క కనువిందు చేసింది. ఇది నేలరాలే సమయంలో వచ్చిన వెలుగుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. -
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉన్న ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. -
రణరంగంగా తైవాన్ పార్లమెంటు
ఓ బిల్లుపై చర్చ సందర్భంగా తైవాన్ పార్లమెంటులో అధికార, విపక్ష ఎంపీలు పరస్పర దాడులకు దిగారు. ఒకరినొకరు ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. -
సింగపూర్లో మళ్లీ కొవిడ్ అలజడి
కొవిడ్-19 మహమ్మారి సింగపూర్లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్ యె కుంగ్ తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (4)
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న మినీ ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతి చెందారు. -
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు
కిర్గిజ్స్థాన్లోని భారత విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు